05 April 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

April 4, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి, టీచర్ మరియు సద్గురువు, ముగ్గురూ పరమ ప్రియమైనవారు, ముగ్గురూ ఒక్కరే, కనుక స్మృతి చేయడం సహజమవ్వాలి’’

ప్రశ్న: -

ఈ కలియుగంలో సదా యవ్వనంగా ఎవరు ఉంటారు మరియు ఏ విధంగా?

జవాబు:-

ఇక్కడ రావణుడు (వికారాలు) సదా యవ్వనంగా ఉంటాడు. మనుష్యులు వృద్ధులుగా అయినా కానీ వారిలో ఏవైతే వికారాలు ఉన్నాయో, క్రోధము ఉందో, అవి ఎప్పుడూ వృద్ధాప్యాన్ని పొందవు. అవి ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటాయి. మరణించే వరకు కూడా వికారాల యొక్క కోరిక ఉంటుంది. తండ్రి అంటారు, కామం మహాశత్రువు కానీ మనుష్యులకు అదే పరమ మిత్రుడు, అందుకే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నేనొక చిన్న బాలుడను… (మై ఏక్ నన్హా సా బచ్చా హూ…)

ఓంశాంతి. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. మేము ఈ సమయంలో మాయ అనగా బలశాలి అయిన రావణుడి సంకెళ్ళలో చిక్కుకుని ఉన్నాము అని భావిస్తారు. తండ్రి అంటారు, దీని నుండి విడిపించేవారు సమర్థుడు. ఆత్మలమైన మనం బలహీనులము అని పిల్లలైన మీకు తెలుసు. రావణుడు బలహీనులుగా చేసాడు. ఈ జ్ఞానం మనుష్యులు ఎవ్వరిలోనూ లేదు. తండ్రి కూర్చుని పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు ఎంతటి సర్వశక్తివంతులుగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు! ఇప్పుడు ఎంత నిరుపేదగా, బలహీనులుగా అయిపోయారు, అందుకే, ఓ పరమపిత పరమాత్మ, వచ్చి మమ్మల్ని ఈ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించండి, ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు. వారే పతితులను పావనంగా చేసేవారు. ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. స్వర్గాన్ని రామ రాజ్యమని, నరకాన్ని రావణ రాజ్యమని అంటారు. రావణుడు కూడా బలశాలి, రాముడు కూడా బలశాలి, ఎందుకంటే ఇరువురూ అర్ధకల్పం చొప్పున రాజ్యం చేస్తారు. మనుష్యులైతే అందరూ పతితులుగా ఉన్నారు. మీరు కూడా మొదట పతితంగా ఉండేవారు, ఇప్పుడు పతిత-పావనుడు వచ్చి పావనంగా అయ్యే జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. యోగము మరియు జ్ఞానము. మొదట అయితే తండ్రితో యోగం ఉండాలి. ప్రపంచంలో తండ్రి వేరు, టీచరు వేరు, గురువు వేరు. ఫలానా టీచరు మమ్మల్ని చదివిస్తున్నారని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మీరు మూడు సంబంధాలలోనూ ఒక్కరినే స్మృతి చేస్తారు. ముగ్గురి పేరు ఒక్కటే, శివ్. పరమప్రియమైన పరమపిత, పరమప్రియమైన శిక్షకుడు, పరమప్రియమైన సద్గురువు వారొక్కరే. మనుష్యులైతే టీచరును వేరుగా, గురువును వేరుగా, తండ్రిని వేరుగా గుర్తు చేస్తారు. వారి నామ-రూపాలు వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడ ముగ్గురిదీ ఒకే నామ-రూపము, అది బుద్ధిలోకి వస్తుంది. రూపం నిరాకారీ, పేరు శివ్. బుద్ధిలో ఒక్కరే గుర్తుకొస్తారు. శివబాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఈ మృత్యులోకం నుండి తీసుకువెళ్ళడానికి వస్తాను, దీనికి సంబంధించిన గుర్తులు కూడా చూస్తున్నారు. బలశాలిగా అయ్యే విషయంలో మాయ చాలా