08 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
7 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - శివబాబాకు చెందినవారిగా అయి ఏ తప్పులూ చేయకూడదు, తప్పులు చేసినట్లయితే తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు”
ప్రశ్న: -
అందరికంటే పెద్ద ప్రవృత్తి ఎవరిది మరియు ఎలా?
జవాబు:-
శివబాబాది అందరికంటే పెద్ద ప్రవృత్తి. భక్తిలో అందరూ త్వమేవ మాతాశ్చ పితా….. (నీవే తల్లివి, తండ్రివి…..) అని పిలుస్తారు అంటే వారు ప్రవృత్తికి చెందినవారు అయినట్లు కదా. కానీ వారు సాకారంలోకి రానంత వరకు, వారికి ఎటువంటి ప్రవృత్తి ఉండదు ఎందుకంటే పైన ఆత్మలు తండ్రితో పాటు నిరాకారీ రూపంలో ఉంటాయి. సాకారంలోకి వచ్చి వీరిలో ప్రవేశించినప్పుడు వారికి అందరికంటే పెద్ద ప్రవృత్తి ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. విశేషంగా భారత్ కు మరియు మొత్తం ప్రపంచానికి, అనంతమైన తండ్రి నివృత్తికి చెందినవారా లేక ప్రవృత్తికి చెందినవారా అన్న విషయం తెలియదు. తండ్రి వచ్చినప్పుడు – పిల్లలూ-పిల్లలూ, అంటూ పిలుస్తారు ఎందుకంటే వారిని త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ…. అని పిలవడం కూడా జరుగుతుంది, అంటే వారు గృహస్థులుగా అయినట్లు. శివుడు నిరాకారుడు అన్నది అక్కడ అందరికీ తెలుసు. శివునికి ఆకారముంది కానీ పిల్లలైతే లేరు. ఒకవేళ ఉన్నా కూడా, ఆత్మలందరూ వారి పిల్లలే. పిల్లలందరూ ఒకేలా ఉంటారు, కనుక అందరూ పరమాత్మయేనని భావిస్తారు. ఆత్మ కూడా బిందు రూపమే, పరమాత్మునిది కూడా బిందు రూపమే. గృహస్థులే త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ….. అని పాడుతారు. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు, పరమాత్మ అంటే బ్రహ్మ తత్వము అని అంటారు. వారు త్వమేవ మాతాశ్చ పితా…… అని అనరు. వారి మార్గం వేరు. వీరు కూడా పొరపాటున లక్ష్మీనారాయణుల ఎదురుగా వెళ్ళి – త్వమేవ మాతాశ్చ పితా….. అని మహిమను పాడుతారు లేక అచ్యుతమ్ కేశవమ్….. అని అంటారు. భక్తి మార్గంలో చాలా మహిమ చేస్తూ ఉంటారు. వాస్తవానికి పరమాత్మ తండ్రి, వారి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది మరియు ఏ వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కూడా, సోదరుడు కూడా, పెద్ద తల్లి కూడా, ప్రజాపిత కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వీరి ద్వారా – పిల్లలూ, నేను మీకు తండ్రిని కూడా, మళ్ళీ నేను కూడా ప్రవృత్తి మార్గంలోకి రావాల్సి ఉంటుంది అని అంటారు. వీరు నాకు యుగళ్ కూడా, పుత్రుడు కూడా. వీరిలో ప్రవేశించినప్పుడు ప్రవృత్తి మార్గానికి చెందినవానిగా అవుతాను. నన్నే సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు, సుప్రీమ్ గురువు అని కూడా అంటారు. గురువు ముక్తి కోసం గైడ్ చేస్తారు. అదంతా అసత్యం, ఇది సత్యము. ఇంగ్లీష్ లో పరమాత్మను ‘ట్రూత్’ అని అంటారు. ట్రూత్ (సత్యమైనవారు) వచ్చి ఏ సత్యాన్ని తెలియజేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. నాకు, మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. అంటే ఇది కొత్త విషయమైనట్లే కదా. వారు జ్ఞాన సాగరుడు, సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సత్యాన్ని చెప్పి ఉంటారు, అందుకే మహిమ ఉంది. సత్య ఖండాన్ని హెవెన్ అని అంటారు. అక్కడ దైవీ సామ్రాజ్యాన్ని చూపిస్తారు. ఇప్పుడిది పాత ప్రపంచము, ఇది మళ్ళీ కొత్త ప్రపంచంగా తయారవ్వనున్నది. పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. స్థాపన సమయంలో వినాశనం జరుగుతుందని కూడా అంటూ ఉంటారు. చేసేవారు చేయించేవారు పరమాత్మ అని అంటూ ఉంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు. ఎలా చేయిస్తారు అనేది స్వయం వారే వచ్చి తెలియజేస్తారు. మనుష్యులకేమీ తెలియదు. చేసేవారు చేయించేవారు పరమాత్మ అని అంటారు. మీకు డ్రామా గురించి కూడా తెలిసింది. కలియుగాంతము, సత్యయుగ ఆది….. ఈ సంగమాన్నే ఉన్నతమైనదిగా భావించాలి. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. తర్వాత కిందకు దిగిపోతారు. స్వర్గాన్ని, నరకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు స్వర్గవాసులుగా అయి ఉంటారు. విశేషంగా భారతవాసులు మాత్రమే ఇలా అంటారు ఎందుకంటే భారత్ అన్నింటికంటే ప్రాచీనమైనది అని తెలుసు. కనుక తప్పకుండా ఇదే స్వర్గంగా ఉండి ఉంటుంది. విషయాలు ఎంత సహజమైనవి. కానీ డ్రామానుసారంగా అర్థం చేసుకోరు. అందుకే అర్థం చేయించడానికి తండ్రి వస్తారు. ఈ విధంగా పిలుస్తారు కూడా – బాబా, రండి, మీలో ఉన్న జ్ఞానాన్ని మాకివ్వండి, పతితులను పావనంగా తయారుచేయడానికి రండి. మళ్ళీ మా దుఃఖాన్ని హరించి సుఖాన్నివ్వండి అని కూడా అంటారు. కానీ వారు ఏ జ్ఞానమిస్తారు, ఏం సుఖమిస్తారు అనేది వారికి తెలియదు. వారు తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు, కనుక తప్పకుండా తండ్రి ద్వారా రచన రచించబడి ఉంటుంది. తండ్రి అనగా రచయిత. పిల్లలు, తండ్రి అని అంటున్నారంటే వారు రచన అయినట్లు. రచన కూడా తప్పకుండా ఎవరి ద్వారానో రచించబడి ఉంటుంది, తర్వాత పిల్లలకు ప్రాపర్టీని కూడా ఇచ్చి ఉంటారు. ఇది కామన్ విషయము, అందుకే నన్ను త్వమేవ మాతాశ్చ పితా అని అంటారు. కనుక బాబా పెద్ద గృహస్థి అయినట్లు కదా. ఓ మాత-పితా రండి, వచ్చి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి ఉన్నారు కానీ తల్లి లేకుండా రచన ఎలా జరుగుతుంది. బాబా ఇక్కడ రచనను ఎలా రచిస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయము. ఇక్కడ కూడా చాలా మంది బుద్ధిలో నిలవదు. మిగిలిన అన్నీ చోట్ల పరమాత్మను తండ్రి అని పిలుస్తారు. ఇక్కడ తల్లి-తండ్రి ఇరువురూ వారే, అంటే ఇది ప్రవృత్తి మార్గం అయినట్లు కదా. అక్కడ కేవలం తండ్రి అని అనడంతో వారికి ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. వారు రావడం కూడా చివర్లో వస్తారు. క్రైస్తవ ధర్మం కంటే ముందు బౌద్ధ ధర్మముండేదని, దాని కంటే ముందు ఇస్లామ్ ధర్మముండేదని అందరికీ తెలుసు. ఈ మెట్ల చిత్రంలో వేరే ధర్మాల గురించి లేదు అందుకే దీనిని సృష్టి చక్రం చిత్రం పక్కన ఉంచాలి. ఇది పాఠశాల. ఇప్పుడు పాఠశాలలో కేవలం ఒక్క పుస్తకం మాత్రమే ఉండదు. పాఠశాలలో మ్యాపులు కూడా కావాలి. ఆ భౌతిక విద్య ఉపయోగపడదు. మ్యాపు ద్వారా మనుష్యులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇవే మీ ముఖ్యమైన మ్యాపులు. ఎంత విస్తారంగా అర్థం చేయించడం జరుగుతుంది, అయినా రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు. బాబా అర్థం చేయించారు – ప్రదర్శనీలలో, వీరు మీ తండ్రి, వారు దాదా, వారు జ్ఞానం ఎలా ఇస్తారు, వారసత్వం ఎలా ఇస్తారు అని త్రిమూర్తి చిత్రం గురించి ముందు అర్థం చేయించాలి. భారతవాసులకు మాత్రమే వారసత్వం లభించనున్నది. పరమపిత పరమాత్మ బ్రాహ్మణ, దేవత, క్షత్రియ – ఈ మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులనే రచిస్తారు. ఇది యజ్ఞము. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. భక్తి మార్గంలో ఉన్న యజ్ఞాలన్నీ ఆలస్యంగా మొదలవుతాయి ఎందుకంటే మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది, తర్వాత దేవతల పూజ జరుగుతుంది. ఆ సమయంలో యజ్ఞాలేవీ ఉండవు. ఈ యజ్ఞాలను తర్వాత చేయడం మొదలుపెడతారు. ముందు దేవతలను పూజిస్తారు, వారికి పుష్పాలను అర్పిస్తారు. ఇప్పుడు మీరు పూజకు యోగ్యులుగా లేరు. మనుష్యులు శివునికి జిల్లేడు పూలను, ఉమ్మెత్త పూలను ఎందుకు సమర్పిస్తారు? తండ్రి అర్థం చేయిస్తారు – మీరందరూ ముళ్ళగా ఉండేవారు. అందులో కొందరు సదా గులాబీలుగా, కొందరు గులాబీలుగా, కొందరు మల్లెలుగా తయారవుతారు. మరి కొందరు జిల్లేడు పూలగా కూడా అవుతారు. పూర్తిగా చదువుకోకపోతే జిల్లేడు పూలగా అవుతారు, దేనికీ పనికిరారు. శివబాబాకు ముళ్ళను సమర్పిస్తారు, బాబా వాటిని పుష్పాలుగా తయారుచేస్తారు. వెరైటీ పుష్పాలు తయారవుతాయి. పూదోటలో వెరైటీ పుష్పాలు ఉంటాయి కదా. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు సింహాసనాధికారులుగా అవుతారు, కొందరు ఇంకోలా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. భక్తి మార్గం ఎంత విస్తారమైనది కానీ అందులో జ్ఞానం కొద్దిగా కూడా లేదు. సత్యయుగంలో దేవీ-దేవతలు ఉండేవారు. కలియుగంలో దేవతలు ఒక్కరు కూడా లేరు. కావున తప్పకుండా పరమాత్మ మనుష్యులను దేవతలుగా తయారుచేసి ఉంటారు. తండ్రి వచ్చి ఎటువంటి కర్మలను నేర్పిస్తారంటే, మనుష్యులు వాటిని నేర్చుకొని దైవీ గుణాలు ధారణ చేసి దేవీ-దేవతలుగా అయ్యారు. ఇతర ధర్మాల వారు ఏం నేర్పిస్తారు? ఎందుకంటే వారికైతే పై నుండి ధర్మపితల వెనుక రావాల్సి ఉంటుంది. వారు కేవలం పవిత్రతకు సంబంధించిన జ్ఞానాన్నిస్తారు. క్రీస్తు వచ్చినప్పుడు క్రైస్తవులెవ్వరూ లేరు. అతని వెనుక పై నుండి వారంతా వస్తారు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు అని తండ్రి అర్థం చేయించారు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి శాస్త్రాన్ని ధర్మశాస్త్రము అని అంటారు. కావున ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఇక మిగిలినవన్నీ చిన్న-చిన్న ధర్మాలు, అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇస్లాముల ధర్మ శాస్త్రం వేరు, బౌద్ధులది వేరు, ఎవరిది వారికుంది, కావున ధర్మశాస్త్రాలు కేవలం ఇవి మాత్రమే. బ్రాహ్మణ ధర్మమైతే ఈ సమయానికి చెందినది. వారు బ్రాహ్మణ దేవతాయ నమః….. అని పాడుతారు. కావున ఆ బ్రాహ్మణులకు అర్థం చేయించాలి – పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా ఏ బ్రహ్మా ముఖవంశావళినైతే రచిస్తారో, వారే సత్యమైన బ్రాహ్మణులు, మీరు ప్రజాపిత బ్రహ్మా సంతానము కానే కాదు, మీరు కేవలం స్వయాన్ని బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు కానీ అర్థం ఏమీ తెలియదు. బ్రహ్మా భోజనం తినేటప్పుడు సంస్కృతంలో శ్లోకాలు చదివి బ్రహ్మా భోజనాన్ని మహిమ చేస్తారు. వ్యర్థమైన మహిమను చేస్తారు. మీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు అని వారిని అడగాలి. పరమాత్మ సృష్టిని రచించేందుకు ముందుగా