07 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

07 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

6 January 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతితో ఆత్మపై ఏర్పడిన వికారాల తుప్పును తొలగించే పురుషార్థం చేయండి’’

ప్రశ్న: -

తండ్రితో బుద్ధియోగం తెగిపోవడానికి ముఖ్యమైన కారణము మరియు జోడించేందుకు సహజమైన పురుషార్థం ఏమిటి?

జవాబు:-

దేహాభిమానంలోకి రావడం వలన, తండ్రి ఆజ్ఞను మర్చిపోవడం వలన, చెడు దృష్టి పెట్టుకోవడం వలన బుద్ధియోగం తెగిపోతుంది. అందుకే బాబా అంటారు, పిల్లలూ, ఎంత వీలైతే అంత ఆజ్ఞాకారిగా అవ్వండి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తి-పూర్తి పురుషార్థం చేయండి. అవినాశీ సర్జన్ యొక్క స్మృతితో ఆత్మను శుద్ధంగా తయారుచేసుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

రాబోయే రేపటికి మీరు..

ఓంశాంతి. శివ భగవానువాచ. పిల్లలు పాటను విన్నారు. మా ఎదురుగా బాబా కూర్చొన్నారు, వారిని పతిత-పావనుడు అని అంటారు అని పిల్లలు అర్థం చేసుకుంటారు. పరమపిత పరమాత్మను తప్పకుండా పతిత-పావన అని అంటారు. బ్రహ్మా, విష్ణు, శంకరులను పతితపావన అని అనరు. వారైతే జ్ఞానసాగరుడు. ఆత్మలమైన మేము పరమపిత పరమాత్మ నుండి జ్ఞానం వింటాము అని పిల్లలకు తెలుసు. మీరు ఇప్పుడు ఆత్మ-అభిమానులుగా అయ్యారు. ప్రపంచంలో అందరూ దేహ-అభిమానులుగా ఉన్నారు. ఆత్మ-అభిమానులు శ్రేష్ఠాచారులుగా అవుతారు. వారిని పరమాత్మనే కూర్చుని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మనే పాపాత్మగా, పుణ్యాత్మగా అవుతుంది. పాప శరీరి లేక పుణ్య శరీరి అని అనడం జరగదు. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. శరీరమైతే మళ్ళీ-మళ్ళీ వినాశనం అయిపోతుంది. శివబాబాను అవినాశీ సర్జన్ అని కూడా అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ కూడా అవినాశీ, తండ్రి కూడా అవినాశీ. ఆత్మ ఎప్పడూ వినాశనం అవ్వదు. అయితే, ఆత్మపై అసురత్వం యొక్క తుప్పు ఏర్పడుతుంది. ఎంతో అశుద్ధమైన కామ వికారం యొక్క నంబరువన్ తుప్పు ఏర్పడుతుంది, తర్వాత క్రోధం యొక్క తుప్పు. ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు కావున పరమపిత పరమాత్మ ఈ సాధారణ బ్రహ్మా తనువులో ప్రవేశిస్తారు అన్న పక్కా నిశ్చయం ఉండాలి. వారు ఈ రథం యొక్క సారథి. గుర్రపు బండి యొక్క రథం కాదు. పరమపిత పరమాత్మ పిల్లలకు అర్థం చేయిస్తారు, ఓ ఆత్మా, మీపై 5 వికారాల తుప్పు ఏర్పడి ఉంది. 5 వికారాలను రావణుడు అని అంటారు. రావణుడి తుప్పు ఏర్పడిన కారణంగానే మీరంతా వికారులుగా మరియు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు నేను మీ తుప్పును తొలగిస్తాను. ఈ తుప్పును తొలగించే సర్జన్ నేను ఒక్కడినే. మనుష్యాత్మకు వేరే సర్జన్ ఇంకెవ్వరూ ఉండలేరు. మనుష్యులు ఎప్పుడూ ఆత్మ తుప్పును తొలగించలేరు. ఈ తుప్పును తొలగించేందుకు సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క అవసరం ఉంది. వారంటారు, ఓ జీవాత్మలూ, ఓ నా పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే, మీ ఆత్మ యొక్క తుప్పు తొలగిపోతూ ఉంటుంది. స్మృతి చేయకపోతే తుప్పు తొలగదు. ధారణ లేకపోతే, ఉన్నత