10 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
9 August 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మిమ్మల్ని ఈ పాపపు ప్రపంచం నుండి బయటకు తీసి ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు, తండ్రి ద్వారా మీకు సుఖము-శాంతి అనే రెండు కానుకలు లభిస్తాయి”
ప్రశ్న: -
మొత్తం ప్రపంచంలో సత్యాతి-సత్యమైన నన్స్ మీరు, సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు?
జవాబు:-
ఎవరి బుద్ధిలోనైతే ఒక్కరి స్మృతి ఉంటుందో అనగా నన్ బట్ వన్ (ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు) అన్నట్లు ఉంటారో, వారే సత్యమైన నన్స్. ఆ నన్స్ తమను తాము నన్స్ అని పిలుచుకుంటారు కానీ వారి బుద్ధిలో ఒక్క క్రీస్తు యొక్క స్మృతి మాత్రమే ఉండదు, క్రీస్తును కూడా భగవంతుని బిడ్డ అని అంటారు. కనుక వారి బుద్ధిలో ఇద్దరున్నారు మరియు మీ బుద్ధిలో ఒక్క తండ్రి ఉన్నారు, అందుకే మీరు సత్యాతి-సత్యమైన నన్స్. పవిత్రంగా ఉండాలని మీకు తండ్రి ఆజ్ఞ లభించింది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఈ పాపపు ప్రపంచం నుండి… (ఇస్ పాప్ కీ దునియా సే…)
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మలు. ఆత్మను పరమాత్మ అని అనలేరు. మనిషిని భగవంతుడని అనలేరు. అచ్ఛా, ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ప్రస్తుతం మిమ్మల్ని దేవతలు అని అనడం జరగదు. బ్రహ్మాను కూడా దేవత అని అనలేరు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః… అని అంటారు కానీ బ్రహ్మాకు మరియు విష్ణువుకు మధ్యన చాలా తేడా ఉంది. విష్ణువును దేవత అని అంటారు, బ్రహ్మాను దేవత అని అనలేరు ఎందుకంటే వారు బ్రాహ్మణుల తండ్రి. బ్రాహ్మణులను దేవతలు అని అనలేరు. ఇప్పుడు ఈ విషయాలను మనుష్యులు మనుష్యులకు అర్థం చేయించలేరు, భగవంతుడే అర్థం చేయిస్తారు. మనుష్యులు అంధవిశ్వాసం వలన ఏది తోస్తే అది అనేస్తారు. ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకున్నాను. ఎలాంటి కర్మలు చేస్తారో, అలాంటి శరీరం లభిస్తుంది. శరీరం నుండి ఆత్మ వేరు అయితే, ఇక శరీరం పట్ల ప్రేమ ఉండదు. ఆత్మ పట్ల ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉంటుందో, అప్పుడే ఆత్మ పట్ల కూడా ప్రేమ ఉంటుంది. మనుష్యులు పిత్రులను పిలుస్తారు, వారి శరీరమైతే సమాప్తమైపోయింది, అయినా కూడా వారి ఆత్మను స్మృతి చేస్తారు, అందుకే బ్రాహ్మణుడిలోకి పిలుస్తారు. ఫలానావారి ఆత్మ, మీరు రండి, వచ్చి ఈ భోజనాన్ని స్వీకరించండి అని అంటారు. అనగా ఆత్మ పట్ల మోహముంటుంది. కానీ అంతకుముందు శరీరం పట్ల మోహం ఉండేది కావున ఆ శరీరం గుర్తుకొచ్చేది. మేము ఆత్మను పిలుస్తున్నామని వారు భావించరు. ఆత్మనే అంతా చేస్తుంది. ఆత్మలో మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదట దేహాభిమానం వస్తుంది, దాని తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి. అన్నింటినీ కలిపి వికారులు అని అంటారు. ఈ వికారాలు లేనివారిని నిర్వికారులని అంటారు. భారత్ లో దేవీ-దేవతలు ఉన్నప్పుడు, వారిలో దైవీ గుణాలు ఉండేవని మీకు అర్థమవుతుంది. ఈ లక్ష్మీనారాయణులది దేవీ దేవతా ధర్మము. ఎలాగైతే క్రైస్తవ ధర్మంలో స్త్రీలు మరియు పురుషులు అందరూ క్రైస్తవులో, అలా వీరిని కూడా దేవీ దేవతలని అంటారు. రాజు-రాణి, ప్రజలు అందరూ దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. ఇది చాలా ఉన్నతమైన సుఖమిచ్చే ధర్మము. పిల్లలు పాటను కూడా విన్నారు. ఆత్మ ఈ విధంగా అంటుంది – బాబా, నన్ను ప్రశాంతత మరియు శాంతి ఉండే చోటుకు తీసుకువెళ్ళండి అని. అవి సుఖధామము