11 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
10 January 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానం యొక్క బుల్-బుల్ పిట్టగా అయి తమ సమానంగా తయారుచేసే సేవ చేయండి, నా స్మృతి యాత్ర సరిగ్గా ఉందా అని తమ మనసును ప్రశ్నించుకోండి’’
ప్రశ్న: -
ఏ విశేషమైన పురుషార్థంతో బికారుల నుండి రాకుమారులుగా అవ్వగలరు?
జవాబు:-
బికారుల నుండి రాకుమారులుగా అయ్యేందుకు బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా గుర్తు రాకూడదు. ఈ శరీరం కూడా నాది కాదు. ఇలా జీవిస్తూ మరణించే పురుషార్థం చేసేవారే బికారులు, వారిదే వానప్రస్థ అవస్థ ఎందుకంటే ఇప్పుడైతే తండ్రితో పాటు ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సుఖధామంలోకి రావాలి అని బుద్ధిలో ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు, చదువులో ఏ విషయం పట్ల ఎక్కువ అటెన్షన్ పెట్టాలి అని. సర్వ గుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా, మర్యాదా పురుషోత్తములుగా, అహింసా పరమో ధర్మం వారిగా అవ్వాలి. మాలో ఈ గుణాలన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి. ఎలా తయారవ్వాలో, అటువైపే ధ్యాస వెళ్తుంది కదా. ఈ విధంగా ఎలా తయారవుతారు? చదువుకోవడం మరియు చదివించడంతో అలా తయారవుతారు. అనంతమైన తండ్రిని రోజంతటిలో ఎంత స్మృతి చేస్తారు, ఎంతమందిని చదివిస్తారు! సంపూర్ణంగా అయితే ఇంతవరకు ఎవరూ తయారవ్వలేదు. నంబరువారు పురుషార్థం అనుసారంగా ఉన్నారు. తండ్రి ఒక్కొక్క బిడ్డపై దృష్టి పెడతారు, ఈ బిడ్డ ఏం చేస్తున్నారు! నా కోసం ఏ సేవ చేస్తారు! ఎంతమంది భాగ్యాన్ని ఉన్నతోన్నతంగా తయారుచేస్తున్నారు? ప్రతి ఒక్కరికి తమ అవస్థ మరియు తమ సంతోషం గురించి కూడా తెలుసు. అతీంద్రియ సుఖం యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఎవరిది వారికి అనుభవమవుతుంది. తండ్రి స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు అని అయితే పిల్లలకు నిశ్చయం ఉంది. స్మృతి యాత్రనే సహజమైన ఉపాయము. తమ మనసును ప్రశ్నించుకోవాలి – మా స్మృతి యాత్ర బాగుందా? ఇతరులను తమ సమానంగా తయారుచేస్తున్నామా? జ్ఞానం యొక్క బుల్ బుల్ పిట్టగా అయ్యామా? బ్రాహ్మణులైన మీరే దైవీ గుణాలను ధారణ చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఎవరూ లేరు. మీరే దైవీ వంశం యొక్క సభ్యులుగా అవుతారు. అక్కడ మీది దైవీ పరివారము. ఇప్పుడు మీకు తెలుసు, మేము దైవీ పరివారానికి చెందినవారిగా అయ్యేందుకు చాలా పురుషార్థం చేస్తున్నాము అని. పిల్లలు చదువుకోవడం కూడా నియమానుసారంగా చదువుకోవాలి. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు. అనారోగ్యంగా ఉన్నా, మంచంపై పడి ఉన్నా కూడా బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఆత్మకు తెలుసు, మేము బాబా పిల్లలము, బాబా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు అని. ఎంత సహజమైన స్మృతి. ఈ ప్రాక్టీస్ కూడా కావాలి. బుద్ధిలో ఒక్క బాబా స్మృతే ఉండాలి. బాబా వచ్చారు, మేము శాంతిధామంలోకి వెళ్ళి, తర్వాత సుఖధామంలోకి రానున్నాము. చివరి వరకు ఎంత శ్రమ చేయాలి అంటే ఒక్క శివబాబా స్మృతే ఉండాలి. ఇతర సాంగత్యాలను తెంచి, ఒక్కరితో సాంగత్యాన్ని జోడించాలి. నోటితో ఏ జపం చేయకూడదు, ఇతరులను తమ సమానంగా