05 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
4 January 2022
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీకు ఇప్పుడు కొత్త జీవితం లభించింది, పాత జీవితం మారిపోయింది ఎందుకంటే మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, మీ ప్రీతి ఒక్క తండ్రితో ఉంది’’
ప్రశ్న: -
దేవతలుగా తయారవ్వబోతున్న బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి?
జవాబు:-
ఆ బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు అందరూ ఒకే మతం కలవారిగా ఉంటారు. వారి మధ్యన ఎప్పుడూ భేదాభిప్రాయాలు ఉండజాలవు, పరస్పరంలో గొడవలు జరగజాలవు. లౌకికంలో ఎవరైతే బ్రాహ్మణులుగా పిలవబడతారో, వారిలోనైతే అనేక మతాలు ఉంటాయి. కొందరు తమను తాము పుష్కరణీ బ్రాహ్మణులుగా, మరికొందరు సారసిద్ధ బ్రాహ్మణులుగా పిలుచుకుంటారు. బ్రాహ్మణులైన మీరు ఒక్క తండ్రి మతముతో దేవతలుగా అవుతారు. దేవతలలో కూడా ఎప్పుడూ గొడవలు జరగవు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఏ రోజు నుండి అయితే మేము మీరు కలిసామో..
ఓంశాంతి. ఎప్పుడైతే జీవాత్మలు మరియు పరమాత్మ అనగా పిల్లలు మరియు తండ్రి కలుసుకుంటారో, అప్పుడు కొత్త ప్రీతి ఏర్పడుతుంది ఎందుకంటే ఇతర సాంగత్యాల పట్ల ప్రీతి తెగిపోతుంది. ఎలాగైతే కన్యకు మొదట పుట్టింటి పట్ల ప్రీతి ఉంటుంది, నిశ్చితార్థం జరగడంతో కొత్త ప్రీతి జోడించబడుతుంది. వారికి మొత్తం అత్తవారిల్లు అంతా కొత్తగా ఉంటుంది. కొత్త ప్రపంచం పట్ల కొత్త ప్రీతి జోడించబడితే, అప్పుడు మొత్తం కొత్త పరివారంతో ప్రీతి జోడించబడుతుంది. ఆత్మలు, పరమాత్మ బహుకాలం వేరుగా ఉన్నారు… అని ఇప్పుడు గాయనం కూడా ఉంది. ఈ సుందరమైన మేళా కొత్తది. ఈ ఇల్లు కొత్తది, ఈ సంబంధాలు కొత్తవి. మేము బ్రహ్మాకుమారులము మరియు బ్రహ్మాకుమారీలము అని మీకు తెలుసు. శూద్ర కుమారులు మరియు కుమారీలు ఇప్పుడు లేరు. బ్రహ్మా మరియు బ్రహ్మాకుమార-కుమారీలకు పరస్పరంలో ఎంత ప్రేమ ఉంది ఎందుకంటే వీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడైతే నిరాకారుడు. వారి పట్ల ప్రేమ అనేది సాకారంలో ఉండాలి కదా. నిరాకారుడిని ఎలా ప్రేమిస్తారు. ఆత్మ శరీరం నుండి వేరైపోతే ప్రేమ ఉండదు. ఆత్మ మరియు పరమాత్మ ఎప్పుడైతే సాకారంలో కలుసుకుంటారో, అప్పుడు ప్రేమ ఉంటుంది. నిరాకార రూపంలోనైతే పాడుతూ ఉంటారు – మీరు మాతా-పిత… మీరు వచ్చినట్లయితే మీ కృపతో మాకు సుఖపు గనులు లభిస్తాయి అని. పతితపావనా రండి… అని పాడుతారు కదా. తప్పకుండా భారత్ మహాన్ గా ఉన్నప్పుడు అపారమైన సుఖముండేది. దాని పేరే సుఖధామము, ఇది దుఃఖధామము మరియు ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో, అది శాంతిధామము. అక్కడైతే ఆత్మలు పవిత్రంగానే ఉంటాయి. అపవిత్రమైన ఆత్మ ఎవరూ ఉండజాలరు. మీకు ఇప్పుడు తండ్రి లభించారు కావున కొత్త జీవితం లభించింది. పాత జీవితాన్ని మార్చి ఇప్పుడు కొత్త జీవితాన్ని తయారుచేస్తున్నారు. తమ తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. సుఖపు