మరియు శాంతిధామము. ఇక్కడ చాలా అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో అశాంతి ఉండదు. బాబా తప్ప ఇంకెవ్వరూ ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళలేరని ఆత్మకు తెలుసు. తండ్రి అంటారు – ముక్తి మరియు జీవన్ముక్తి అనే ఈ రెండు కానుకలను నేను కల్ప-కల్పము తీసుకొస్తాను. కానీ మీరు మర్చిపోతారు, డ్రామాలో మర్చిపోవాలనే ఉంది. అందరూ మర్చిపోయినప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మేము 84 జన్మలు తీసుకున్నామని మీకు నిశ్చయముంది. ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని తీసుకోరో, వారు కొత్త ప్రపంచం యొక్క ఆరంభంలో రారు. త్రేతాలో లేదా త్రేతా అంతిమంలో వస్తారు. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. సత్యయుగంలో సుఖముండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. అచ్ఛా, దీని కన్నా ముందు జన్మలో వీరు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వీరు (లక్ష్మీనారాయణులు) ముందు జన్మలో బ్రాహ్మణులుగా ఉండేవారు. అంతకుముందు శూద్రులుగా ఉండేవారు. వర్ణాల గురించి మీరు మంచి రీతిలో అర్థం చేయించగలరు.
మనం 21 జన్మలకు ప్రశాంతతను పొందుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బాబా మనకు ఆ మార్గాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాము కనుక అశాంతిగా, దుఃఖితులుగా ఉన్నాము. ప్రశాంతత ఉంటే సుఖ-శాంతులు ఉన్నట్లు చెప్పచ్చు. కావున, ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. నిజంగా సత్యయుగంలో భారత్ ఎంతో సుఖంగా ఉండేదని, దుఃఖం లేక అశాంతి అన్న మాటే ఉండేది కాదని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, వారు ఆసురీ సంప్రదాయానికి చెందినవారిగా ఉన్నారు. పాపాత్ములు అని అంటారు కదా. ఆత్మలు అనేకమంది ఉన్నారు, పరమాత్మ ఒక్కరే ఉన్నారు. అందరూ సోదరులే, అందరూ పరమాత్మ అవ్వలేరు. ఇంత చిన్న విషయం కూడా మనుష్యుల బుద్ధిలో లేదు. ఈ ప్రపంచమంతా పెద్ద అనంతమైన ద్వీపము అని బాబా అర్థం చేయించారు. మిగిలిన చిన్న-చిన్న ద్వీపాలు కూడా ఉంటాయి. ఈ అనంతమైన ద్వీపంపై రావణ రాజ్యముంది. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోరు. వారు కేవలం కథలను వినిపిస్తూ ఉంటారు. కథలను జ్ఞానమని అనరు. వాటి ద్వారా మనుష్యులు సద్గతిని పొందలేరు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రియే, ఇంకెవ్వరూ కాదు. భక్తులను భగవంతుడే వచ్చి రక్షిస్తారు. మనుష్యులు మనుష్యులను రక్షించలేరు. శివబాబా పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. వారు వకీలు లేక బ్యారిస్టరు కూడా, ఎందుకంటే వారు యమదూతల శిక్షల నుండి విముక్తులుగా చేసేవారు. సత్యయుగంలో ఎవరూ జైలుకు వెళ్ళరు. తండ్రి అందరినీ జైలు నుండి విడిపిస్తారు. పిల్లల సర్వ శ్రేష్ఠ మనోకామనలన్నీ పూర్తవుతాయి. రావణుని ద్వారా అశుద్ధ కామనలు పూర్తవుతాయి. తండ్రి ద్వారా శుద్ధ కామనలు పూర్తవుతాయి. శుద్ధ కామనలు పూర్తి అవ్వడంతో మీరు సదా సుఖమయంగా అవుతారు. పతితులుగా, వికారులుగా అవ్వడం అనేది అశుద్ధ కామన. పావనంగా ఉండేవారిని బ్రహ్మచారులని అంటారు. మీరు కూడా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అయి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. పతితుల నుండి పావనంగా ఒక్క తండ్రి మాత్రమే తయారుచేస్తారు. సాధు-సత్పురుషులు మొదలైనవారు వికారాలతో జన్మిస్తారు, దేవతల గురించి ఇలా అనరు. అక్కడ అసలు వికారాలు ఉండవు. అది పావన ప్రపంచము. లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, భారత్ పవిత్రంగా