తయారుచేసేందుకు చదివించాలి కూడా. తండ్రి అర్థం చేయిస్తారు, ఏ సతోప్రధాన అవస్థలోనైతే మీరు ఇక్కడకు వచ్చారో, ఆ అవస్థలో మీరు వెళ్ళాలి, ఆ అవస్థలో వెళ్ళి మళ్ళీ అదే అవస్థలో సత్యయుగంలోకి రావాలి. ఇది ఎంత సహజము. మీరు భక్తి మార్గంలో పాడేవారు, మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మేము ఇతర సాంగత్యాలను తెంచి ఒక్క మీతో సాంగత్యాన్ని జోడిస్తాము అని, ఇందులో శ్రమ ఉంది. పవిత్రత యొక్క విషయం కూడా ముఖ్యమైనది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. ఆ కమలము కూడా నీటికి, ధరణికి పైన ఉంటుంది. చైతన్య పుష్పాలైన మీరు కూడా ధరణి పైన ఉన్నారు కావున మీరు కూడా ప్రతిజ్ఞ చేయాలి – మేము పవిత్రంగా ఉంటూ ఒక్క మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, ఎంతగా అంటే అంతిమంలో మీది తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఏ అవగుణం కూడా ఉండకూడదు. ఏ పిల్లలైతే ఈ విధంగా తయారవుతారో, వారు సదా హర్షితంగా ఉంటారు. ఈ ప్రాక్టీస్ మంచి రీతిలో చేయాలి. పిల్లలకు తెలుసు, అప్పుడప్పుడు అవస్థ వాడిపోతుంది. మాయ ఒక్కసారిగా ముట్టుకుంటే ముడుచుకుపోయే వారిగా చేసేస్తుంది. ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవడం చాలా అవసరము. మేము ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటూ హర్షితంగా ఉంటున్నాము! తండ్రి సేవలో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము! ఎవరు ఎలా ఉన్నా కానీ, పిల్లలైన మీరు సేవ చేస్తూనే ఉండాలి. వారసత్వం పొందేందుకు యోగ్యులు ఎవరు అనేది చెక్ చేస్తారు! ఉదాహరణకు, తేలుకు తెలుస్తుంది – ఇది రాయి నా లేక మెత్తని వస్తువా అని, కనుక రాయిపై ఎప్పుడూ కాటు వేయదు. మీ వ్యాపారమే ఇది. మీరు అనంతమైన తండ్రి యొక్క విద్యార్థులు కదా. చదువు పై చాలా ఆధారపడి ఉంది. ప్రారంభంలో పిల్లలు మురళీ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోయేవారు, ఎంతగా తపించేవారు. (క్లాసులో పెద్ద అక్కయ్యలు పాట వినిపించారు – మీ మురళీలో ఇంద్రజాలము… అని) బంధనంలో ఉన్నవారికి మురళీని ఎలా అందించేవారు! మురళీలోనే ఇంద్రజాలం ఉంది కదా. ఏ ఇంద్రజాలము? విశ్వం యొక్క యజమానులుగా అయ్యే ఇంద్రజాలము. దీని కన్నా పెద్ద ఇంద్రజాలం ఏదీ ఉండదు. అయితే, ఆ సమయంలో మురళీ పట్ల మీకు ఎంత గౌరవం ఉండేది. మురళీని అందించేందుకు ఎంత ప్రయత్నించేవారు. చదువు లేకపోతే పాపం వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అనుకునేవారు. బాబాకు తెలుసు, మురళీ పట్ల పూర్తి ధ్యాస పెట్టనే పెట్టనటువంటి పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మురళీ అయితే పిల్లలను రిఫ్రెష్ చేస్తుంది. భగవంతుడు, ఎవరైతే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారో, వారి మురళీ వినకపోతే టీచర్ అయిన భగవంతుడు ఏమంటారు. బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నడుస్తూ-నడుస్తూ చాలామంది పిల్లలకు మాయా తుఫాను ఎలా వస్తుంది అంటే మురళీ చదవడం, క్లాసుకు రావడం మానేస్తారు. జ్ఞానం పట్ల ద్వేషము అనగా బాబా పట్ల ద్వేషము. తండ్రి పట్ల ద్వేషము అనగా విశ్వ రాజ్యాధికారం పట్ల ద్వేషము. మాయ పూర్తిగా కిందకు తీసుకువెళ్ళిపోతుంది. ఏమీ అర్థం చేసుకోని విధంగా బుద్ధిని పూర్తిగా హతమార్చేస్తుంది. భక్తి అయితే చాలా