08 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

08 September 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

7 September 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - తమ కంటే పెద్దవారి పట్ల గౌరవముంచడం కూడా దైవీ గుణమే, ఎవరైతే తెలివైనవారిగా, బాగా అర్థం చేయించేవారిగా ఉంటారో, వారిని ఫాలో చేయాలి”

ప్రశ్న: -

సత్యయుగంలో భక్తికి సంబంధించిన ఆచార-పద్ధతులు ఏవీ ఉండవు – ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిలోకి పంపిస్తారు. భక్తికి ఫలం లభిస్తుంది. జ్ఞానం లభిస్తే, భక్తి నుండి విడాకులు లభించినట్లే. ఇది జ్ఞానం యొక్క ప్రారబ్ధ సమయము అన్నప్పుడు ఇక భక్తి, తపస్సు, దాన-పుణ్యాలు చేయాల్సిన అవసరమేముంది! అక్కడ ఈ పద్ధతులేవీ ఉండవు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. పతితపావనుడైన శివ భగవానువాచ! ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు పతితులను పావనంగా చేసే జ్ఞానాన్ని వినిపిస్తానని, ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇక్కడి వారు భక్తినే నేర్పిస్తారు. స్వయాన్ని బ్రహ్మాకుమార-కుమారీలుగా భావించే పిల్లలైన మీరు మాత్రమే జ్ఞానాన్ని నేర్చుకుంటారు. దిల్వాడా మందిరం మీ ఎదురుగా నిలబడి ఉంది. అక్కడ కూడా రాజయోగ తపస్సులో కూర్చొన్నారు. జగదంబ కూడా ఉన్నారు, ప్రజాపిత కూడా ఉన్నారు. కుమారీ కన్య, అధర్ కుమారీ కూడా ఉన్నారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పై భాగంలో రాజ్యం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. తండ్రి భక్తినేమీ నేర్పించరు. ఎవరైతే నేర్పించి వెళ్ళారో వారికే భక్తి చేస్తారు కానీ రాజయోగాన్ని నేర్పించి, రాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినవారు ఎవరు అనేది వారికి తెలియదు. భక్తి వేరు, జ్ఞానం వేరు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానం వినిపించేవారు ఒక్కరే, ఇంకెవరూ వినిపించలేరు. జ్ఞానసాగరుడు ఒక్కరే. వారే వచ్చి జ్ఞానం ద్వారా పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇతర సత్సంగాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఎవరూ జ్ఞానాన్ని నేర్పించలేరు. తమను తాము శ్రీ శ్రీ 108 జగద్గురువు అని, భగవంతుడని పిలుచుకుంటారు కానీ – నేను అందరి పరమపితను, జ్ఞానసాగరుడను అని ఎవరూ అనరు, వాళ్ళను ఎవరూ అసలు పరమపిత అని పిలవరు. పరమపిత పతితపావనుడు అని అయితే తెలుసు. బుద్ధిలో ఈ పాయింట్లను మంచి రీతిలో ఉంచుకోవాలి. ఈ బ్రహ్మాకుమారీలు భక్తికి విడాకులు ఇస్తారని మనుష్యులు అంటూ ఉంటారు. కానీ జ్ఞానం లభించినప్పుడు భక్తికి విడాకులు ఇవ్వాల్సిందే. భక్తిలోకి వెళ్ళినప్పుడు మనం జ్ఞానానికి విడాకులు ఇస్తున్నామని ఆ సమయంలో తెలుస్తుందని కాదు. మీరు స్వతహాగానే రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారని ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది రాజయోగం యొక్క జ్ఞానము, దీనిని భక్తి అని అనరు. భగవంతుడు జ్ఞానసాగరుడు, వారెప్పుడూ భక్తిని నేర్పించరు. భక్తి ఫలమే జ్ఞానము. జ్ఞానంతో సద్గతి కలుగుతుంది. కలియుగ అంతిమంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే ఈ పాత ప్రపంచాన్ని దుఃఖధామం అని అంటారు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. భక్తి ఫలాన్ని అనగా సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది పాత ప్రపంచము, దీని వినాశనం జరగనున్నది. మనకు కొత్త ప్రపంచంలో రాజ్యం కావాలి. ఇది రాజయోగ జ్ఞానము. జ్ఞానం నేర్పించేవారు ఒక్క పరమపిత పరమాత్మ శివుడు మాత్రమే. వారినే జ్ఞానసాగరుడని అంటారు, కృష్ణుడిని అలా అనరు. కృష్ణుని మహిమ వేరు. అతను తప్పకుండా గత జన్మలో రాకుమారునిగా తయారయ్యేటువంటి కర్తవ్యాలను చేసారు.