పదవిని కూడా పొందలేరు. తుప్పు ఏర్పడి ఉన్నవారిని పతితులు అని అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ పతితంగా అవుతుందో, అప్పుడు దానికి శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. సతోప్రధాన ఆత్మ అయితే, దానికి శరీరం కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. తుప్పు అనేది నెమ్మది-నెమ్మదిగా పిండిలో ఉప్పు అంత ఏర్పడుతుంది, తర్వాత ద్వాపరంలో చాలా తుప్పు ఏర్పడుతుంది. ఆత్మ కళలు నెమ్మది-నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. 16 నుండి 14 కళలు అవ్వడానికి 1250 సంవత్సరాలు పడుతుంది. బి.కె.లైన మేము, రాముని పిల్లలము అనే ఈ స్మృతి మీకు ఉండాలి. వారంతా రావణుని పిల్లలు ఎందుకంటే విషం ద్వారా జన్మిస్తారు. సత్యయుగంలో విషం ఉండనే ఉండదు. ఈ సమయంలో ఎవరు ఎన్ని ఆశీర్వాదాలిచ్చేవారున్నా కానీ, వారిపై కూడా ఆశీర్వాదాలిచ్చేవారు తప్పకుండా ఇంకెవరో ఉన్నారు. ఎలాగైతే పోప్ కోసం, వారు ఆశీర్వాదాలు ఇస్తారు అని అంటారు, కానీ వారికి కూడా ఉన్నతాతి ఉన్నతమైన పరమపిత పరమాత్ముని ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడైతే మీరు శ్రీమతంపై నడుస్తారో, అప్పుడు మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైతే ఆజ్ఞాకారిగా ఉండనే ఉండరో, వారికెలా ఆశీర్వాదాలు లభిస్తాయి, బాబా అంటారు – దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహం యొక్క అభిమానం ఉంది అంటే ఆజ్ఞను పాటించరు మరియు పదభ్రష్టులైపోతారు. ఇప్పుడు తండ్రి వచ్చారు, మీరు భారత్ ను శ్రేష్ఠాచారిగా తయారుచేసే సేవ చేస్తారు, మీకు 3 అడుగుల భూమి కూడా కష్టం మీద లభిస్తుంది. ఇప్పుడు నేను మీ కోసం మొత్తం సృష్టినే కొత్తగా తయారుచేస్తాను. ప్రదర్శనీలో మీరు పెద్ద-పెద్ద వారికి కూడా అర్థం చేయించవచ్చు – మేము ఈ ఉన్నతమైన సేవలో ఉన్నాము, భారత్ ను శ్రేష్ఠాచారిగా తయారుచేస్తున్నాము, ఎలా, వచ్చి అది అర్థం చేసుకోండి. మేము మీకు తెలుపగలము. ప్రదర్శనీ చూపించి అర్థం చేయించాలి, శ్రీమతమనేది ఒక్క పరమాత్మదే, వారు సదా ఏకరసంగా, పవిత్రంగా ఉంటారు, వారే అభోక్త(ఏమీ స్వీకరించని వారు), అసోచతా (ఆలోచనా రహితమైనవారు), జ్ఞానసాగరుడు. వారే స్వర్గం యొక్క స్థాపన చేస్తారు. వారి శ్రీమతంపై మనం భారత్ యొక్క సేవ చేస్తున్నాము. పాండవులకు 3 అడుగుల భూమి కూడా లభించేది కాదు అని గాయనం కూడా ఉంది కదా. అర్థం చేయించేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎప్పుడైతే యోగం పూర్తిగా ఉంటుందో, అప్పుడది సాధ్యమవుతుంది. దేహ-అభిమానం యొక్క తుప్పు కూడా అప్పుడే తొలగగలదు. బాబా సలహా ఇస్తారు, మేమంతా ప్రతిజ్ఞ చేసాము అని ఫలానా-ఫలానావారికి అర్థం చేయించండి. మా వద్దనైతే ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలు అన్ని హెడ్ ఆఫీసులలోనూ, ఢిల్లీ మరియు సెంటర్లలో కూడా ఉండాలి. ఇందులో కూడా చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఫోటోలు కూడా 3-4 కాపీలు ఉండాలి. కానీ మాయ ఏ సమయంలోనైనా, ఏ బిడ్డ పైన అయినా గెలుస్తుంది, అప్పుడు ఆశ్చర్యం కలిగేలా పరమపిత పరమాత్మకు చెందినవారిగా అవుతారు, విశ్వ రాజ్యాన్ని తీసుకుంటారు, అయినా కూడా పారిపోతారు.