గనులు భారత్ లోనే ఉంటాయి – స్వర్గంలో. మరియు శాంతి గని నిర్వాణధామంలో ఉంటుంది, అది మీది మరియు మాది నివాస స్థానము. కావున ఆత్మలైన మనము, శాంతిధామంలో నివసించేవారము అని అర్థం చేయించాలి. తండ్రి కూడా అక్కడ నివసించేవారు. వారు మనలా జనన-మరణ చక్రంలోకి రారు. వాస్తవానికి వారు కూడా ఆత్మనే, కానీ వారు పరమ ఆత్మ, పరంధామంలో నివసించేవారు. ఆత్మలమైన మనం కూడా పరంధామంలో నివసించే పరమపిత పరమాత్ముని పిల్లలము. ఇల్లు అయితే మనందరిది అదే. ఇల్లు కూడా అందరికీ గుర్తుంది. ఎవరైనా మరణించినప్పుడు, ఫలానావారు దూరంగా ఉన్న నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు. అది వాణికి అతీతమైన స్థానము. ఎక్కడైతే సూర్య-చంద్రుల దుఃఖం లేదో, మేము అక్కడి నివాసులము. ఇప్పుడు బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు కొత్త విషయాలను మళ్ళీ వినిపిస్తారు. మనుష్యులు ఈ డ్రామాను తెలుసుకుంటే, అప్పుడు, మేము ఏ అడుగైతే వేస్తామో అది క్షణం-క్షణం కొత్తది అని అంటారు. అనంతమైన డ్రామా తిరుగుతూ ఉంటుంది. కావున తండ్రి వచ్చి కొత్త విషయాలను వినిపిస్తారు. పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శిగా, త్రినేత్రిగా తయారుచేస్తున్నాను. తండ్రి బ్రహ్మాండానికి యజమాని, అలానే త్రిలోకాలకు కూడా యజమాని కదా ఎందుకంటే మూడు లోకాల జ్ఞానాన్ని ఇస్తారు. మీరు త్రిలోకాలకు యజమానులుగా అవ్వరు. మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజులుగా-మహారాణులుగా అవుతారు. త్రిలోకాలను అనగా మూడు లోకాలను తెలుసుకోవడం జరుగుతుంది, యజమానిగా అయితే ఒక్క లోకానికి, స్వర్గానికి మాత్రమే అవుతారు. కనుక ఇవి కొత్త-కొత్త విషయాలు. వారసత్వం తీసుకోవడానికే బాబాకు పిల్లలుగా అవుతారు. ఎవరికైనా ఇది అర్థం చేయించడం చాలా సహజము. భగవంతునితో మీకు ఏం సంబంధం ఉంది అని అడగండి. భగవంతుడు అయితే స్వర్గం యొక్క రచయిత, వారు మాత-పిత. భగవంతుడిని ఎప్పుడూ నరకం లేక దుఃఖధామం యొక్క రచయిత అని అనరు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్వర్గం యొక్క స్థాపనను చేస్తారు. తప్పకుండా కొత్త ప్రపంచాన్నే, స్వర్గాన్నే రచిస్తారు. పరమాత్మ, బ్రహ్మా ద్వారా మొదట బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు, వారికి రాజయోగాన్ని నేర్పిస్తారు, వారు మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. కావున బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు, మళ్ళీ విష్ణువు ద్వారా దైవీ ధర్మం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయి, మళ్ళీ క్షత్రియులుగా కూడా అవుతారు, విష్ణు ధర్మంలోకి వెళ్తారు. ఇప్పుడు ఈశ్వరీయ ధర్మంలోకి అనగా బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు, తర్వాత భవిష్య దైవీ ధర్మంలోకి వెళ్తారు. బ్రాహ్మణ ధర్మం కూడా కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ముఖవంశావళి బ్రాహ్మణులను రచించారు, వారు పిల్లలు. సన్యాసులు కూడా ముఖం ద్వారా రచిస్తారు. కానీ వారు పిల్లలను రచించరు, వారు ఫాలోవర్స్ (అనుచరులు) ను రచిస్తారు. వారిని వంశము అని అనరు. నోటి ద్వారా, మీరు మా ఫాలోవర్స్ (అనుచరులు) అని అంటారు. వంశానికైతే వారసత్వం లభించాలి. రోజు-రోజుకు బ్రహ్మా ముఖవంశావళి యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. బి.