మనం రాజయోగ జ్ఞానాన్ని తీసుకుని కొత్త ప్రపంచంలో స్వర్గం యొక్క రాకుమార-రాకుమారీలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. స్వర్గాన్ని సద్గతి అని, నరకాన్ని దుర్గతి అని అంటారు. మనం మన కోసం రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము. ఇకపోతే, ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకోరో, పావనంగా అవ్వరో, వారు రాజధానిలోకి రాలేరు, ఎందుకంటే సత్యయుగంలో చాలా కొద్దిమంది ఉంటారు. ఆ సమయంలో కలియుగ అంతిమంలో ఉన్న ఈ అనేక మంది మనుష్యులు తప్పకుండా ముక్తిధామంలో ఉంటారు. వారు మాయం అయిపోరు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది కావున ఇప్పుడు పిల్లలకు ఇల్లు గుర్తుంటుంది. నాటకం పూర్తవుతుంది. అనేక సార్లు చక్రంలో తిరిగారు. ఇది బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులు తయారవుతూ ఉంటారు. 16,108 మాల ఉంది. సత్యయుగంలో ఎక్కువ మంది ఉండరు. సత్యయుగం యొక్క మోడల్ రూపాన్ని కూడా చూపిస్తారు కదా. పెద్ద వస్తువుకు సంబంధించిన మోడల్ చిన్నగా ఉంటుంది. ఉదాహరణకు బంగారు ద్వారకను చూపిస్తారు. ద్వారకలో కృష్ణుని రాజ్యం ఉండేదని అంటూ ఉంటారు. ఇప్పుడింతకీ రాజ్యం ద్వారకలో ఉండేదా లేక ఢిల్లీలో ఉండేదా? యమునా నదీ తీరమైతే ఇక్కడ ఢిల్లీలో ఉంది. అక్కడ (ద్వారకలో) సాగరం ఉంది. యమునా నదీ తీరమున రాజధాని ఉండేదని పిల్లలు అర్థం చేసుకుంటారు. ద్వారక రాజధాని కాదు. ఢిల్లీ ప్రసిద్ధమైనది. యమునా నది కూడా కావాలి. యమునా నదికి మహిమ ఉంది. పరిస్తాన్ అని ఢిల్లీనే అంటారు. ముఖ్య సింహాసనం ఢిల్లీలోనే ఉంటుంది. భక్తి మార్గం సమాప్తమై జ్ఞాన మార్గం ఉంటుందని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ దైవీ రాజధాని స్థాపనవుతుంది. తండ్రి అంటారు – ఎవరెవరు ఎంత పాస్ అవుతారు అనేది మున్ముందు మీకు అంతా తెలిసిపోతుంది. స్కూల్లో కూడా ఫలానావారు ఇన్ని మార్కులతో పాస్ అయ్యారని, ఇప్పుడు తర్వాత క్లాసులోకి వెళ్తారని తెలుస్తుంది కదా. చివరి సమయంలో – ఎవరెవరు పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారు అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. క్లాసు పెద్దది కదా. ఇది అనంతమైన క్లాసు. సెంటర్లు రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటాయి. కొంతమంది వచ్చి 7 రోజుల కోర్సును మంచి రీతిలో తీసుకుంటారు. ఒకటి-రెండు రోజులు కోర్సు కూడా తక్కువేమీ కాదు. కలియుగ వినాశనం ఎదురుగా నిలబడి ఉందని చూస్తారు, ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి అన్నారు – బుద్ధియోగాన్ని నాతో జోడించినట్లయితే సతోప్రధానంగా అవుతారు, పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. డ్రామాలో కల్పక్రితం పాత్రను అభినయించినట్లుగా, తప్పకుండా పాత్రను అభినయించాలి. భారతవాసులే రాజ్యం చేసేవారు, తర్వాత వృద్ధి చెందారు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎలాగైతే క్రైస్తవులు క్రీస్తును పూజిస్తారో, అలా భారతవాసులు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారైనా కానీ పావనంగా లేనందుకు ఆ పావన దేవతలను పూజిస్తారు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు తండ్రి. సత్యయుగంలో తప్పకుండా ఈ దేవతల రాజ్యముండేది, అంటే తప్పకుండా ఆ ముందు జన్మలో వీరు పురుషార్థం చేసి ఉంటారు. తప్పకుండా ఆ సమయం సంగమమే అయ్యి ఉంటుంది. అప్పుడే పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచంగా అవుతుంది. కలియుగం పరివర్తనై సత్యయుగం రానున్నది, అంటే కలియుగంలో పతితులు ఉన్నారని అర్థము. బాబా అర్థం చేయించారు – ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తయారుచేసినప్పుడు లేక సాహిత్యం ముద్రించేటప్పుడు, అందులో – వీరు ఈ సహజ రాజయోగ జ్ఞానంతో ముందు జన్మలో ఈ పురుషార్థం చేసారని రాయాలి. కేవలం రాజు-రాణి మాత్రమే ఉండరు. ప్రజలు కూడా తయారవుతారు కదా. అజ్ఞానంలో మనుష్యులకు ఏమీ తెలియదు, కేవలం పూజలు చేస్తూ ఉంటారు. వారు పూజ చేసేటప్పుడు కేవలం లక్ష్మీనారాయణులను చూస్తూ ఉంటారు, అంతేకానీ జ్ఞానమేమీ లేదు, ఇది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి చేయకుండా భగవంతుడు లభించరని మనుష్యులు భావిస్తారు. భగవంతుడు వచ్చారని మీరు ఎవరికైనా చెప్తే, వారు నవ్వుకుంటారు. భగవంతుడు కలియుగ అంతిమంలో వస్తారు, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారని అంటారు. కలియుగ అంతిమంలో వస్తారు అని ఎందుకంటారో కూడా అర్థం చేసుకోరు. వారు కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. మనుష్యులు అర్థం లేకుండా ఏది తోస్తే అది మాట్లాడుతారు, అందుకే – మీరు పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారని తండ్రి అంటారు. తండ్రిని సర్వవ్యాపి అని అంటారు. భక్తి బయటకు చాలా సుందరంగా కనిపిస్తుంది. భక్తి యొక్క మెరుపు ఎంతగా ఉంది! మీ వద్ద ఏమీ లేదు. వేరే ఏ సత్సంగాలకు వెళ్ళినా శబ్దం తప్పకుండా ఉంటుంది, పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇక్కడైతే బాబా రికార్డును కూడా ఇష్టపడరు. ఇక మున్ముందు ఇవి కూడా సమాప్తం అయిపోవచ్చు.

