09 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
8 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - మధురమైన తండ్రిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేసినట్లయితే చాలా-చాలా మధురంగా తయారవుతారు”
ప్రశ్న: -
పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు?
జవాబు:-
ఇప్పుడు మీరు జ్ఞాన మానస సరోవరంలో మునకలు వేసి జ్ఞాన ఫరిశ్తాలుగా అవుతారు, జ్ఞాన స్నానంతో మీ నడవడిక మారుతూ ఉంటుంది. ఏవైతే అవగుణాలు ఉన్నాయో, అవి తొలగుతూ ఉంటాయి. తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసి మీరు పావన దేవతలుగా తయారవుతారు. దేవతలలో ‘పవిత్రత’ యొక్క ఆకర్షణయే ఉంటుంది. దీని కారణంగానే మనుష్యులు, దేవతల మందిరాలకు ఆకర్షించబడి దూరదూరాల నుండి వెళ్తారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
మా తీర్థం అతీతమైనది…
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. పిల్లలే అదృష్ట సితారలని మహిమ చేయబడతారు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన అదృష్ట సితారలు. ఆ సూర్య-చంద్రులు ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి, అందుకే మీ మహిమ గాయనం చేయబడింది. మీరు జ్ఞాన సితారలు, వాటిని జ్ఞాన సితారలని అనడం జరగదు. జ్ఞాన సూర్యుడు అన్న పేరు విని, ఆ సూర్యుడు జ్ఞాన స్వరూపుడేమో అని భావిస్తారు ఎందుకంటే రాళ్ళు-రప్పల్లో భగవంతుడు ఉన్నారని భావిస్తారు, అలా సూర్యుడిని బాగా నమ్ముతారు. తమను తాము సూర్యవంశీయులని చెప్పుకుంటారు. సూర్యుడిని పూజిస్తారు, జెండా కూడా సూర్యునిదే ఉంటుంది. మీది త్రిమూర్తి జెండా. ఇది ఎంత అద్భుతము. ‘సత్యమేవ జయతే’ అని కూడా అందులో రాయబడి ఉంది. నిజానికి విశ్వం పై వారే విజయాన్ని ప్రాప్తి చేయిస్తారు. మీరు శివశక్తి పాండవ సైన్యము. వారు – త్రిమూర్తి మార్గ్, త్రిమూర్తి హౌస్ అని పేర్లు పెట్టారు. దీని అర్థాన్ని మరియు ఈ త్రిమూర్తుల ద్వారా వారు ఏ కర్తవ్యం చేయిస్తారు అనేది తండ్రి తెలియజేస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన… వారు త్రిమూర్తి చిత్రం నుండి శివుడిని తీసేసి, చిత్రాన్ని ఖండితం చేసేసారు. ఈ త్రిమూర్తి చిత్రంలో ఎంత రహస్యం ఉంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. సత్యమైన శివబాబా బ్రహ్మా ద్వారా రాజ్యాన్ని ఇస్తారు. పిల్లలైన మనం శివబాబా ద్వారా కల్పక్రితం వలె మళ్ళీ పవిత్రత, సుఖము, శాంతి మరియు సంపదల రాజ్యాన్ని తీసుకుంటున్నాము. చదువు ఎప్పుడూ కూడా బ్రహ్మచర్యంలోనే చదువుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే కొందరు వివాహం తర్వాత కూడా కోర్సులు నేర్చుకుంటారు ఎందుకంటే దాని వలన సంపాదన పెరుగుతుంది. ఇక్కడ మీకు లెక్కలేనంత సంపాదన ఉంది. శివబాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. శ్రీమతం శ్రేష్ఠమైనదని గాయనం చేయబడింది. బాబాకు బిడ్డగా అయ్యారంటే తప్పకుండా తండ్రి మతాన్ని అనుసరిస్తారు. సోదరుల మతాన్ని అనుసరించరు. వారిని అనేక జన్మలు అనుసరించారు, కానీ దానితో ఏ లాభము కలగలేదు. ఇప్పుడు బాబా మతాన్ని అనుసరించాలి. సాధువులు-సత్పురుషులు మొదలైనవారంతా సోదరులే. ఇప్పుడు ఉన్నతమైన మతాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యం) లో కూడా చాలా మందులు తీసుకుంటారు. అవన్నీ అల్పకాలం