ఎదుర్కొంటుంది, విఘ్నాలు వేస్తుంది. మీరు చాలా దెబ్బలు తింటారు. మాయ కొన్నిసార్లు గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది, కొన్నిసార్లు నెమ్మదిగా. గట్టిగా ఎలా కొడుతుందంటే, ఇక వికారాల్లోకి కూడా పడిపోతారు. తర్వాత దాని ప్రభావం చాలా సమయం వరకు నడుస్తుంది. బుద్ధికి తాళం పడిపోయినట్లుగా అవుతుంది. ఇప్పుడు బాబా అంటారు, మాయ మరపింపజేయడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ మీరు మర్చిపోకూడదు. ఎంతగా మీరు నన్ను స్మృతి చేస్తారో, అంతగా వారసత్వం కూడా బుద్ధిలోకి వస్తుంది మరియు ఉన్నత పదవిని కూడా పొందుతారు. తండ్రి వారసత్వం గుర్తుకు రానటువంటి పిల్లలు ఎవరూ ఉండరు. వారసత్వం పిల్లల నుండి దాగి ఉండదు. మనము విశ్వ రాజ్యాన్ని నంబరువారు పురుషార్థానుసారంగా తీసుకుంటామని మీకు కూడా తెలుసు. అందరూ ఒకే విధమైన రాజధానిని తీసుకోలేరు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది, ఇతరులు ఎవరైతే వస్తారో, వారేమీ రాజధానిని స్థాపన చేయరు. వారు రావణ రాజ్యంలో వస్తారని – ఈ విధంగా అనరు. రావణుడి కనెక్షన్ భారత్ తోనే ఉంది. ఇక్కడే రావణుడిని కాలుస్తారు. వేరే చోట్ల అయితే రావణుడి గురించి తెలియదు. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యం ఉంటుంది. తప్పకుండా సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల నుండే ఇస్లామ్ ధర్మంవారు వెలువడి ఉంటారు. ఒక్క ధర్మం నుండే మళ్ళీ ఇతర వంశాలు వెలువడతాయి కదా. ఆ వంశం వెలువడినప్పుడు, ఆ సమయంలో అక్కడ రావణ రాజ్యం ఉంటుందని కాదు. అలా కాదు, అది తర్వాత వస్తుంది. బాబా అయితే వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. మిగిలినవారిలో కొందరు సగంలో, కొందరు నాల్గవ భాగంలో వస్తారు. సతోప్రధానం నుండి మళ్ళీ తమోప్రధానంగా అవ్వాలి. వారి కోసం అల్పకాలిక సుఖము మరియు బహుకాలపు దుఃఖము ఉంటుంది. ఈ ఆట కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మొదట పావనంగా ఉండేవారు, మళ్ళీ పతితంగా అవుతారు. మొదట ఒకటే దేవీ-దేవతా ధర్మం ఉండేది. తర్వాత ఇతర ధర్మాల వృద్ధి జరుగుతుంది. దేవతలు స్వయం హిందువులుగా అవుతారు. మళ్ళీ రకరకాలుగా అనేక రెట్లు వృద్ధి చెందుతూ ఉంటారు. వారు ఇక తమ ధర్మ స్థాపకుని వెనుకే వెళ్ళిపోతారు. దేవతా ధర్మం ప్రాయః లోపమైంది. అందరూ దేవీ-దేవతా ధర్మం వారే కానీ తమను తాము దేవతగా చెప్పుకోలేరు ఎందుకంటే పవిత్రంగా లేరు. పవిత్రత లేకుండా తమను తాము దేవతగా పిలిపించుకోవడం నియమవిరుద్ధము అయిపోతుంది. ఎవరైతే వాస్తవానికి దేవీ-దేవతలుగా ఉండేవారో, వారే మళ్ళీ క్షత్రియులుగా, మళ్ళీ వైశ్యులుగా, మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ విషయాలు ఇతర ధర్మాల వారు అర్థం చేసుకోరు. దేవతా ధర్మం వారే ఇక్కడికి వస్తారు, మిగిలినవారైతే తర్వాత వస్తూ ఉంటారు. మున్ముందు చాలా వృద్ధి జరుగుతుంది. ముఖ వంశావళి యొక్క వృద్ధి జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మా ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానము తప్పకుండా బ్రహ్మాకుమార-కుమారీలు అవుతారు కదా. బ్రాహ్మణ వర్ణం వారే దేవతలుగా అవుతారు. చాలామంది వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు.