తండ్రి అంటారు – ఈ పాటలు మొదలైనవాటి సారాన్ని అంతా మీకు అర్థం చేయిస్తాను. మీకు వీటి అర్థం తెలుసు. ఇది చదువు. పిల్లలకు తెలుసు – మేము రాజయోగం నేర్చుకుంటున్నాము, ఒకవేళ తక్కువగా చదువుకుంటే ప్రజలలోకి వెళ్ళిపోతాము, అందుకే ఎవరైతే చాలా తెలివైనవారిగా ఉంటారో, వారిని ఫాలో చేయాలి, ఎందుకంటే వారికి చదువు పట్ల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది కనుక దీని వలన లాభముంటుంది. బాగా అర్థం చేయించేవారి నుండి నేర్చుకోవాలి. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో, వారిని సెంటర్లలో గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. బ్రహ్మాకుమారి కూర్చొని ఉన్నప్పటికీ ఫలానావారు రావాలని కోరుకుంటారు ఎందుకంటే వారు చాలా తెలివైనవారని భావిస్తారు. అలాంటప్పుడు ఆ వచ్చేవారిని గౌరవించాల్సి ఉంటుంది కూడా. పెద్దవారికి ఈ రకంగా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. వీరు జ్ఞానంలో మా కన్నా చురుకైనవారు, తప్పకుండా వీరికి ఉన్నతమైన పదవి లభిస్తుంది అనుకుంటారు, ఈ విషయంలో అహంకారం రాకూడదు. పెద్దవారికి చాలా గౌరవం ఉంటుంది. ప్రెసిడెంటు పట్ల తప్పకుండా ఎక్కువ గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నంబరువారుగా గౌరవముంటుంది. పరస్పరంలో ఒకరినొకరు గౌరవించుకుంటారు కదా. బ్యారిస్టర్లలో కూడా నంబరువారుగా ఉంటారు. పెద్ద కేసు కోసం మంచి తెలివైన వకీలును ఎంచుకుంటారు. కొందరు లక్షల రూపాయల కేసులను కూడా తీసుకుంటారు. తప్పకుండా నంబరువారుగా ఉంటారు. మనకన్నా చురుకైనవారు ఉంటే, తప్పకుండా గౌరవం ఉంచాలి. సెంటర్లను సంభాళించాలి. అన్ని పనులూ చేయాలి. దీని కోసం బాబాకు రోజంతా ఆలోచన నడుస్తుంది కదా. ప్రదర్శినీని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి అన్నదాని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. తండ్రి సతోప్రధానంగా తయారుచేసేందుకే వచ్చారు. పతితపావనుడు తండ్రి మాత్రమే. ఇక్కడ గంగను పతితపావని అంటారు, ఇందులో జన్మ-జన్మలుగా స్నానాలు చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ పావనంగా అవ్వలేదు. ఇదంతా భక్తి. హే పతితపావనా రండి అని పిలుస్తారు. వారు తప్పకుండా సంగమంలోనే వస్తారు మరియు ఒక్కసారి మాత్రమే వస్తారు. ప్రతి ఒక్కరి ఆచార-పద్ధతులు ఎవరివి వారివి. ఉదాహరణకు నేపాల్ లో అష్టమి నాడు బలి ఇస్తారు. చిన్న పిల్లల చేతికి తుపాకీ ఇచ్చి కాల్చేలా చేస్తారు. వారు కూడా బలి ఇస్తారు. పెద్దవారైతే ఒక్క వేటుతో దూడను హతమారుస్తారు. ఎవరైనా తక్కువ శక్తిని ఉపయోగిస్తే, అది ఒక్క వేటుతో మరణించకపోతే, దానిని బలిగా భావించరు, అది దేవికి అర్పించరు. ఇదంతా భక్తి మార్గము. ప్రతి ఒక్కరి కల్పనలు ఎవరివి వారివి. చాలా మంది కల్పన (ఊహ) కారణంగా అనుచరులుగా అయిపోతారు. ఇక్కడ ఇవి కొత్త విషయాలు. వీటి గురించి పిల్లలే తెలుసుకోగలరు. ఒక్క తండ్రియే కూర్చొని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరు స్వదర్శన చక్రధారులని మీకు సంతోషం ఉంటుంది, ఇంకెవరూ దీనిని అర్థం చేసుకోలేరు. నేను మిమ్మల్ని సభలో – సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు అని సంబోధిస్తే, దాని అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరైనా కొత్తవారు ఉంటే, ఇదేమిటి ఇలా అన్నారు అని తికమకపడతారు. స్వదర్శన చక్రధారి విష్ణువు కదా అని అనుకుంటారు. ఇది కొత్త విషయం కదా, అందుకే మీరు బయట (సేవా) మైదానంలోకి వస్తే మీకు తెలుస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది.