ఇప్పుడు అనంతమైన తండ్రి అంటారు – నేను మొత్తం సృష్టిని మారుస్తాను, మళ్ళీ మీకు ఫస్ట్ క్లాస్ సృష్టిని తయారుచేసి ఇస్తాను. అక్కడ కూర్చుని మీరు రాజ్యం చేయండి, మిగిలినవారందరి వినాశనం జరుగుతుంది. పిల్లలు దేహీ-అభిమానిగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వడానికైతే అందరికీ హక్కు ఉంది, ఎప్పుడైతే తండ్రి వచ్చారో, అప్పుడు – నాతో యోగం జోడించండి, జ్ఞానామృతాన్ని తాగండి, అప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అయిపోతారు అని అంటారు. సన్యాసులు కూడా వికారాలను అసహ్యించుకుంటారు. పవిత్రంగా ఉండడమైతే మంచిది కదా. దేవతలు కూడా పవిత్రంగా ఉండేవారు. పతితం నుండి పావనంగా తండ్రే వచ్చి తయారుచేస్తారు. అక్కడ అందరూ నిర్వికారిగా ఉంటారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. భారత్ నిర్వికారిగా ఉన్నప్పుడు, బంగారు పిచ్చుకగా ఉండేది. ఇలా ఎవరు తయారుచేసారు? తప్పకుండా తండ్రి తయారుచేసి ఉంటారు. ఆత్మనే అపవిత్రంగా, రోగిగా అయ్యింది. ఇప్పుడు ఆత్మల సర్జన్ అయితే పరమాత్మ, మనుష్యులైతే కాలేరు. తండ్రి అంటారు – నేను స్వయం పతిత-పావనుడిని, నన్ను అందరూ స్మృతి చేస్తారు. పవిత్రంగా ఉండడమైతే మంచిది కదా. సాధు-సత్పురుషులు మొదలైనవారంతా నన్నే స్మృతి చేస్తూ వచ్చారు. పతితపావనా రండి, అని జన్మ-జన్మాంతరాలుగా స్మృతి చేస్తారు. కావున భగవంతుడు ఒక్కరే; అంతేకానీ భక్తులే భగవంతుడు అని కాదు. భగవంతుని గురించి కూడా తెలియదు. కల్పక్రితము కూడా నేను అర్థం చేయించాను. భగవానువాచ – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. బ్రహ్మా తనువులోకి వస్తాను, ఎవరైతే పూజ్యునిగా ఉండేవారో, వారు ఇప్పుడు పూజారిగా అయ్యారు. పావన రాజుగా ఉండేవారు, ఇప్పుడు పతిత పేదవానిగా అయ్యారు. మేము ప్రజాపిత బ్రహ్మా పిల్లలము, బి. కె.లము అని మీరు నిశ్చయం చేసుకుంటారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచించారు. బ్రాహ్మణులకే దానం ఇవ్వడం జరుగుతుంది. దేనిని దానంగా ఇస్తాను? మొత్తం విశ్వమంతటినీ. ఎవరైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి నా సేవ చేస్తారో, వారి సమ్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తాను – మీకు ఎప్పుడూ అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు చాలా ధైర్యం కావాలి. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మీరు వారిని స్మృతి చేస్తారు. వీరు జ్ఞానసాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు. వీరిని శివశక్తులు అని అనడం జరుగుతుంది. శివబాబాతో యోగం జోడించడంతో శక్తి లభిస్తుంది. 5 వికారాల తుప్పు వదులుతుంది. ఎప్పుడైతే సూది పవిత్రంగా (శుభ్రంగా) ఉంటుందో, అప్పుడు అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. ఆత్మలైన మీపై మాయ తుప్పు ఏర్పడి ఉంది. ఇప్పుడు నాతో యోగం జోడించడంతో తుప్పు తొలగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, అందరిదీ తమోప్రధాన బుద్ధి అందుకే పరమాత్మ అన్నారు, నేను వచ్చి అజామిళ్ వంటి పాపులను, వేశ్యలను, సాధువులు మొదలైనవారిని కూడా ఉద్ధరిస్తాను. అందరినీ శ్రేష్ఠాచారులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. పతితపావనుడైన తండ్రే వచ్చి ఈ మాతల ద్వారా భారత్ ను పావనంగా తయారుచేస్తారు, అందుకే మాతలు, పతితంగా అవ్వకుండా రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తారు. పురుషులు పవిత్రంగా ఉండనివ్వరు. ఇందులో మాకు సహాయం చేయండి అని మీరు గవర్నమెంట్ కు చెప్పాలి, కానీ స్త్రీ కూడా పక్కా నషా కలవారై ఉండాలి. అంతేకానీ, మళ్ళీ పతిని, పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉండేవారిగా ఉండకూడదు, అలా ఉంటే ఇంకా అధోగతి పాలవుతారు. ఎలాంటి యుక్తులను రచించాలి అని తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సుఖం యొక్క రోజులు రానున్నాయి. నేను మీకు బంగారు యుగ ప్రపంచాన్ని తయారుచేసి ఇస్తాను, దానిని స్వర్గం అని అంటారు. ఇప్పుడు శ్రీమతం చెప్తుంది – తండ్రినైన నాతో యోగం జోడించినట్లయితే, మీ తుప్పు తొలగిపోతుంది. లేదంటే ఇంతటి పదవిని పొందలేరు. ధారణ కూడా జరగదు. ఎటువంటి వికర్మలు చేయకూడదు. దేహ-అభిమానం రావడంతో బుద్ధియోగం తెగిపోతుంది. ఈ బ్రహ్మా కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తారు. పరమపిత పరమాత్మ ఈ బ్రహ్మా తనువులో కూర్చుని వీరికి చెప్తారు – ఓ బ్రహ్మా ఆత్మా, ఓ రాధే ఆత్మా, నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో మరియు శ్రీమతంపై పూర్తిగా నడుచుకుంటారో, అప్పుడు స్మృతి కలుగుతుంది. లోభం కూడా తక్కువేమీ కాదు. ఏదైనా మంచి పదార్థాన్ని చూసినట్లయితే తినాలని మనసు కలుగుతుంది, దీనిని లోభం అని అనడం జరుగుతుంది.

