11 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
10 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ చదువు మాత్రమే మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారుచేస్తుంది, అందుకే చదువు పట్ల చాలా-చాలా అటెన్షన్ పెట్టాలి”
ప్రశ్న: -
తండ్రి ద్వారా పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది, అది ఏ తీర్థ స్థానాలకు లేక అడవులకు వెళ్ళినా కూడా లభించదు?
జవాబు:-
తండ్రి ద్వారా పిల్లలకు సుఖం-శాంతి-సంపదల వారసత్వం లభిస్తుంది, అది ఇంకెక్కడా లభించదు. మనుష్యులు శాంతి కోసం అడవులకు వెళ్తారు, కానీ శాంతి అనేది ఆత్మలైన మన స్వధర్మమని మీకు తెలుసు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము…
ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడు మీరు సనాథలుగా అయ్యారు. మిగిలిన మనుష్య మాత్రులందరూ అనాథలుగా ఉన్నారు. నాథుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. ఇంట్లో గొడవపడుతున్నప్పుడు, మీకు ప్రభువు-స్వామి ఎవరూ లేరా అని అంటారు. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని మనుష్యమాత్రులందరూ గొడవపడుతూ, పోట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా. ఈ కామమనేది మహాశత్రువు అని, దీనితో అందరూ ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారని తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు, మాకు శాంతి కావాలని అంటారు. కానీ శాంతి అంటే ఏమిటి, ఎక్కడ నుండి లభిస్తుంది, అడవులకు వెళ్ళడం వలన శాంతి లభిస్తుందా, సుఖ-శాంతులను ఎప్పుడు మరియు ఎవరు ఇస్తారు, తీర్థ యాత్రలకు ఎందుకు వెళ్తారు – ఈ విషయాలు కూడా ఎవ్వరికీ తెలియవు. భక్తి చేయడంతో భగవంతుడు లభిస్తారని మాత్రమే విన్నారు. కానీ భగవంతుడి గురించి కూడా తెలియదు. నేను వచ్చి పిల్లలైన మీకు సుఖ-శాంతులను ఇస్తానని తండ్రి అంటారు. ఇప్పుడు సుఖం-శాంతి, సంపదలు ఎవరి వద్దా లేవు. ఇచ్చేవారి గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు – దుఃఖహర్త, సుఖకర్త అని మీరు పాడుతారు కూడా. గాంధీజీ కూడా – ఓ పతితపావనా, వచ్చి పావనంగా తయారుచేయండి అని పిలిచేవారు. పతిత-పావన సీతారామ అని పాడుతారు, కానీ అర్థం తెలియదు. భక్తి ఎందుకు చేస్తారు, దాని నుండి ఏం లభిస్తుంది అనేది ఏమీ తెలియదు. ఈ భక్తి కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ద్వాపరం నుండి రావణ రాజ్యం మొదలవుతుంది. రావణుడు ఎవరు, ఎప్పటి వరకు రావణుడిని కాలుస్తూ ఉంటారు అనేది మనుష్యులకు తెలియదు. అతని జన్మ ఎప్పుడు జరిగింది, అయినప్పటికీ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తారు. ఆత్మ ఎప్పుడూ కాలదు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. లక్ష్మీనారాయణులనే భగవతి-భగవాన్ అని అంటారు. తర్వాత త్రేతాలో రామ రాజ్యముండేది. వారికి ఈ రాజ్యం ఎలా లభించింది, తర్వాత ఆ రాజ్యం ఎక్కడకు వెళ్ళింది అనేది ఎవ్వరికీ తెలియదు, అనగా రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఈ జ్ఞానం ద్వారా స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్కూలులో చదువు ద్వారా కొందరు వకీలుగా, జడ్జీలుగా అవుతారు, లక్ష్మీనారాయణులుగా అవ్వరు. వీరు ఏ చదువు ద్వారా పదవిని పొందారు అనేది ఎవ్వరికీ తెలియదు. భగవానువాచ – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. నేను మిమ్మల్ని ఈ విధంగా తయారుచేస్తాను అని చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. ఈ లక్ష్మీనారాయణుల వంశం ఈ చదువు ద్వారానే తయారయ్యిందని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. లక్షల సంవత్సరాలని సత్యయుగం గురించి కూడా