మీది జ్ఞాన మార్గము. మీరు 5 వికారాలపై విజయం పొందుతారు. ఈ అసురులతో (5 వికారాలతో) మీకు యుద్ధం జరుగుతుంది. తర్వాత మీరు దేవతలుగా అవుతారు, అప్పుడిక యుద్ధానికి సంబంధించిన విషయమేమీ ఉండదు. అసురులున్న చోట దేవతలు ఉండరు. మీరు బ్రాహ్మణులు, దేవతలుగా అవ్వనున్నారు, అందుకే పురుషార్థం చేస్తున్నారు. రుద్ర జ్ఞాన యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞం జరగదు. రుద్రుడు అనగా శివుడు, మరి కృష్ణుని పేరు ఎక్కడ నుండి వచ్చింది. మీరు ప్రపంచానికి పూర్తిగా అతీతంగా ఉన్నారు మరియు మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు. పిచ్చుకలు సాగరాన్ని మింగేసాయని శాస్త్రాలలో కల్పిత కథలు ఎన్ని ఉన్నాయి. తండ్రి అంటారు – ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోయి నన్నొక్కడినే స్మృతి చేయండి. ఆత్మనే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి ఒక్కరే కదా. హే పరమాత్మ లేక ప్రభూ అని అంటారు, ఆ సమయంలో లింగం కూడా గుర్తుకు రాదు, కేవలం ఈశ్వరా లేక ప్రభు అని అనేస్తారు. ఆత్మకు తండ్రి నుండి అర్థ కల్పం యొక్క సుఖం లభించింది, అందుకే భక్తి మార్గంలో స్మృతి చేస్తుంది. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఎవరు అనే జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. ఆత్మలైన మనమందరము మూలవతనంలో నివసించేవారము. అక్కడి నుండి నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తాము. ముందు దేవీ-దేవతలు వస్తారు. క్రీస్తుకు ముందు దేవీ-దేవతా ధర్మముండేదని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. వారేమో – ఫలానా వస్తువు 50 వేల సంవత్సరాల పురాతనమైనదని అంటారు కానీ 50 వేల సంవత్సరాల పురాతన వస్తువు ఏదీ ఉండదు. డ్రామా ఉన్నదే 5 వేల సంవత్సరాలది. ముఖ్యమైన ధర్మాలు ఇవే. ఈ ధర్మాలకి చెందినవారికే ఇళ్ళు మొదలైనవి ఉంటాయి. ముందు వారు రజోగుణీ బుద్ధి కలవారిగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇంకా తమోగుణీ బుద్ధి కలవారిగా ఉన్నారు. ప్రదర్శినీలలో ఎంతగా అర్థం చేయిస్తారు కానీ ఎవరికీ అర్థం కాదు. బ్రాహ్మణుల అంటు కట్టబడుతుంది. జ్ఞానం వేరు, భక్తి వేరు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. జ్ఞానంతో సద్గతి లభిస్తుంది, అందుకే – హే పతితపావనా రండి, దుఃఖం నుండి విడిపించండి అని పిలుస్తారు. వారు మార్గదర్శకునిగా అయి తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి వచ్చి ఆత్మలను తీసుకువెళ్తారు. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. వినాశనం జరుగుతుంది కదా. శాస్త్రాలలో ఒక్క మహాభారత యుద్ధం గురించే చెప్తూ ఉంటారు. ఇది ఆ మహాభారత యుద్ధమేనని అంటారు. ఇది జరగాల్సిందే. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు ఉపాయం ఒక్కటే. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆత్మ నాతో పాటు వచ్చేస్తుంది. అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే, అనేకుల కళ్యాణం జరుగుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైతే చదువులో చురుకైనవారిగా ఉంటారో, బాగా అర్థం చేయిస్తారో – వారి సాంగత్యం చేయాలి, వారిని గౌరవించాలి. ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు.

2. జ్ఞానానికి సంబంధించిన కొత్త-కొత్త విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. మేము స్వదర్శన చక్రధారులమనే సంతోషంలో ఉండాలి.

వరదానము:-

సంకల్పంలో, స్వప్నంలో కూడా ఊహించని పేపర్లు ఇప్పుడు రానున్నాయి. హద్దు డ్రామాను సాక్షీగా ఉంటూ చూస్తారు కావున, అది బాధాకరంగా ఉన్నా లేక నవ్వు వచ్చేదిగా ఉన్నా తేడా ఉండదు, మీ అభ్యాసం ఈ విధంగా ఉండాలి. ఎవరికైనా రమణీకమైన పాత్ర ఉన్నా లేక స్నేహీ ఆత్మకు గంభీరమైన పాత్ర ఉన్నా….. ప్రతి పాత్రను సాక్షీ దృష్టాగా అయి చూడాలి, ఏకరస అవస్థ ఉండాలి. కానీ, సదా ఒక్క తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉన్నప్పుడే ఇటువంటి అవస్థ ఉంటుంది.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top