చేస్తారు కానీ పూర్తిగా అంధ విశ్వాసం కలవారిగా, తెలివిహీనులుగా అయిపోయారు. తండ్రి స్వయంగా అంటారు, మీరు ఎంత యోగ్యులుగా ఉండేవారు. ఇప్పుడు అయోగ్యులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని యోగ్యులుగా చేసేందుకు నేను మళ్ళీ వచ్చాను, అందుకే శ్రీమతంపై తప్పకుండా నడుచుకోవాలి. తండ్రి అంటారు, ఇందులో ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు, కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు చదువుకోండి. స్కూల్ లో పిల్లలు చదువుకుంటారు కూడా మరియు టీచర్ ను కూడా గుర్తు చేసుకుంటారు. క్యారెక్టర్ (నడవడిక)ను కూడా సరిదిద్దుకోవాలి. మీకు కూడా లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఇలా తయారవ్వాలి, వారి క్యారెక్టర్ (నడవడిక) బాగుంది, అందుకే రోజంతా మనుష్యులు వారి కోసం – మీరు సర్వ గుణ సంపన్నులు… అని పాడుతారు. మనుష్యులకు ఎప్పటివరకైతే తండ్రి పరిచయం లభించలేదో, అప్పటి వరకు అంధకారంలో ఉన్నారు. మొత్తం ప్రపంచంలోని మనుష్యులందరూ ఈ సమయంలో అనాథలుగా ఉన్నారు. వారికి తండ్రి సందేశాన్ని అందించాలి. మీరు అనంతమైన తండ్రి యొక్క పిల్లలు కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరికీ సందేశాన్ని ఎలా అందించాలి అని పిల్లలు యుక్తులను తీయాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు అనే సందేశం వార్తాపత్రికల ద్వారానే అందరికీ అందుతుంది. ఆత్మలందరూ మొదట పావనంగా ఉండేవారు, ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఇక్కడ పవిత్ర ఆత్మలు ఎవ్వరూ ఉండజాలరు. పవిత్ర ఆత్మలు పవిత్ర ప్రపంచంలో ఉంటారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది, అప్పుడిక ఈ పాత శరీరాన్ని వదలాల్సిందే. ఆత్మ పావనంగా ఉండడం మరియు శరీరం పతితంగా ఉండడం అనేది జరగజాలదు, కావున బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ స్వయాన్ని తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారుచేసుకోవాలి. మొట్టమొదట మీరు వచ్చినప్పుడు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయి వెళ్తుంది, మళ్ళీ పవిత్ర ప్రపంచంలో వస్తుంది. శాంతిధామానికి వెళ్ళి, తర్వాత గర్భ మహలులోకి వస్తారు. అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు. రావణ రాజ్యమే లేదు. కానీ పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి, దీని కోసమే ఈ చదువు ఉంది. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు, కానీ ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి. స్వర్గం యొక్క స్థాపన మరియు నరకం యొక్క వినాశనం జరుగుతూ ఉంది అనైతే తెలుసు. శివాలయం స్థాపన అయితే వేశ్యాలయం సమాప్తమైపోతుంది. శివాలయంలోకైతే రావాల్సిందే. కొందరు ఈ శరీరాలను విడిచిపెట్టి వెళ్ళి రాకుమారులు, రాకుమార్తెలుగా అవుతారు. కొందరు ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఎవరి లైన్ అయితే పూర్తిగా క్లియర్ గా ఉందో, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి కలగదో, వారిని పూర్తి బికారి అని అనడం జరుగుతుంది. శరీరాన్ని కూడా గుర్తు చేయకూడదు అనగా జీవిస్తూ మరణించాలి. మనమైతే ఇప్పుడు మన అనంతమైన ఇంటికి వెళ్ళాలి. మన ఇంటిని మర్చిపోయాము. ఇప్పుడు తండ్రి స్మృతినిప్పించారు.