ఉండేది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. సత్యయుగంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి-సంపత్తి ఉండేవి, అందరూ సుఖంగా ఉండేవారు, రావణ రాజ్యం మొదలైనప్పటి నుండి పడిపోతూ వచ్చారు. ఇప్పుడు దేనికి పనికిరాకుండా అయిపోయారు. పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వజ్ర సమానంగా అవుతారు. భారత్ సత్యయుగంగా ఉన్నప్పుడు వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడైతే గవ్వ సమానంగా కూడా లేదు. తమ ధర్మం గురించే ఎవరికీ తెలియడం లేదు. పాపాలు చేస్తూ ఉంటారు. అక్కడ పాపము అన్న మాటే ఉండదు. మీరు దేవీ-దేవతా ధర్మంలోని ప్రసిద్ధమైనవారు, దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. వేరే ధర్మాలలో చూసినట్లయితే ఒకే చిత్రముంటుంది, క్రైస్తవుల వద్ద క్రీస్తు చిత్రం ఒక్కటే ఉంటుంది. బౌద్ధుల వద్ద బుద్ధుని చిత్రం ఒక్కటే ఉంటుంది. క్రైస్తవులు, క్రీస్తునే స్మృతి చేస్తారు, వారిని నన్స్ అని అంటారు. నన్స్ అనగా – ఒక్క క్రీస్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భావించేవారు, అందుకే నన్ బట్ క్రైస్ట్ అని అంటారు, వారు బ్రహ్మచారులుగా ఉంటారు. మీరు కూడా నన్స్. మీరు మీ గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్స్ గా అవుతారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. నన్ బట్ వన్, ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారి బుద్ధిలో ఎంతైనా ఇద్దరు ఉంటారు. క్రీస్తు, భగవంతుని బిడ్డ అని అనుకుంటారు. కానీ వారికి భగవంతుని గురించిన జ్ఞానం లేదు. పిల్లలైన మీకు జ్ఞానముంది, మొత్తం ప్రపంచంలో పరమాత్మ జ్ఞానమున్నవారు ఎవరూ లేరు. పరమాత్మ ఎక్కడ ఉంటారు, ఎప్పుడు వస్తారు, వారి పాత్ర ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. భగవంతుడిని జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు) అని అంటారు. వారికి మా మనస్సులోని విషయాలు తెలుసు అని అనుకుంటారు. తండ్రి అంటారు – నాకు తెలియదు, ప్రతి ఒక్కరి మనస్సును కూర్చొని చదవాల్సిన అవసరం నాకేముంది, నేను పతితులను పావనంగా చేసేందుకే వచ్చాను. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండకపోతే, అబద్ధం చెప్తే, వారు తమకు తామే నష్టం కలిగించుకుంటారు. దేవతల సభలో అసురులు వెళ్ళి కూర్చొనేవారు, అక్కడ అమృతాన్ని పంచేవారని అంటూ ఉంటారు. ఎవరైనా వికారాలలోకి వెళ్ళి, మళ్ళీ ఇక్కడకు వచ్చి దాక్కొని కూర్చొన్నారంటే వారు అసురులు అయినట్లే కదా. తమకు తామే పదవిని భ్రష్టం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు తమ పురుషార్థం చేయాలి లేకపోతే తమను తామే సర్వనాశనం చేసుకుంటారు. చాలా మంది దాక్కొని వచ్చి కూర్చుండిపోతారు. మేము వికారాలలోకి వెళ్ళడం లేదని అంటారు కానీ వికారాలలోకి వెళ్తూ ఉంటారు. ఇది తమను తాము మోసం చేసుకున్నట్లే. తమను తాము సర్వనాశనం చేసుకుంటారు. పరమపిత పరమాత్ముని కుడి భుజమైన ధర్మరాజు ఎదురుగా అబద్ధం చెప్పినట్లయితే, తమకు తామే శిక్షలకు పాత్రులుగా అవుతారు. చాలా సెంటర్లలో అలాంటి వారు ఉంటారు. బాబా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అక్కడకు రోజూ ఒక వ్యక్తి వచ్చేవారు, అతను వికారాలలోకి వెళ్తూ ఉండేవారు. పవిత్రంగా ఉండనప్పుడు ఎందుకు వస్తున్నారు అని అడిగితే, నేను రాకపోతే నిర్వికారిగా ఎలా అవ్వగలను, పవిత్రత బాగా అనిపిస్తుంది కానీ ఉండలేకపోతున్నాను, చివరికి మారుతాను, ఒకవేళ రాకపోతే నావ మునిగిపోతుంది, ఇంకే మార్గము లేదు కదా, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పేవారు.