బ్రహ్మా కావాలి. కావున సత్యమైన బ్రాహ్మణులు మీరు. బ్రాహ్మణులకు పిలకను చూపిస్తారు కదా. విరాట రూపంలో బ్రాహ్మణులను చూపించరు. మరి బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు. మీరు స్వయాన్ని బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నారు కానీ పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా కొత్త రచనను రచించినప్పుడే బ్రాహ్మణులు తయారవుతారు. తర్వాత బ్రాహ్మణులే దేవతలుగా తయారవుతారు. బ్రాహ్మణులు సంగమంలోనే ఉంటారు. కలియుగంలో అందరూ శూద్రులు. బ్రాహ్మణులను చాలా మహిమ చేస్తారు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు వారసత్వం), మిగిలినదంతా విస్తారము. భక్తి గురించి కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. బాబా ఒక్కోసారి, నీవు భక్తునివా అని అంటారు, అంతేకానీ బాబా ఎప్పుడూ కోప్పడరు. బాబా అయితే అర్థం చేయిస్తారు కదా. ఎందుకంటే ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే, ఎవరి పేరు పాడవుతుంది, శివబాబాదే కదా. అందుకే బాబా పిల్లల కళ్యాణం కోసం శిక్షణనిస్తారు. ఒకవేళ వీరి ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా, దానిని సరిదిద్దడం కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. దాని వలన కూడా లాభమే జరుగుతుంది ఎందుకంటే వీరు పెద్ద కొడుకు కదా. అంతా వీరిపైనే ఆధారపడి ఉంది. వీరి వలన ఏ నష్టం కలగదు. వీరు, ఇలా చేయండి అని చెప్తే, అలా చెయ్యాలి. అప్పుడు నష్టం నుండి కూడా లాభమే వెలువడుతుంది. నష్టమన్న మాటే ఉండదు. ప్రతి విషయంలోనూ కళ్యాణమే కళ్యాణముంటుంది. అకళ్యాణం కూడా డ్రామాలో ఉంది. పొరపాట్లు అయితే అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా చివర్లో కళ్యాణం జరగాల్సిందే ఎందుకంటే తండ్రి కళ్యాణకారి. అందరి కళ్యాణం చేయాలి. అందరికీ సద్గతినిస్తారు. ఇప్పుడు అందరి వినాశన సమయము. పాపాల భారం అందరి తలపై ఉంది. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. శిక్షలు లభించడానికి సమయం పట్టదు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది అన్నప్పుడు క్షణంలో పాపాలకు శిక్షలు అనుభవించలేరా! కాశీ కల్వట్ లో ఇలాగే జరుగుతుంది, శరీరం పోతుంది. అలాగని వారు శివబాబాను కలుస్తారని కాదు. కేవలం వెనుకటి పాపాల లెక్క సమాప్తమై మళ్ళీ కొత్తగా మొదలవుతాయి. మధ్యలో ఎవరూ తిరిగి వెళ్ళలేరు. జ్ఞానం క్షణానికి సంబంధించినదే కానీ చదువునైతే చదువుకోవాల్సిందే. రోజూ జ్ఞానసాగరుడైన శివబాబా ఆత్మ వచ్చి చదివిస్తారు. కృష్ణుడైతే దేహధారి, వారు పునర్జన్మలలోకి వస్తారు. బాబా అయితే అజన్మ. ఎవరైతే చదువుకోరో, వారు తప్పకుండా విఘ్నాలు కలిగిస్తారు. యజ్ఞంలో విఘ్నాలైతే కలుగుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అదంతా కల్పక్రితం వలె జరుగుతుంది. అసురులు ఎలాంటి హంగామా చేస్తారు, చిత్రాలు చింపేస్తారు. కొన్ని సార్లు నిప్పు పెట్టడానికి కూడా సంకోచించరు. మనమేమి చేస్తాము. ఇది నిశ్చయించబడినది అని లోపల అర్థం చేసుకుంటాము. బయటకు మాత్రం పోలీసులు మొదలైనవారికి రిపోర్టు చేయవలసి ఉంటుంది. కల్పక్రితం ఏదైతే జరిగిందో, అదే జరుగుతుంది అని, ఇందులో దుఃఖం యొక్క విషయమేమీ లేదు అని మనకు లోలోపల తెలుసు. చాకలివాని ఇంటి నుండి ఏదైనా పోతే నష్టం కలుగుతుంది కానీ మళ్ళీ ఇంకొకటి తయారవుతుంది.