సూర్యవంశీ రాజధానిలోకి రావడానికి మీరు పురుషార్థం చేస్తారు. వారిలో కూడా ముఖ్యమైనవారు 8 మంది. మిగిలినవారు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే మమ్మా-బాబాకు చెందినవారిగా అవుతారో, కొద్దిగానైనా వింటారో, వారు వచ్చేస్తారు. ప్రదర్శనీలో చాలామంది వస్తారు. వారి నుండి మంచి రీతిలో పురుషార్థం చేసేవారు కొందరు వెలువడుతారు. మొట్టమొదట తండ్రి పరిచయం తప్పకుండా ఉండాలి. అయితే, కొందరు లింగ రూపమని అంటారు లేక జ్యోతి స్వరూపమని అంటారు. తండ్రి అని భావించినట్లయితే, ఇక ఆ మహాతత్వము అయిన బ్రహ్మమును భగవంతుడు అని అనలేరు. పరమపిత పరమాత్మ జ్ఞాన సంపన్నులు. బ్రహ్మము ఏమైనా జ్ఞాన సంపన్నమైనదా. ఆత్మ రూపం ఏమిటి అని మీరు అడుగుతారు, అప్పుడు వారు లింగం అని చెప్తారు ఎందుకంటే లింగ రూపానికి పూజ జరుగుతుంది. స్టార్ (నక్షత్రం) యొక్క పూజ అయితే ఎక్కడా ఉండదు. తెలియని కారణంగా ఏదో ఒకటి తయారుచేసేస్తారు. రాయి-రప్పలు, అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నారని అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మ అయితే స్టార్, ఆత్మలన్నీ కలిసి ఉన్న గుంపును కూడా చూడవచ్చు. ఎప్పుడైతే ఆత్మలందరూ తిరిగి వెళ్తారో, అప్పుడు పెద్ద గుంపు ఉంటుంది కదా. దానిని సూక్ష్మాతి సూక్ష్మము అని అంటారు. సాక్షాత్కారాలతో ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేరు. ఎవరికైనా శివునిది మరియు బ్రహ్మా, విష్ణు, శంకరులది సాక్షాత్కారం అయినా కానీ లాభమేమీ ఉండదు. ఇక్కడైతే సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది చదువు. పరమాత్మ కూడా ఒక స్టార్. ఇంత చిన్న వస్తువుకు ఎంత మహిమ ఉందో చూడండి. జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు, సుఖసాగరుడు, వారే మొత్తమంతా చేస్తారు. వీటిని అతి గుహ్యమైన విషయాలు అని అనడం జరుగుతుంది.