కె లుగా చాలామంది అవుతూ ఉంటారు. ఎంతమంది దేవతలుగా తయారయ్యేది ఉందో, అంతమంది బ్రాహ్మణులు తప్పకుండా తయారవుతారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా మనుష్యులను బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తారు, కావున తప్పకుండా స్వర్గానికి యజమానులుగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి ఎంతో సమయం పట్టదు అని వారి గురించి గాయనం ఉంది. కావున బాబా వచ్చి ఈ కొత్త-కొత్త విషయాలను వినిపిస్తారు. ఇవి కొత్త ప్రపంచం కోసం కొత్త విషయాలు అయిన కారణంగా శాస్త్రాలలో ఎక్కడ కూడా ఈ విషయాలు లేవు, అందుకే మనుష్యులు తికమకపడతారు.
ఇది మీ ఈశ్వరీయ సంప్రదాయము. కానీ ఎవరైతే ఈశ్వరీయ సంతానంగా అయి, మళ్ళీ ఈశ్వరునికి విడాకులు ఇచ్చేస్తారో, వారు మళ్ళీ ఆసురీ సంప్రదాయం వారిగా అయిపోతారు. ఒక్కసారి మమ్మా-బాబా అని అన్నారంటే, జ్ఞానం విన్నారంటే, వారికి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. మమ్మా-బాబా అని అంటూ ఉంటారు. పితాశ్రీ, మాతేశ్వరి అని రాస్తారు కూడా. ప్రజాపిత బ్రహ్మా అయితే ప్రసిద్ధులు కదా! శివబాబా కూడా ప్రసిద్ధమైనవారే. ఆత్మ, గాడ్ ఫాదర్ అని అంటుంది. తండ్రి అంటారు – నేను మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మాను దత్తత తీసుకుంటాను. బ్రాహ్మణులంతా ఈ బ్రహ్మా యొక్క దత్తత సంతానం. కావున కొత్త రచన అయినట్లు కదా. తప్పకుండా చాలా మంది ఉంటారు. ఇంతమంది విషం ద్వారా ఏమైనా జన్మించగలరా. ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ అని అంటూ ఉంటారు కూడా. బ్రహ్మా కూడా ఒక్కరే, విష్ణువు కూడా ఒక్కరే, లక్ష్మీ-నారాయణులు కూడా ఒక్కరే, జగదంబ కూడా ఒక్కరే ఉంటారు. ఇవే ముఖ కవళికలు కలవారిని మళ్ళీ ఇంకెప్పుడూ చూడరు. ప్రతి ఒక్క మనిషిని మళ్ళీ కల్పం తర్వాతనే అవే ముఖ కవళికలతో చూడగలరు. ఇక్కడైతే ఒక్కరినే ఎన్నో రకాల ముఖ కవళికలతో తయారుచేస్తారు. ఇక్కడ చాలామందికి రాధేకృష్ణ అనే పేరు ఉంది. కానీ ఏమైనా అర్థం చేసుకుంటారా. రాధే, కృష్ణ అనే పేర్లు అయితే స్వర్గంలోని మొదటి రాకుమారుడు, రాకుమార్తెవి. మనమైతే పతితులము, మనమెలా ఈ పేర్లు పెట్టుకోగలము. కావున శివబాబా ఈ కొత్త-కొత్త విషయాలను వినిపిస్తారు, కొత్త ప్రపంచం కోసం ఇవి కొత్త విషయాలు, కొత్త జ్ఞానము. తండ్రి అంటారు – మేమే కల్ప క్రితం కూడా కొత్త విషయాలను వినిపించాము. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాము. మీరు ఇప్పుడు వింటున్నారు. మీరు దేవీ-దేవతలుగా తయారైపోతే, ఇక ఈ జ్ఞానం సమాప్తం అయిపోతుంది. ఇది ఎంతో ఉన్నతమైన ఎక్కడము. ఆశ్చర్యకరం కలిగేలా తమ తండ్రికి చెందినవారిగా అవుతారు, వింటారు, ఇతరులకు వినిపిస్తారు, అయినా కూడా, ఓహో మాయ, వారు పారిపోతారు అని కూడా పాడుతూ ఉంటారు. అప్పుడిక ఎవరికీ, బి.కె ల వద్దకు పదండి అని చెప్పలేరు కూడా. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. నథింగ్ న్యూ (కొత్తదేమీ కాదు). చాలామంది వస్తూ మరియు వెళ్తూ ఉంటారు. భట్టీలో కూర్చున్నవారు కూడా మాయతో ఓడిపోయి పారిపోయారు. స్వర్గంలోకైతే వస్తారు, ఎలాంటి పురుషార్థం చేసారో, అలాంటి పదవిని పొందుతారు. తమ గురించి లేక తమ సంబంధీకులు మొదలైనవారి గురించి ఎవరైనా అడిగితే చెప్పగలరు. ఈ పరిస్థితిలో ఏ పదవి లభిస్తుంది అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు! తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు – ఢిల్లీలో సర్వ ధర్మాల సమ్మేళనం జరుగుతుంది, ఇప్పుడు సృష్టిపై శాంతి ఎలా స్థాపన అవ్వగలదు లేక పరస్పరంలో కలిసి ఒక్కటిగా ఎలా అవ్వగలరు అని సమ్మేళనం జరుపుతారు! ఒకటిగా అయితే అవ్వలేరు. అది మత పెద్దల సమ్మేళనము, కానీ ధర్మాలు నంబరువారుగా ఎలా ఉంటాయి అనేదైతే వారికి తెలియదు. మొదటి ధర్మం ఏది? మత పెద్దలు అనగా ఎవరెవరైతే ధర్మాలను స్థాపన చేసారో, ఆ పెద్దలు రావాలి. ఎలాగైతే ముఖ్యమంత్రులు సమావేశం జరిగినప్పుడు దానికి కలెక్టర్ లేక జడ్జి మొదలైనవారు రాలేరు. గవర్నర్లకు పరస్పరంలో సమావేశం జరిగినప్పుడు గవర్నర్లు మాత్రమే వస్తారు. అయితే, గవర్నర్, తమ ప్రైవేటు సెక్రటరీ మొదలైనవారిని తమతో పాటు తీసుకురావచ్చు. ఈ ధర్మాలన్నీ నంబరువారుగా ఎలా స్థాపన అవుతాయి అనేది ఆలోచించాలి. అన్నింటికంటే పెద్ద ధర్మమేది? ఆది సనాతనమైనది అయితే దేవీ-దేవతా ధర్మమే. ఆ ధర్మ పెద్ద ఎక్కడ ఉన్నారు? ఆ ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు? కృష్ణుడు అయితే ఇప్పుడు లేరు. లేదంటే కృష్ణుడిని నమ్మేవారు ఉండాలి. వారు వల్లభాచారులు. కావున తప్పకుండా మనది దేవీ-దేవతా ధర్మము, వారు మళ్ళీ హిందూ ధర్మం అని అనేస్తారు. కానీ హిందూ ధర్మం అనేది అయితే లేదు. దేవతా ధర్మం వారు కూడా ఇప్పుడు ఎవరూ లేరు. కనుక మత పెద్దలు రావాలి. వారితో పాటు సెక్రెటరీ మొదలైనవారిని తీసుకురావచ్చు. ముఖ్యమైన ధర్మాలైతే నాలుగు, వాటి పెద్దలు రావాలి. దేవీ-దేవతా ధర్మం యొక్క పెద్ద ఎవరు? జ్ఞాన దేవి సరస్వతి, ప్రజాపిత బ్రహ్మా… అని అంటూ ఉంటారు. కావున తప్పకుండా వీరే పెద్దలై ఉంటారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మం ఏర్పడింది అని వారు కూడా భావిస్తారు. కానీ ఈ బ్రాహ్మణులను ఎలా చదివించి దేవతలుగా తయారుచేస్తారు అనేది తెలియదు. ఆ బ్రాహ్మణులు కూడా, మేము బ్రహ్మా సంతానము అని అంటారు కానీ ఎలా జన్మించారు, ఇది తెలియదు. మళ్ళీ బ్రాహ్మణులలో కూడా కొంతమంది పుష్కరిణీ బ్రాహ్మణులు, కొంతమంది సారసిద్ధ బ్రాహ్మణులు, కొంతమంది మరొక రకం వారు. ఇక్కడైతే బ్రహ్మా పిల్లలైన బ్రాహ్మణులే బ్రాహ్మణులు, వీరికి ఎటువంటి గొడవలు జరగవు. వేరే