తండ్రి చెప్తున్నారు – ఎక్కడైనా ప్రదర్శనీలు మొదలైనవి చేస్తే, 8 రోజుల కోసం ఇన్ష్యూరెన్స్ చేయించండి. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే, డబ్బులు కూడా తీసుకోరు. ఒకవేళ ఇన్ష్యూరెన్స్ చేయించకపోతే ఏమవుతుంది. మళ్ళీ కొత్తవి మంచి చిత్రాలు తయారవుతాయి. అడుగడుగులోనూ పదమాలు తయారవుతూ ఉన్నాయి. మీ ప్రతి అడుగు, ప్రతి క్షణము చాలా విలువైనది. మీరు పదమపతులుగా తయారవుతారు. 21 జన్మలకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కనుక ఎంత బాగా అర్థం చేయించాలి. అక్కడ స్వర్గంలో మీ వద్ద లెక్కలేనంత ధనముంటుంది, లెక్కపెట్టే మాటే ఉండదు. అంటే బాబా మిమ్మల్ని ఎంత ధనవంతులుగా, సుఖమయంగా చేస్తారు! ఇది ఎంత గొప్ప ఆదాయము. ప్రజలు కూడా ఎంత షావుకార్లుగా అవుతారు. ఇది 21 జన్మల సంపాదనకు ఆధారము. ఇది మనుష్యులను దేవతలుగా తయారుచేసే పాఠశాల. ఇక్కడ చదివించేవారు ఎవరు? తండ్రి. కనుక ఇటువంటి చదువులో పొరపాట్లు చేయకూడదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ కళ్యాణకారీ యుగంలో ప్రతి విషయంలోనూ కళ్యాణముందని, మనకు అకళ్యాణం జరగదని సదా స్మృతి ఉండాలి. ప్రతి విషయంలో కళ్యాణముందని భావిస్తూ సదా నిశ్చింతగా ఉండాలి.
2. సదా గులాబీగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. చదువులో పొరపాట్లు చేయకూడదు. జిల్లేడు పుష్పంగా అవ్వకూడదు.
వరదానము:-
ఎంతగా అందరికీ గౌరవాన్ని ఇస్తారో, అంతగా తమ రికార్డును సరిగ్గా ఉంచుకోగలరు. ఇతరుల పట్ల గౌరవాన్ని ఉంచడమనగా తమ రికార్డును తయారుచేసుకోవడము. ఎలాగైతే యజ్ఞానికి సహాయకులుగా అవ్వడమే సహాయం తీసుకోవడము వంటిదో, అలా గౌరవాన్ని ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడము. ఒక్కసారి ఇవ్వడమంటే అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వడము. చిన్నవారికి ప్రేమనివ్వండి మరియు పెద్దవారికి గౌరవమివ్వండి అని అంటూ ఉంటారు కదా. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావిస్తూ గౌరవాన్నిస్తారో, వారు అందరికీ స్నేహీలుగా అవుతారు. దీని కోసం ప్రతి విషయంలో ‘‘ముందు మీరు’’ అనే పాఠాన్ని పక్కా చేసుకోండి.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!