తండ్రి అంటారు – మాయ ఎలుక వలె ఊదుతుంది కూడా, కరుస్తుంది కూడా. శాస్త్రాలలో కూడా ఇటువంటి ఎన్నో కల్పితమైన కథలను రాసారు. అయితే, సన్యాసులు అంటారు, ఈ చిత్రాలు మీ కల్పన (ఊహ). బాబా ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. మేము ఏం చేసినా కూడా, బాబాకు తెలియదు అని అనుకోకండి. ఈ ప్రపంచంలో ఎంత అశుద్ధత ఉందో బాబాకు తెలుసు. అబలలపై అత్యాచారాలైతే జరిగేదే ఉంది. స్వయాన్ని యుక్తిగా రక్షించుకోవాలి. లేదంటే పదవి భ్రష్టమైపోతుంది. డ్రామానుసారంగా ఇదంతా జరిగేదే ఉంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మేమైతే అర్థం చేయిస్తూనే ఉంటాము, అయినా కూడా అర్థం చేసుకోకపోతే, కొందరు దాస దాసీలుగా అవుతారు, మరికొందరు ప్రజలుగా అవుతారు. డ్రామా విధి తయారుచేయబడింది. ఏం చేయగలరు! పేదవారు, షావుకార ప్రజలు అందరూ తప్పకుండా తయారయ్యేది ఉంది. బాబా రావడం కూడా భారత్ లోనే వస్తారు. ఇది అపవిత్రమైన స్థానము. తండ్రి వచ్చి మొత్తం ప్రపంచాన్ని పవిత్రమైన స్థానంగా తయారుచేస్తారు. భారత్ కే వెన్న అంతా లభిస్తుంది. కథ ఎంత సహజమైనది కానీ జ్ఞాన-యోగాలలో ఉండేందుకు చాలా ధైర్యం కావాలి. శ్రీమతంపై నడవకపోతే పదభ్రష్టులైపోతారు. బాబా డైరెక్షన్ ఇస్తారు, ఇలా-ఇలా అర్థం చేయించండి అని. అర్థం చేయించేవారు చాలా తెలివైనవారై ఉండాలి. తండ్రిపై ఎంత ప్రేమ ఉంటుంది! మేము శివబాబా రథం కోసం స్వెట్టర్ పంపిస్తాము అని ఎంత ప్రేమగా పిల్లలు రాస్తారు. శివబాబా మన అనంతమైన తండ్రి. మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. బుద్ధిలో ఆ బాబా గుర్తుకొస్తారు. శివబాబా రథానికి మేము టోలీ పంపిస్తాము, ఎలాగైతే హుస్సేన్ గుర్రాన్ని అలంకరిస్తారో, అలా శివబాబా రథాన్ని మేము అలంకరిస్తాము. ఇది సత్యాతి-సత్యమైన గుర్రము. పతిత-పావనుడైన బాబానే పావనంగా తయారుచేసేవారు. వీరు కూడా తమ అలంకరణ చేసుకుంటున్నారు. బాబాను కూడా స్మృతి చేస్తారు మరియు తమ పదవిని కూడా స్మృతి చేస్తారు. వీరు ఇరువురూ పక్కాగా ఉన్నారు. జ్ఞాన-జ్ఞానేశ్వరి మళ్ళీ రాజ-రాజేశ్వరిగా అవుతారు అన్నప్పుడు, తప్పకుండా వారి పిల్లలు కూడా అవ్వాలి. తప్పకుండా నంబరువారు పురుషార్థానుసారంగా యజమానులుగా అవుతారు. రాజయోగంతో రాజ-రాజేశ్వరిగా అవుతారు, ఇక ఎవరు ఎంత సేవ చేస్తే అంత, బాబా అయితే యుక్తులన్నీ తెలుపుతున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆజ్ఞాకారిగా అవ్వాలి. దేహీ-అభిమానిగా అయ్యేటువంటి ఆజ్ఞను పాటించాలి.