తండ్రి మధురాతి-మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు, మీరు వానప్రస్థులు. ఈ సమయంలో మీ అందరిదీ వానప్రస్థ అవస్థ. వాణి నుండి అతీతమైన స్థానానికి పిల్లలందరినీ తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను వచ్చాను. వానప్రస్థ అవస్థలోకి వెళ్ళేందుకు భక్తులందరూ భక్తి చేస్తారు. అందరూ వానప్రస్థ అవస్థలోకి ఎలా వెళ్తారు అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. వారికి ఈ పదం యొక్క అర్థం గురించి కూడా తెలియదు, కేవలం ఆ పేరు విన్నారు. అయితే, ద్వాపరం నుండి మొదలుకొని లౌకిక గురువుల ద్వారా చాలా పురుషార్థం చేసారు కానీ తిరిగి అయితే ఎవరూ వెళ్ళలేరు. తండ్రి అంటారు, ఇప్పుడు చిన్న మరియు పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థ. సత్యాతి-సత్యమైన వానప్రస్థ అవస్థ అయితే మీది ఎందుకంటే తిరిగి వెళ్ళాలి. అనంతమైన తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. కావున పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. తండ్రే అందరినీ స్వీట్ సైలెన్స్ హోమ్ లోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు ఎందుకంటే ఆత్మలకు ఇప్పుడు శాంతి కావాలి. ఇక్కడైతే శాంతి ఉండజాలదు. శాంతిధామం యొక్క యజమాని అయితే ఒక్క బాబానే, ఎప్పుడైతే యజమాని వస్తారో, అప్పుడు అందరినీ తీసుకువెళ్తారు. శాంతిధామంలోకి వెళ్ళేందుకు భక్తి చేసేవారు. మేము సుఖధామంలోకి వెళ్ళాలి అని ఎవరూ అనరు. బాబా అంటారు, ఒకవేళ నా శ్రీమతంపై నడిచినట్లయితే, మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకువెళ్తాను అని నేను పిల్లలైన మీకు ప్రతిజ్ఞ చేస్తాను. ఎవరైనా సుఖధామంలోకి రాలేకపోయినా, శాంతిధామంలోకైతే తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరినీ విడిచిపెట్టను. ఎవరైనా రాకపోయినా శిక్షలనిచ్చి, దెబ్బలు తినిపించి అయినా తీసుకువెళ్తాను. ఎలాగైతే పిల్లలకు శిక్ష విధించడం జరుగుతుంది కదా, పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ విధంగా తీసుకువెళ్తాను ఎందుకంటే డ్రామాలో పాత్రయే ఈ విధంగా ఉంది, అందుకే తమ సంపాదన చేసుకొని వెళ్తే బాగుంటుంది. పదవి కూడా మంచిది లభిస్తుంది. చివర్లో వచ్చేవారు ఏం సుఖం పొందుతారు. బాబా అంటారు, మీరు కావాలన్నా, వద్దన్నా, మీ అందరి శరీరాలకు నిప్పు అంటించి ఆత్మలను తప్పకుండా తీసుకువెళ్ళేది ఉంది. నా మతంపై నడుచుకుని ఒకవేళ సర్వ గుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అయినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు ఎందుకంటే నన్ను పిలిచిందే – రండి, ఇంటికి తీసుకువెళ్ళండి అనగా మృత్యువును ఇవ్వండి అని. ఇక మృత్యువు అతి చేరువలో ఉంది అని అయితే అందరికీ తెలుసు. ఛీ-ఛీ గా ఉన్నవారు ఎవరూ ఇక్కడ ఉండేది లేదు. తండ్రి అంటారు, నేను అందరినీ ఛీ-ఛీ ప్రపంచం నుండి తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో, వారే సుఖధామంలోకి వస్తారు. సుఖధామం లేక స్వర్గం అనేది ఆకాశంలో ఏమీ లేదు. మీ స్మృతిచిహ్న మందిరం దిల్వాడా. ఆది దేవ్ కూర్చుని ఉన్నారు. బాప్ దాదా కదా. వీరి శరీరంలోనే బాబా విరాజమానమవుతారు. ఈ బాప్-దాదా, ఇరువురూ కూర్చుని ఉన్నారు అని మీకు తెలుసు. ఈ సమయంలో పిల్లలైన మీరు ఎవరైతే రాజయోగం నేర్చుకుంటున్నారో, వారి స్మృతిచిహ్నాన్ని మందిరంలో చూపించారు. మహారథులు, గుర్రపు సవారీ వారు కూడా ఉన్నారు. కల్ప-కల్పము ఖచ్చితంగా ఇటువంటి మందిరమే తయారవుతుంది. దానిని మీరు వెళ్ళి చూస్తారు. మీరంటారు, ఇవన్నీ కూలిపోతాయి కదా, మళ్ళీ ఎలా తయారవుతాయి? ఇలా ఆలోచించకూడదు. స్వర్గం ఇప్పుడు ఎక్కడుంది, మళ్ళీ స్వర్గం యొక్క మహళ్ళు ఉంటాయి. ఈ పర్వతాలు మొదలైనవి కూలిపోతాయి, మళ్ళీ తయారవుతాయి. ఆబూ మళ్ళీ కూడా తయారవుతుంది. చాలామంది పిల్లలు ఈ విషయంలో చాలా తికమకపడతారు. తండ్రి అంటారు, తికమకపడాల్సిన అవసరం లేదు. ద్వారకా సముద్రం కిందకు వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వస్తుంది అని అంటారు. ఏ వస్తువు అయినా కిందకు వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయినట్లే, సమాప్తమైపోతుంది. స్వర్గంలో మేము మా మహళ్ళు మొదలైనవి తయారుచేసుకుంటామని మీకు తెలుసు. అక్కడ అన్నీ పూర్తిగా సతోప్రధానమైన కొత్త-కొత్త వస్తువులు ఉంటాయి. మీరు అక్కడి ఫలాలు మొదలైనవాటిని చూసి వస్తారు. మనం అక్కడికి వెళ్ళనున్నాము అని మీకు తెలుసు. ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళికం రిపీట్ అవుతుంది అంటే స్వర్గం కూడా రిపీట్ అవుతుంది. ఈ నిశ్చయం ఉండాలి. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే, వారు అంటారు, ఇది ఎలా జరగగలదు, ఇంతమంది మళ్ళీ వస్తారు, మళ్ళీ మహళ్ళు మొదలైనవి తయారవుతాయి!