కోసము. ఇది 21 జన్మల కోసం నేచర్ క్యూర్. చల్లని నీటితో స్నానం చేయండి, ఇది చేయండి, ఆహార-పానీయాల పథ్యాన్ని పాటించండి అని వారు అంటారు. ఇక్కడ ఆ ఆహార-పానీయాల విషయం లేదు. ఇక్కడ స్వీట్ ఫాదర్ పిల్లలకు చెప్తారు – ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు చాలా మధురంగా తయారవుతారు. దేవతలు మధురమైనవారు కదా, వారిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. ఇంతకుముందు శివుని మందిరాలు కూడా చాలా ఎత్తైన కొండలపై నిర్మించబడేవి. మనుష్యులు కాలి నడకన, సాక్షాత్కారం కోసం వెళ్ళేవారు ఎందుకంటే పవిత్రత ఆకర్షిస్తుంది. దేవతలు పవిత్రంగా ఉన్నప్పుడు విశ్వంపై రాజ్యం చేసేవారు. ఇప్పుడు వారి చిత్రాల ఎదురుగా వెళ్ళి ప్రార్థన చేసి నమస్కరిస్తారు. ఇప్పుడు, ఆ మధురమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. వారు ఇక్కడికే రావాలి. వారి నుండి తప్పకుండా అపారమైన వైకుంఠ సుఖం లభిస్తుంది, అందుకే వారిని స్మృతి చేస్తారు. రావణ రాజ్యం సమాప్తమైనప్పుడే తండ్రి వచ్చి స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. తండ్రి భారత్ లోనే వస్తారు. శివజయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు కానీ వారి నుండి ఏం లభిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు – పిల్లలైన మిమ్మల్ని మధురంగా తయారు చేసేందుకు నేను వచ్చాను. మీరెంత ఛీ-ఛీగా (అశుద్ధంగా) అయిపోయారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్, ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. బీజంలోనే మొత్తం జ్ఞానం ఉంటుంది కదా. వారు బీజం, సత్యమైనవారు, చైతన్యమైనవారు మరియు జ్ఞానసాగరుడు, వారు సత్యం చెప్తారు. వారు కూడా ఆత్మనే కానీ వారు పరమ్ (ఉన్నతమైనవారు). పరమ ఆత్మ అనగా ఉన్నతమైన ఆత్మ. వారు సదా పరంధామంలో ఉంటారు, ఉన్నతోన్నతమైనవారు. వారు నామ రూపాలకు అతీతమైనవారని చాలామంది అంటారు. కానీ నామ రూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. వారి పేరు ‘శివ’. అందరూ వారిని పూజిస్తారు, వారు నిరాకారుడు. ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇంతకుముందు మనం దేహాభిమానులుగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలూ, ఆత్మాభిమాని భవ. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. అందులో కేవలం శివునికి బదులుగా కృష్ణుని పేరు వేసిన కారణంగా ఖండితమైపోయింది. అయినా కేవలం పుస్తకం చదివినంత మాత్రాన రాజ్యం లభించదు. సత్యయుగంలో రాజ్యముంటుంది. తండ్రి తప్పకుండా సంగమంలో వస్తారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి పూర్తవుతుంది. భక్తి తర్వాత జ్ఞానముంటుంది. ఇది పాత ప్రపంచం, సత్యయుగం కొత్త ప్రపంచము. సత్యయుగంలో సూర్యవంశీయులు రాజ్యం చేసేవారు. ఇది రాజయోగము. దీని ద్వారా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. సత్యయుగంలో వీరి రాజ్యముండేది. ఇప్పుడు కలియుగంలో ఏముందో చూడండి! ఇప్పుడు మీరు సత్యయుగంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. భక్తి మార్గానికి చెందిన వేద-శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ ఇప్పుడు వదలాల్సి ఉంటుంది. జ్ఞానం లభించిన తర్వాత ఇక భక్తి అవసరముండదు. జ్ఞానం ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతాము.
భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు జ్ఞానం వినిపిస్తున్నారు. ఇప్పుడు మనం పతితుల నుండి పావనంగా తప్పకుండా తయారవ్వాలి, ఎందుకంటే పతితులు తిరిగి వెళ్ళలేరు. ముక్తిధామంలో అందరూ పావన ఆత్మలే ఉంటారు. సుఖధామంలో కూడా అందరూ పవిత్రమైనవారు ఉంటారు. ఇప్పుడు కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఇప్పుడు వారిని పావనంగా ఎవరు తయారుచేస్తారు? పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు తండ్రి అంటారు – నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను. అందరికంటే నంబరువన్ భక్తునిగా ఈ దాదా ఉండేవారు. వారిని బ్రహ్మా అనండి లేదా లక్ష్మీనారాయణుల ఆత్మ అనండి. ఇది అర్థం చేసుకొనే చాలా గుప్తమైన విషయము. విష్ణువు నాభి నుండి బ్రహ్మా మరియు బ్రహ్మా నాభి నుండి విష్ణువు వెలువడ్డారు… అని అంటారు. 84 జన్మల తర్వాత విష్ణువు బ్రహ్మాగా అవుతారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. బాబా కూడా గీతను చదివేవారు. జ్ఞానం లభించిన తర్వాత, బాబా విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు అనేది గమనించారు. విష్ణువు సాక్షాత్కారం జరిగిన తర్వాత, ఒక్కసారిగా గీత మొదలైనవి వదిలేసారు. బాబా యొక్క ప్రవేశం జరిగింది కదా. తర్వాత ఎప్పుడూ గీతను ముట్టుకోలేదు. ఒక్క తండ్రినే స్మృతి చేయడం మొదలుపెట్టారు. నేను కూడా ఆ తండ్రి నుండి వినడం ప్రారంభించాను – అని నేను అంటాను. శివబాబా అంటారు – నేను పిల్లలకు చెప్పినప్పుడు ఇతను కూడా వింటారు. నేను ఇతని తనువులోకి ప్రవేశించాను కనుక ఇతనికి అర్జునుడు అనే పేరు పెట్టాను. శాస్త్రాలలో గుర్రపు రథాన్ని చూపిస్తారు. ఎంత తేడా ఉంది. గుర్రపు రథంలో కూర్చొని ఒక్కరికి జ్ఞానమిచ్చారా ఏమిటి? ఇదెలా సాధ్యమని ఇప్పుడు మీరు అనుకుంటారు. బాబా ఎలా చదివిస్తారు అనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి. కావున చదువుకోవడానికి పాఠశాల తప్పకుండా కావాలి, అంతేకానీ యుద్ధ మైదానం కాదు. బాబా రాజయోగం నేర్పిస్తారు. సత్యయుగంలో ఏ శాస్త్రము ఉండదు. నేనిప్పుడు జ్ఞానం వినిపిస్తాను, అంతే. సత్యయుగంలో దీని అవసరముండదు. పాత ప్రపంచానికి సంబంధించినదంతా బూడిదలో కలిసిపోతుంది. ఇది రాజశ్వ అశ్వమేధ యజ్ఞము. అశ్వము అని ఈ రథాన్ని అంటారు, దీనిని కూడా స్వాహా చేయాలి. ఆత్మ తండ్రికి చెందినదిగా అయ్యాక, ఇక ఈ పాత శరీరం కూడా సమాప్తమైపోతుంది. కృష్ణపురిలోకి ఈ ఛీ-ఛీ శరీరాన్ని తీసుకువెళ్ళరు. ఆత్మ అమరమైనది. హోలీలో చూపిస్తారు – కోకి (తీపి రొట్టె) కాలిపోతుంది, కానీ దారం కాలదు. బాబా ఇప్పుడు అనంతమైన