బాబా అర్థం చేయించారు – మీరు వాయుమండలాన్ని పాడు చేస్తారు, ఎప్పటివరకు ఇలా వస్తూ ఉంటారు. పావనంగా అయ్యేవారికి పతితుల పట్ల ద్వేషం కలిగినట్లు అవుతుంది. బాబా, వీరి చేతి వంట కూడా బాగా అనిపించదని అంటారు. బాబా యుక్తిని కూడా తెలియజేశారు, ఆహార-పానీయాలకు సంబంధించి గొడవలు జరుగుతాయి, అలాగని ఉద్యోగం వదిలేయాలని కాదు, యుక్తిగా నడచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అర్థం చేయిస్తే – పవిత్రంగా ఎలా ఉంటారు, ఇలాంటివి ఎప్పుడూ వినలేదు, సన్యాసులు కూడా ఉండలేరు, ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళినప్పుడే పవిత్రంగా ఉండగలరు అని అంటూ డిస్టర్బ్ అవుతారు. కానీ ఇక్కడ పతితపావనుడైన, పరమపిత పరమాత్మ చదివిస్తున్నారని ఎవరికీ తెలియదు. వారు నమ్మరు, అందుకే వ్యతిరేకిస్తారు. శివబాబా బ్రహ్మా తనువులోకి వస్తారని ఏ శాస్త్రంలో ఉందో చూపించండి అని అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తానని, ఎవరిలోకైతే వస్తానో, వారికి తమ జన్మల గురించి తెలియదని గీతలో రాయబడి ఉంది. ఇలా రాయబడి ఉంది కావున పరమాత్మ మనుష్య శరీరంలోకి ఎలా వస్తారని మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు. పతిత తనువులోకే వచ్చి మార్గాన్ని చూపిస్తారు కదా. ఇంతకుముందు కూడా వచ్చి – నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు. వారు పరంధామంలో ఉంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. అలా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పేందుకు కృష్ణుని శరీరం మూలవతనంలో ఉండదు. ఒక్క పరమపిత పరమాత్మనే సాధారణ తనువులోకి ప్రవేశించి – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు తొలగిపోతాయని, అందుకే నన్ను పతితపావనుడని అంటారని పిల్లలైన మీకు చెప్తారు. తప్పకుండా ఆత్మలకు పతితపావనుడు అయి ఉంటారు కదా. పతితంగా కూడా ఆత్మనే అవుతుంది.