సోమనాథ మందిరాన్ని దోచుకొని వెళ్ళిపోతారు, అయినా కూడా మందిరాలను తయారుచేస్తారు అని మీకు తెలుసు. ఈ ఆటే పూజ్యుల నుండి పూజారులుగా, పూజారుల నుండి పూజ్యులుగా తయారయ్యేటటువంటిది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర… ఇది చక్రము. పిల్లలైన మీరు పదమాపదమ భాగ్యశాలిగా అవుతారు. మీ అడుగులో పదమాల ముద్ర పడుతుంది. మన అడుగులలో పదమాలు ఉన్నాయని మీకు తెలుసు అనగా చదువు యొక్క అడుగులలో పదమాలు ఇమిడి ఉన్నాయి. ఎంతగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. సత్యయుగం, బంగారు యుగము. అక్కడ ధరణి కూడా ఎంత సుందరంగా ఉంటుంది. ఎంత సుందరమైన మహళ్ళు తయారవుతాయి. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. చూడడంతోనే నయనాలు చల్లబడతాయి. ఇటువంటి రాజధానికి మీరు యజమానులుగా అవుతున్నారు కావున ఎంత మంచి రీతిలో పురుషార్థం చేయాలి. పురుషార్థంతోనే ప్రారబ్ధం తయారవుతుంది. పిల్లలకు జ్ఞానమైతే బుద్ధిలో ఉంది. తండ్రిని స్మృతి చేయాలి. లౌకిక సంబంధాల నుండి మమకారాన్ని తొలగించాలి, కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడూ వాడిపోకూడదు. అనారోగ్యంలో కూడా మురళీని తప్పకుండా వినాలి లేక చదువుకోవాలి.
2. చదువు ద్వారా అడుగడుగులోనూ పదమాలు జమ చేసుకోవాలి, ఇతర సాంగత్యాలను తెంచి, ఒక్క తండ్రితో జోడించాలి.
వరదానము:-
ఎలాగైతే బ్రహ్మాబాబా దృఢ సంకల్పంతో ప్రతి కార్యంలోను సఫలతను ప్రాప్తి చేసుకున్నారు, ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు – ఇది ప్రాక్టికల్ లో కర్మ చేసి చూపించారు. ఎప్పుడూ నిరాశ పడలేదు, సదా నథింగ్ న్యూ (కొత్తేమీ లేదు) అనే పాఠంతో విజయులుగా ఉన్నారు, హిమాలయం అంతటి పెద్ద విషయాన్ని కూడా, పర్వతం నుండి దూది పింజం చేసి మార్గం వెలికి తీసారు, ఎప్పుడూ భయపడలేదు. ఇలా సదా పెద్ద మనసు పెట్టుకోండి, సంతోషంగా ఉండండి. ప్రతి అడుగులో బ్రహ్మాబాబాను ఫాలో చేయండి, అప్పుడు సమీపులుగా మరియు సమానులుగా తయారవుతారు.
స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవం చేయండి
ఎంతగా అనంతమైన ప్రాప్తులలో నిమగ్నమై ఉంటారో, అంతగా హద్దు యొక్క ఆకర్షణలకు అతీతంగా ఉంటూ పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయేటటువంటి అనుభవం చేస్తారు. మీ ఈ లవలీన స్థితి వాతావరణంలో ఆత్మికత యొక్క సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!