విషయాన్ని అర్థం చేయిస్తారు – ఇప్పటి వరకు విన్నదంతా మర్చిపోండి. భారత్ ఇప్పుడు అసత్య ఖండంగా అయిపోయింది, నిన్న సత్యఖండంగా ఉండేది. సత్య ఖండంగా తండ్రి తయారుచేసారు, మళ్ళీ రావణుడు అసత్య ఖండంగా తయారుచేసాడు. ఈ రావణుడు అందరికీ పాత శత్రువు. కేవలం ఎవరో ఏదో చెప్తే, దానిని అనుసరించడం మొదలుపెడతారు. ఉదాహరణకు దిల్వాడా మందిరంలో ఆదిదేవ్ కు మహావీర్ అన్న పేరును పెట్టారు. మహావీర్ అని హనుమంతుడిని అంటారు. ఇప్పుడు వారెక్కడ, వీరెక్కడ. మీ అసలైన స్మృతి చిహ్నం ఈ మందిరంలో ఉంది. పైన స్వర్గము, కింద తపస్సు. ఆదినాథుని మూర్తి బంగారంతో తయారుచేయబడింది. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేదని అంటారు కదా. భారత్ లో ఉన్నంత బంగారం ఇంకెక్కడా ఉండేది కాదు. బంగారు మహళ్ళు ఉండేవి. పై కప్పులలో, గోడలలో వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉండేవి. మందిరాలలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉండేవి, తర్వాత వాటిని దోచుకున్నారు. వాటిని తీసుకువెళ్ళి మసీదులలో పెట్టారు. ఆ సమయంలో వాటి విలువ ఎంత ఉండి ఉంటుంది. అంతులేని ధనముండేది, అందుకే దోచుకొని తీసుకువెళ్ళారు. ప్రాచీన భారత్ చాలా షావుకారుగా ఉండేదని అందరికీ తెలుసు. ఇప్పుడెంత నిరుపేదగా అయిపోయింది. పేదవారి పట్ల జాలి కలుగుతుంది. రావణుడు ఎంత నిరుపేదగా తయారుచేసాడు. తండ్రి మళ్ళీ సంపన్నంగా తయారుచేస్తారు. ఇది అనంతమైన నాటకం, దీని ఆదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నాలెడ్జ్ ఫుల్. అలాగని అందరిలో కూర్చొని చూస్తానని కాదు. ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది. ఎవరైతే పాపం చేస్తారో, వారికి శిక్షలు తప్పకుండా లభిస్తాయి. నన్ను నాలెడ్జ్ ఫుల్, పతిత పావనుడని అంటారు. ఓ బాబా రండి, వచ్చి మాకు జ్ఞానమివ్వండి, పావనంగా చేయండి – అని పిలుస్తారు. కనుక నేను వచ్చి ఈ కార్యం చేస్తాను. ఇకపోతే శాస్త్రాల విషయాలను మర్చిపోండి, నేను చెప్పేది వినండి అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తర్వాత సూర్యవంశీయులుగా అవుతారు. ఆ తర్వాత చంద్రవంశం, వైశ్యవంశం, శూద్ర వంశానికి చెందినవారిగా అవుతారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. సత్యయుగంలో అన్ని విషయాలను మర్చిపోతారు. అక్కడ తండ్రిని ఎవ్వరూ స్మృతి చేయరు. వారసత్వం లభించాక ఇక ఎందుకు స్మృతి చేస్తారు. ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి వృక్షపతి. నన్ను స్మృతి చేయండి అని వారు అంటారు. రచయిత ఒక్కరే ఉంటారా లేక రాళ్ళు- రప్పలు కూడా రచయితలు అవుతాయా?