బ్రాహ్మణులకు గొడవలు జరుగుతాయి. వీరికి జరగవు. అలానే దేవతలకు ఎప్పుడూ గొడవలు జరగవు. సూర్యవంశీయులంతా సూర్యవంశీయులే, భేదాభిప్రాయాల మాటే ఉండదు. గొడవలలో ఎంత నష్టం జరుగుతుంది. కావున తండ్రి నుండి మీరు ఈ కొత్త-కొత్త విషయాలను వింటారు కదా. ఇక్కడ పాటలేమీ పాడరు, కొత్త రకమైన జ్ఞానాన్ని ఇస్తారు. మొత్తం సృష్టిచక్రం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. దానిని ధారణ చేయాలి. ఇటువంటి తండ్రి, టీచరు, గురువు అయినవారికి విడాకులిచ్చి చదువును విడిచిపెట్టవచ్చా. చదువును విడిచిపెట్టారు అంటే తండ్రిని విడిచిపెట్టినట్లు. విద్యార్థులుగా కారు అంటే పిల్లలు కూడా కారు. తండ్రిని విడిచిపెట్టారు అంటే వారసత్వాన్ని పోగొట్టుకున్నట్లు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే.
తండ్రి అంటారు – ఇది వినాశన సమయము, లెక్కాచారాలను సమాప్తం చేసుకొని అందరూ తిరిగి వెళ్ళా్లి. బంగారాన్ని అగ్నిలో వేసినట్లయితే, అది పవిత్రమవుతుంది. ఇప్పుడు అగ్ని అయితే మొత్తం ప్రపంచానికి అంటుకోనున్నది, కానీ ఈ అగ్నిలో పావనంగా అవ్వలేరు. ఇందులో యోగ బలం యొక్క విషయం ఉంది, లేదంటే శిక్షలు అనుభవించి శరీరాన్ని విడిచిపెడతారు, లెక్కాచారము సమాప్తం అవుతుంది. పాపము యొక్క లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని, మళ్ళీ పావనంగా అయి తిరిగి వెళ్ళా్లి. తిరిగి వెళ్ళే సమయం కూడా ఇదే. మహాభారత యుద్ధము కూడా ఉంది. హోలీని కూడా జరుపుకుంటారు. రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది, తర్వాత రామరాజ్యంలో చాలా కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు రావణ రాజ్యంలోనైతే చాలా మంది ఉన్నారు. ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? తప్పకుండా ముక్తిదాత కూడా కావాలి. తండ్రి అంటారు – నేను అందరినీ తీసుకువెళ్తాను, అందరి జ్యోతిని వెలిగించి తీసుకువెళ్తాను. తర్వాత ఎవరి పాత్రను వారు అభినయించాలి. మనము దేవీ-దేవతా ధర్మంలోకి వస్తామని మీకు తెలుసు. ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. 84 జన్మలను అనుభవిస్తారు. సూర్యవంశీయులగా, చంద్రవంశీయులగా… అవుతారు. మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేసింది. మీరు వస్తే, మేము మీకు శివబాబా కర్తవ్యం గురించి చెప్తాము అని ఆత్మ చెప్పగలదు. పిల్లలు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. వారు అంటారు, పరమాత్మ అయితే నిరాకారుడు, మరి వారి కర్తవ్యమేమని చెప్తారు! అరే, వారు పతితపావనుడు కనుక తప్పకుండా పావనంగా తయారుచేయడానికి వారు రావాలి. రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు, బ్రహ్మా ద్వారా ఎలా దేవీ-దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది, అది మేము తెలపగలము. కావున బాబా కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు, పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. కల్పక్రితం ఎవరైతే