తండ్రి అంటారు – పవిత్ర ఆత్మలైన మీరు 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. ఇప్పుడు కళాహీనులుగా, పూర్తిగా పతితులుగా అయిపోయారు. నేను కల్ప-కల్పము వచ్చి మీకు అర్థం చేయిస్తాను. మీరు కామ చితిపై కూర్చొని పతితులుగా అవుతారు, ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చోబెట్టి మిమ్మల్ని పావనంగా చేస్తాను. భారత్ లో పవిత్రమైన ప్రవృత్తి మార్గముండేది, ఇప్పుడు అపవిత్రమైన ప్రవృత్తి మార్గముంది. ఎవరికీ ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇద్దరూ జ్ఞాన చితిపై కూర్చోండి అని బాబా అంటారు. ఆత్మలు ప్రతి ఒక్కరికీ తమ-తమ కర్మల అనుసారంగా శరీరాలు లభిస్తాయి. అలాగని మరుసటి జన్మలో కూడా వారే పతి-పత్నిగా అవుతారని కాదు. అంత రేస్ చేయలేరు. ఇది చదువుకు సంబంధించిన విషయం కదా. అజ్ఞాన కాలంలో జరగచ్చు, పరస్పరంలో చాలా ప్రేమ ఉన్నట్లయితే వారి మనోకామనలు పూర్తి అవ్వొచ్చు, అది పతిత వికారీ మార్గము. పతి యొక్క చితిపై పత్ని కూర్చొంటారు. మరుసటి జన్మలో కూడా వెళ్ళి అతడిని కలుసుకుంటారు. కానీ మరుసటి జన్మలో వారికి ఆ విషయం తెలియదు. మీరు కూడా బాబాతో పాటు జ్ఞాన చితిపై కూర్చొంటారు. ఈ ఛీ-ఛీ శరీరాలను వదిలి వెళ్ళిపోతారు. ఇది మీకు ఇప్పుడే తెలుసు, మేము గత జన్మలో ఇలా జంటగా ఉన్నామని వారికి తెలియదు. తర్వాత మీకు కూడా ఈ విషయాలు అక్కడ గుర్తుండవు. ఇప్పుడు మీ బుద్ధిలో లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. మమ్మా-బాబాలు లక్ష్మీనారాయణులుగా అవుతారు. విష్ణువు దేవత. ప్రజాపిత బ్రహ్మాను దేవత అని అనలేరు. బ్రహ్మా నుండి దేవతగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా ఎలా అవుతారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ప్రశాంతత కేవలం స్వర్గంలోనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే, స్వర్గానికి వెళ్ళారని అనగా ప్రశాంతతలోకి వెళ్ళారని అంటారు. పతితులు అశాంతిగా ఉంటారు. అయినా కూడా బాబా అంటారు – స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మిగిలినవి విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ కనుక మిమ్మల్ని కూడా వారి వలె నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. తండ్రి స్మృతితో మీరు సతోప్రధానంగా అవుతారు, ఇది ఆత్మల రేస్. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారు త్వరగా తయారవుతారు. ఇది యోగము మరియు చదువుల రేస్. స్కూలులో కూడా రేస్ జరుగుతుంది కదా. చాలా మంది విద్యార్థులు ఉంటారు. వారిలో ఎవరైతే నంబర్ వన్ అవుతారో, వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఒకే చదువు లక్షల, కోట్ల ఆత్మల కోసం ఉన్నప్పుడు, అన్ని స్కూళ్ళు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఈ చదువును చదువుకోవాలి. అందరికీ మార్గాన్ని చూపించండి, అంధులకు చేతికర్రగా అవ్వండి. ఇంటింటికీ సందేశాన్ని అందించాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు అశుద్ధ కామనలను త్యాగం చేసి శుద్ధ కామనలు పెట్టుకోవాలి. అన్నింటికంటే శుద్ధ కామన – పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి… ఏ పొరపాటును దాచిపెట్టి స్వయాన్ని మోసం చేసుకోకూడదు. ధర్మరాజు అయిన తండ్రితో సదా సత్యంగా ఉండాలి.
2. జ్ఞాన చితిపై కూర్చొని ఈ చదువులో రేస్ చేసి భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యోగాగ్ని ద్వారా వికర్మల ఖాతాను దగ్ధం చేసుకోవాలి.
వరదానము:-
సత్యత యొక్క అథారిటీ స్వరూపులైన పిల్లలకు – సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యం చేస్తూ ఉంటుందని గాయనం ఉంది. సత్యమనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. మిమ్మల్ని కూడా ఎవరు ఎంతగా కదిలించే ప్రయత్నం చేసినా, మీరు సత్యత యొక్క మహానత ద్వారా సంతోషమనే ఊయలలో ఇంకా ఊగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని కదిలించరు, ఊయలను కదుపుతూ ఉంటారు. ఇది కదిలించడం కాదు, ఊయలను ఊపడము, అందుకే మీరు వారికి – మీరు ఊపండి, మేము తండ్రితో పాటు ఊగుతాము అని ధన్యవాదాలు తెలపండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!