రావణుడు మీ బుద్ధిని ఎంత పాడుచేసాడని తండ్రి అంటారు. గొప్ప-గొప్ప విద్వాంసులకు ఎంత అహంకారముంది. తండ్రి గురించి తెలియనే తెలియదు, రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి కూడా తెలియదు. తండ్రి అంటారు – నేను మీకు రాజ్యాన్ని ఇచ్చాను. మీరు ధన-సంపదలు అన్నింటినీ సమాప్తం చేసారు, ఇప్పుడు భిక్షం అడుగుతున్నారు, అందుకే ఆసురీ సంప్రదాయం అని అంటారు. దేవతలకు ఎంత మహిమ చేసారు. మళ్ళీ, నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు గుణాలను ధారణ చేయాలి. అవగుణాలను వదిలేయండి. రావణుడు మిమ్మల్ని కోతుల వలె తయారుచేసాడు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని దేవతలుగా తయారుచేస్తారు. ఎవరిలోనైతే 5 వికారాలుంటాయో, వారిని కోతులు అని అంటారు. (నారదుని ఉదాహరణ) ఇప్పుడు మీ నడవడిక మారుతూ ఉంటుంది, మళ్ళీ మీరు దేవతలుగా తయారవుతారు. ఈ జ్ఞాన సరోవరంలో మునకలు వేసి మనం జ్ఞాన ఫరిశ్తాలుగా అవుతాము. వారు నీటిని మానస సరోవరం అని భావించారు. ఇది జ్ఞాన స్నానం యొక్క విషయము. బాబా ఖచ్చితంగా 5 వేల సంవత్సరాల క్రితం వలె మనకు అర్థం చేయిస్తున్నారని, ఇందులో ఏ సంశయం లేదని పిల్లలకు తెలుసు. పతితపావనుడైన తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మనుష్యులు ముక్తి కోసం ఎంతగా తల కొట్టుకుంటారు కానీ ఇంటి గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ లీనమైపోతుందని కొందరు అనుకుంటారు. ఆత్మ మరొక శరీరం తీసుకుంటుందని కొందరు అంటారు. అనేక మతాలున్నాయి. తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రపంచమంతా కృష్ణ భగవానువాచ అని అనుకుంటారు. ఇక్కడ శివ భగవానువాచ అని తండ్రి అంటారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఒక్కసారిగా పేరునే మార్చేసారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన పిల్లలు అని బాప్ దాదాలు ఇరువురు అంటారు. ఇద్దరికీ పిల్లలు కదా. ఇతను కూడా విద్యార్థియే, మీరు కూడా విద్యార్థులే. ఇతను కూడా చదువుకుంటున్నారు. భారత్ ను పావనంగా తయారుచేసే సేవలో ఉన్న వారే పిల్లలు అయినట్లు. పావనంగా అవ్వని వారిని, బాబా చూస్తూ కూడా చూడరు. శిక్షలు అనుభవించిన తర్వాత, వచ్చి వంట చేసేవారిగా అవుతారని అర్థం చేసుకుంటారు. పావనంగా అయ్యేవారు విశ్వానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా –
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మధురంగా తయారయ్యేందుకు మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ మతాన్నే అనుసరించాలి.
2. పురుషార్థం చేసి సంపూర్ణంగా తయారవ్వాలి. భారత్ ను పావనంగా తయారుచేసే సేవ చేయాలి. ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు.
వరదానము:-
ఏ విషయాన్ని చూసినా, విన్నా, దాని సారాన్ని అర్థం చేసుకోండి మరియు ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అందులో సారం నిండి ఉన్నట్లయితే పురుషార్థం సరళమవుతుంది. ఇటువంటి సరళ పురుషార్థులు అన్ని విషయాలలో ఆల్ రౌండ్ గా ఉంటారు. వారిలో ఎలాంటి లోపము కనిపించదు. ఏ విషయంలోనూ ధైర్యం తగ్గదు. నేను ఇది చేయలేను – అనే మాటలు వారి నోటి నుండి వెలువడవు. ఇటువంటి సరళ పురుషార్థులు స్వయం కూడా సరళచిత్తులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా సరళచిత్తులుగా తయారుచేస్తారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!