అంటారు. అటువంటప్పుడు, లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారు అనేది ఎలా తెలుస్తుంది. భారత్ లోనే లక్ష్మీనారాయణుల అనేక చిత్రాలున్నాయని చూస్తున్నారు కూడా. ఎన్నో మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. వీరి నుండి మాకు ధనం లభిస్తుందని భావిస్తారు. ప్రతి దీపావళి నాడు మహాలక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు, కానీ లక్ష్మితో పాటు తప్పకుండా నారాయణుడు కూడా ఉంటారు. దీపావళి రోజున పూజ చేస్తారు, అప్పుడు వారికి అల్పకాలిక సుఖం యొక్క భావన పూర్తవుతుంది, అందుకే లక్ష్మి నుండి ధనం లభిస్తుందని భావిస్తారు. వాస్తవానికి లక్ష్మీ-నారాయణులు ఇరువురూ ఉంటారు. లక్ష్మి, మహాలక్ష్మి వేర్వేరు కాదు, ఈ విషయాలు మనుష్యులకు తెలియదు. బాబాయే అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో మనుష్యులు, ఈశ్వరుడు రాళ్ళు-రప్పలలో ఉన్నారని అంటారు. తండ్రి అంటారు – అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పారసబుద్ధి కలవారు సత్యయుగంలో ఉంటారు. లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు బంగారం-వజ్రాల మహళ్ళు ఉండేవి. ఇది 5 వేల సంవత్సరాల విషయము. శాస్త్రాలలో కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసేసారు. తండ్రి అంటారు – ఈ భక్తి మార్గం వలన మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది. డ్రామానుసారంగా దుర్గతిని పొందినప్పుడు నేను వస్తాను, వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు రాజయోగం నేర్చుకుంటున్నారు. ఈ మహాభారత యుద్ధంతో పాత ప్రపంచ వినాశనం జరుగుతుందని మీకు తెలుసు. ఇది తయారై తయారవుతున్న డ్రామా. సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యముండేది. 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. 2500 సంవత్సరాలు సూర్యవంశీయులు, చంద్రవంశీయుల రాజధానులు కొనసాగాయి. ఇకపోతే, ద్వాపరం నుండి రావణ రాజ్యం మొదలయ్యింది. మనుష్యులు పతితులుగా అవుతూ ఉంటారు. కానీ మమ్మల్ని పతితులుగా ఎవరు తయారుచేసారు అనేది వారికి తెలియదు. మనం పావనంగా ఉండేవారము, పతితులుగా ఎలా అయ్యాము అనేది తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం మొదలవడంతో మీరు పతితులుగా అవుతూ ఉంటారు. రావణుడు జన్మించి ఇప్పటికి 2500 సంవత్సరాలయ్యింది. శివబాబా జన్మించి 5 వేల సంవత్సరాలయ్యింది. దానిని రామ రాజ్యమని, దీనిని రావణ రాజ్యమని అంటారు. వాస్తవానికి రామ అని అనకూడదు. ఈ రోజుల్లో మనుష్యులకు రామచంద్ర, కృష్ణచంద్ర అని పేర్లు పెడతారు. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది. దానిని బంగారుయుగపు ప్రపంచం అని అంటారు. వైకుంఠముండేది, కానీ ఎక్కడ ఉండేది అనేది వారికి తెలియదు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటి – ఏమీ తెలియదు, అందుకే వారిని తుచ్ఛ బుద్ధి కలవారని అంటారు. ఋషులకు, మునులకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. అందుకే నేతి-నేతి (తెలియదు, తెలియదు) అని అంటారు. వారికి తండ్రి గురించి కానీ, వారసత్వం గురించి కానీ తెలియదు. తండ్రి ద్వారా విశ్వ రాజ్యం యొక్క వారసత్వం ఏదైతే లభిస్తుందో, దాని గురించి కూడా తెలియదు. ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు, కనుక మీరు డబల్ ఆస్తికులు అయినట్లు. శాంతి ఎవరి నుండి లభిస్తుంది మరియు ఎక్కడ నుండి లభిస్తుంది అన్న విషయం కూడా మనుష్యులకు తెలియదు. సన్యాసుల వద్దకు వెళ్ళి, మాకు శాంతి కావాలని అంటారు. ఇప్పుడు మనకు శాంతి ఎక్కడ నుండి వస్తుంది? కర్మలనైతే చేయాలి కదా. శాంతి అయితే శాంతిధామంలో లభిస్తుంది. ఒకవేళ ఇంట్లో ఒక్కరు అశాంతిగా ఉన్నా, మొత్తం ఇంటిని అశాంతిగా చేసేస్తారు. శాంతి స్వీట్ హోమ్ లో (మధురమైన ఇంట్లో) లభిస్తుంది. తర్వాత అక్కడ నుండి తండ్రి ఆత్మలైన మనల్ని పాత్రను అభినయించేందుకు కొత్త ప్రపంచంలోకి పంపిస్తారు. తండ్రి నరకంలోకి పంపించరు. శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు. ఇది భగవంతుని పాఠశాల, ఇది సత్సంగమేమీ కాదని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ పిల్లల కోసం భగవానువాచ ఉంటుంది. నిరాకార శివబాబా శరీరంలోకి ప్రవేశించి పిల్లలైన మీతో మాట్లాడుతారు. ఆత్మ కూడా శరీరంలో ఉంది కదా. ఆత్మకు కర్మేంద్రియాలు లభించినప్పుడు మాట్లాడుతుంది, వింటుంది. ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మలను చదివిస్తున్నారు. పరమాత్మను, ఓ పతితపావనా…..ఓ సద్గతి దాత, లిబరేటర్, గైడ్ అని పిలుస్తారు. కానీ ముక్తులుగా ఎలా చేస్తారు, మళ్ళీ గైడ్ గా అయి ఎక్కడకు తీసుకువెళ్తారు అనేది వారికి తెలియదు. కేవలం ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ వచ్చారు. పిల్లలైన మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. స్వయం వారే మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తారు. తర్వాత మీ అంతట మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి అందరికీ గైడ్ గా అవుతారు. తర్వాత కొత్త ప్రపంచంలో తండ్రి గైడ్ చేయరు. ఈ సమయంలో మనుష్యులంతా పతితులుగా ఉన్న కారణంగా, మేము తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు, ఎగరలేరు. అక్కడకు వెళ్ళేందుకు చాలా భక్తి చేస్తారు కానీ మేము పతితులము అందుకే వెళ్ళలేము అన్న విషయం తెలియదు. పతితపావనుడైన తండ్రి వచ్చి పావనంగా తయారుచేసినప్పుడు మనం వెళ్ళగలము. ఇప్పుడు పావనంగా తయారయ్యేందుకు తండ్రి మీకు యుక్తిని తెలియజేస్తారు. అందరూ పతితుల నుండి పావనులుగా అవ్వాల్సిందే. ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారు. సత్యయుగంలో దేవతల రాజ్యమున్నప్పుడు కొత్త వృక్షంలో 9 లక్షల మంది ఉంటారు. ముందు కొన్ని ఆకులే ఉంటాయి కదా. తర్వాత వృక్షం పెద్దదవుతూ ఉంటుంది. ముందు ఒక్క ధర్మం వారే ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నరకవాసులుగా భావించరు, మిగిలినవారంతా నరకవాసులు. కానీ తమను తాము ఆ విధంగా భావించరు. ఈ సమయంలో ముఖాలైతే అందరివీ మనుష్యుల వలె ఉన్నాయి కానీ గుణాలు కోతుల వలె ఉన్నాయి. పెద్ద-పెద్ద రాజులు కూడా లక్ష్మీనారాయణుల చరణాలపై తల వంచుతారు. ఇప్పుడు వారేమీ పతితులను పావనంగా తయారుచేసేవారు కాదు, దయాహృదయులు కాదు. ఎవరైనా దుఃఖితులుగా ఉన్నప్పుడు వారిపై దయ చూపించడం జరుగుతుంది. దయాహృదయుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రియే వచ్చి రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు దేవతలుగా తయారువుతున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే పాఠశాల. ఇది రాజయోగము. ఋషులు-మునులకు, గీతలోని రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అనేది తెలియదు. గీతను పూర్తిగా ఖండించారు. కృష్ణుడు రాజయోగాన్ని నేర్పించారని అనుకుంటారు. కృష్ణ భగవానువాచ – ‘మన్మనాభవ’ అని అంటారు. ఇప్పుడు కృష్ణుడైతే పరమాత్మ కాదు. వారు సత్యయుగ రాకుమారుడు. వారే సంగమయుగంలో రాజయోగాన్ని నేర్చుకొని రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. వారిని భగవంతునిగా చేసేసారు. ఎంతోమంది మనుష్యులు గీతను వింటారు. కానీ గీతా భగవంతుడు శివుడు, కృష్ణుడు కాదు అని ఒక్కరికి కూడా తెలియదు. అందరూ ఒక్కటేనని అంటారు. కొంతమంది మనుష్యుల విషయంలో తల బాదుకోవలసి ఉంటుంది. 63 జన్మలుగా కృష్ణుడే భగవంతుడని భావిస్తూ వచ్చారు. ద్వాపరము నుండి శాస్త్రాలు తయారయ్యాయి. తప్పకుండా మొట్టమొదట గీత తయారై ఉంటుంది. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. జ్ఞాన మార్గానికి సంబంధించిన శాస్త్రం ఒక్కటి కూడా లేదు. గీత నంబరువన్. తర్వాత ఈ వేదాలు, ఉపనిషత్తులు తయారయ్యాయి. ఇవన్నీ కూడా గీత పిల్లలే. వీటిని చదువుతూ-చదువుతూ కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మొదటి నంబరులోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు మళ్ళీ సత్యయుగీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు ఇక్కడకు చదువుకోవడానికి వచ్చారు. అందరూ లక్ష్మీనారాయణులుగా అయితే అవ్వలేరు. ఈ రాజధాని స్థాపనవుతుంది కానీ రాజధానిని ఎవరు స్థాపన చేసారు అనేది ఎవ్వరి బుద్ధిలోకీ రాదు. కలియుగంలో ఎంతోమంది మనుష్యులున్నారు, వారికి తినేందుకు ధాన్యం కూడా లభించదు. సత్యయుగంలో కేవలం లక్ష్మీనారాయణుల రాజధాని ఉంటుంది. ఇక్కడ ఎన్ని ధర్మాలున్నాయో చూడండి. ఎదురుగా మహాభారీ మహాభారత యుద్ధం నిలబడి ఉంది, అయినా మనుష్యులు కళ్ళు తెరుచుకోవడం లేదు. ఈ మహాభారీ యుద్ధం కల్పక్రితం కూడా జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఏమీ తెలియదు. ఈ విషయాలన్నీ బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని తండ్రి బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని చదివించి ఈ లక్ష్మీనారాయణులుగా తయారుచేస్తారు కనుక బాగా చదువుకోవాలి. కేవలం తండ్రిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేసినట్లయితే మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ బాగా చదువుకొని మరియు చదివించినట్లయితే రాజా-రాణులుగా తయారవ్వగలరు. ఎంతగా ఆత్మిక సేవ చేస్తారో అంతగా తయారవుతారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మిగిలిన ప్రపంచమంతా దైహిక సమాజ సేవకులు. ఆత్మలైన మీకు తండ్రి రోజు జ్ఞానమిస్తారు. ఆత్మలకు సేవ చేస్తారు కదా. దీనిని ఆత్మలకు చేసే సేవ అని అంటారు, దీనిని నేర్పించేవారు కూడా స్పిరిచ్యువల్ ఫాదర్ (ఆత్మిక తండ్రి). ఇది మనుష్యులను దేవతలుగా తయారుచేసే పాఠశాల, తప్పకుండా దేవతలుగా అవుతారు. మీరు చదువుకొని తయారైనప్పుడు వినాశనం మొదలవుతుంది, తర్వాత మీరు కూడా వెళ్ళిపోతారు. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు….. అని అంటారు కదా. కేవలం కొద్దిమంది మాత్రమే మిగులుతారు, వారు బదిలీ అవుతూ ఉంటారు. మీరు తర్వాత స్వర్గంలోకి వస్తారు. మీ కోసం ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపనవుతుంది. మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇప్పుడిది నరకము. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలుగా అవ్వకపోతే వారసత్వాన్ని తీసుకోలేరు. ఏ బ్రాహ్మణులైతే ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహధారులను గుర్తు చేయరో, వారికే వారసత్వం లభిస్తుంది. ఇకపోతే, ఎంతో కొంత విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మిక సమాజ సేవకులుగా అయి చదువుకోవాలి మరియు చదివించాలి. తండ్రితో పాటు రానున్న కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయాలి.
2. తండ్రి సమానంగా దయాహృదయులుగా అయి అందరినీ పారసబుద్ధి కలవారిగా తయారుచేసే సేవను చేయాలి.
వరదానము:-
పాత ప్రపంచంలోని ఏ ఆకర్షణీయ దృశ్యాన్ని చూసినా, అల్పకాలిక సుఖాన్నిచ్చే సాధనాలను ఉపయోగించినా లేక చూసినా, ఆ సాధనాలకు వశీభూతులైపోతారు. సాధనాల ఆధారంగా చేసే సాధన ఎలా ఉంటుందంటే, ఇసుక పునాదిపై బిల్డింగ్ ఉన్నట్లుగా ఉంటుంది. కనుక ఏ వినాశీ సాధనం ఆధారంగా అవినాశీ సాధన ఉండకూడదు. సాధనాలు నిమిత్త మాత్రము మరియు సాధన అనేది నిర్మాణానికి ఆధారము. కనుక సాధనకు మహత్వాన్ని ఇచ్చినట్లయితే సాధన సిద్ధిని ప్రాప్తింపజేయిస్తుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!