2. మాయ ఎలుక వంటిది, దాని నుండి తమను తాము సంభాళించుకోవాలి. లోభం పెట్టుకోకూడదు, శ్రీమతంపై పూర్తి-పూర్తిగా నడుచుకుంటూ ఉండాలి.

వరదానము:-

జ్ఞానీ-యోగీ ఆత్మలుగా అయితే అయ్యారు, ఇప్పుడు జ్ఞాన-యోగాల శక్తులను ప్రయోగంలోకి తీసుకువచ్చే ప్రయోగీ ఆత్మలుగా కండి. ఎలాగైతే సైన్సు సాధనాల ప్రయోగం లైట్ (కరెంటు) ద్వారా జరుగుతుందో, అలా సైలెన్స్ శక్తి యొక్క ఆధారం కూడా లైట్. అవినాశీ పరమాత్మ లైట్, ఆత్మిక లైట్, వాటితో పాటు ప్రాక్టికల్ స్థితి కూడా లైట్. కావున ఎప్పుడైనా ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు, లైట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపం డబల్ లైట్ గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలత సహజంగా లభిస్తుంది.

స్లోగన్:-

లవలీన స్థితిని అనుభవం చేయండి

త్యాగీ మరియు తపస్వీ ఆత్మలు సదా తండ్రి యొక్క లగనము (ప్రేమ)లో నిమగ్నమై ఉంటారు. వారు ప్రేమ సాగరంలో, జ్ఞానం, ఆనందం, సుఖం, శాంతి యొక్క సాగరంలో ఇమిడి ఉంటారు. ఇలా ఇమిడిపోయే పిల్లలే సత్యమైన తపస్వీలు. వారి ద్వారా ప్రతి విషయం యొక్క త్యాగం స్వతహాగా జరుగుతుంది.

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top