చదువుకున్నారో, వారే చదువుకుంటారు. చదవలేకపోతే పారిపోతారు. కొత్త విషమేమీ కాదు. అయినా కూడా, బాబాకు ఎల్లప్పుడూ పిల్లలపై ప్రేమ ఉంటుంది. పాపం మళ్ళీ వచ్చి తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయగలము? తండ్రికైతే ప్రేమ ఉంది కదా. ఎందుకంటే భక్తి మార్గంలో కూడా తండ్రిని చాలా స్మృతి చేస్తారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఉంటారో, వారు తప్పకుండా స్మృతి చేస్తూ ఉండవచ్చు. అర్ధకల్పము చాలా స్మృతి చేస్తారు. ఆత్మ సుఖం పొందింది కనుక దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తుంది. వారు చాలా భక్తి చేసి పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతారు. ఎవరైతే దేవీ-దేవతలు ఉండేవారో, వారిదే మళ్ళీ అంటు కట్టబడుతోంది.
కావున సమ్మేళనాలు మొదలైనవి ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే, అప్పుడు వాటికి ముఖ్య ధర్మాల వారిని పిలవాల్సి ఉంటుంది. బి.కె.లను పిలిస్తే, వారు పూర్తి సలహానిస్తారు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు మాత్రమే, ఏం చేయాలి, అన్న పూర్తి సలహాను ఇవ్వగలరు. మీరు శాంతిని కోరుకుంటారు కానీ శాంతి అయితే నిర్వాణధామంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడిది దుఃఖధామము, అనేక ధర్మాలు ఉన్నాయి. ఒకే ధర్మం ఉన్నప్పుడు సుఖము-శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడిది తప్పకుండా వినాశనం అవుతుంది. ఈ విషయంలో సంతోషించాలి, స్వర్గం యొక్క గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇలా-ఇలా పిల్లలు అర్థం చేయించాల్సి ఉంటుంది. అర్థమైందా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ కూడా తండ్రిని లేక చదువును విడిచిపెట్టి వారసత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఏక మతముగా ఉండాలి.
2. శిక్షల నుండి విడుదలయ్యేందుకు యోగబలంతో పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి.
వరదానము:-
నిమిత్తతనపు భావము బరువును సహజంగా సమాప్తం చేసేస్తుంది. నా బాధ్యత, నేనే సంభాళించాలి, నేనే ఆలోచించాలి… ఇలా అనుకుంటే బరువు అనిపిస్తుంది. బాధ్యత తండ్రిది మరియు తండ్రి ట్రస్టీగా అనగా నిమిత్తంగా చేసారు, ఈ స్మృతితో డబల్ లైట్ గా అయి ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉండండి. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో, అక్కడ బరువు ఉంటుంది, అందుకే ఎప్పుడైనా ఏదైనా కార్యంలో బరువు అనుభవమైనప్పుడు, చెక్ చేసుకోండి, ఎక్కడైనా పొరపాటున నీది అనేదానికి బదులుగా నాది అని అయితే అనటం లేదు కదా.
స్లోగన్:-
లవలీన స్థితిని అనుభవం చేయండి
ఎలాగైతే ఎవరైనా సాగరంలో ఇమిడిపోతే, ఆ సమయంలో సాగరం తప్ప ఇంకేదీ కనిపించదు, అలా పిల్లలైన మీరు సర్వ గుణాల సాగరంలో ఇమిడిపోండి. తండ్రిలో ఇమిడిపోవడం కాదు, కానీ తండ్రి స్మృతిలో, స్నేహ సాగరంలో ఇమిడిపోవాలి.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!