తండ్రి అని అనడంతో తప్పకుండా స్వర్గ రచయిత అని బుద్ధిలోకి రావాలి. తప్పకుండా భగవంతుడు ఎక్కడో ఒక చోటకు వచ్చి ఉన్నారని కూడా అంటారు. ఒకవేళ గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అయితే, మరి ఆ దేహధారి దాగి ఉండలేరు. ఇవి పూర్తిగా గుహ్యమైన విషయాలు. పరమపిత పరమాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి అన్నది ఎప్పుడూ విననే లేదు. కేవలం – భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని అంటారు. ఇంకా దానిని పరమపిత పరమాత్మ అని అంటారు. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపంలో తేడా అయితే ఉండదు. పరమాత్మ ఏమైనా భారీ వస్తువా లేక పెద్ద వెలుగా? కాదు, వారు కేవలం జ్ఞాన సంపన్నులు. గతి-సద్గతి కోసం జ్ఞానాన్ని ఇస్తారు కావున వారు జ్ఞానసాగరుడు. ఇప్పుడు జ్ఞానసాగరుడు అని పరమపిత పరమాత్మను అంటారా లేక రావణ మతంపై నడిచే మనుష్యులనా? తండ్రి అంటారు, నేను అథారిటీని, ఇకపోతే, ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. బ్రహ్మా చేతుల్లో శాస్త్రాలను చూపిస్తారు. కానీ బ్రహ్మా ఎవరు అన్నది వారికి తెలియనే తెలియదు! తండ్రి అంటారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను, ఈ నందీ గణంలోకి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తాను. మనుష్యులు భగీరథుడిని కూడా చూపిస్తారు, గోముఖాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు భగీరథుడి నుండి కూడా గంగను చూపిస్తారు, ఎద్దు నుండి కూడా గంగను చూపిస్తారు. రైట్, రాంగ్ ఏమిటి అన్నది అర్థం చేసుకోరు. జంతువైన ఎద్దు నుండి గంగ ఏమైనా వెలువడుతుందా? గోముఖాన్ని చూపించినప్పుడు గోవు ఉండాలి. నందీ గణమును ఎద్దుగా చూపిస్తారు, వీరు పురుషుడు కనుక సరిపోతుంది. వీరు మనిషి. ఒకవేళ గోవు అని అన్నట్లయితే, అది కూడా మాతయే కదా. ఈ విషయాలను మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు, ఏదీ సరైనది చెప్పరు. బ్రహ్మా ద్వారా సూర్యవంశీ రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. ఇక్కడ రాజ్యమైతే ఏమీ లేదు. ఈ అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు. ఎవరైతే సూర్యవంశానికి, చంద్రవంశానికి చెందినవారిగా ఉంటారో, చదువు ద్వారా వారి బుద్ధిలోనే ఇది కూర్చుంటుంది. శివబాబానే మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్తారు అన్న నిశ్చయం మొదట ఉండాలి. ఇంకే గురువులు, పండితులకు ఇలా చెప్పే శక్తే లేదు. పతిత-పావనుడైతే ఒక్క తండ్రే, వచ్చి పావనంగా తయారుచేయండి అని వారినే స్మృతి చేస్తారు. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా, ఇది జరిగేదే ఉంది. పరమపిత పరమాత్మ తప్ప పావన ప్రపంచాన్ని ఎవరూ తయారుచేయలేరు. తండ్రి ద్వారానే సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్య వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే ఏ రాజ్యము లేదు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శాస్త్రాలు సత్యమైనవి ఎందుకంటే భగవంతుడే తయారుచేసారు – అని మనుష్యులు భావిస్తారు. భగవంతుడు మనిషి తనువులోకి వచ్చి గీతను వినిపించారని వారికి తెలియనే తెలియదు. దానిపై కృష్ణుని పేరును వేసారు. ఈ పొరపాటును బుద్ధి నుండి తొలగించాలి. మొదట శివబాబాను తెలుసుకోవాలి, అప్పుడు వారు స్వర్గ స్థాపన చేస్తారని అర్థం చేసుకుంటారు. తెలియకపోతే కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. తండ్రి అంటారు, మీరు స్వర్గంలో ఉన్నత పదవిని పొందడానికి యోగ్యులుగా లేరు, దైవీ గుణాలు కలవారిగా లేరు, ధారణ జరగకపోతే వికారాలు తప్పకుండా ఉంటాయి. ఎవరైనా వృద్ధులుగా ఉన్నా కానీ, క్రోధమనేది వారిలో కూడా చాలా ఉంది. క్రోధానికి వృద్ధాప్యం ఉండదు. ఈ రోజుల్లో వృద్ధులు కూడా వికారాల్లోకి వెళ్తారు. తండ్రి, కామం మహాశత్రువు అని అంటారు. కానీ మనుష్యులకు అది మిత్రుడు. వికారాల కోసం ఎంత విసిగిస్తారో చూడండి. రావణుడు అందరికీ మిత్రుడు. విషం ద్వారా జన్మించారు కదా. విషం యొక్క జన్మ అంటే రావణుని యొక్క జన్మ. ఇది మనుష్యులకు తెలియదు. తండ్రి శ్రీమతంపై నడుచుకున్నట్లయితే సుపుత్రులుగా పిలవబడతారు. వికర్మలు చేస్తే వెంటనే సావధానపర్చడం జరుగుతుంది. చాలామందిలో చాలా అలవాట్లు ఉంటాయి. అసత్యం మాట్లాడడము, దొంగలించడము, యాచించడము. తండ్రి అంటారు, నేను అయితే దాతను, మీరు ఎవరి నుండైనా ఎందుకు యాచిస్తారు! ఎవరికైతే ఇన్ష్యూర్ చేసుకునేది ఉంటుందో, వారు తమంతట తామే చేసుకుంటారు. ఎప్పుడూ అడగకండి. ఈ రోజు బాబా జన్మదినము, ఏదో ఒకటి పంపించండి అని ఈ విధంగా యాచించకండి. ఇన్ష్యూరెన్స్ చేసుకోవాలనుంటే చేసుకోండి అని అర్థం చేయించండి. భక్తి మార్గంలో మనుష్యులు తమను తాము ఈశ్వరుని వద్ద ఇన్ష్యూర్ చేసుకుంటారు, దానినే దానము అని అంటారు. దాని ఫలాన్ని కూడా తండ్రి ఇస్తారు. అది హద్దు ఇన్ష్యూరెన్స్, ఇది అనంతమైనది. పరమపిత పరమాత్మనే ఈ భక్తి ఫలాన్ని ఇచ్చారని భక్తి మార్గంలో అంటూ వచ్చారు. షావుకార్లు అయితే, ఇది గత కర్మల ఫలంగా లభించిందని అంటారు. కొందరు పేదవారిగా ఉంటారు ఎందుకంటే వారు ఇన్ష్యూరెన్స్ చేసుకోలేదు కావున ధనం లభించదు. అందరూ నా వద్దనే ఇన్ష్యూర్ చేసుకుంటారు అని తండ్రి అంటారు. ఇది భగవంతుడు ఇచ్చారని అంటారు. భక్తి మార్గంలో మీరు హద్దు ఇన్ష్యూరెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు డైరెక్టుగా అనంతమైన ఇన్ష్యూరెన్స్ చేసుకుంటారు. తల్లి-తండ్రిని చూడండి, ఇన్ష్యూరెన్స్ చేసారు కనుక వారికి రిటర్న్ లో ఎంతగా ఇస్తారు. కన్య వద్ద అయితే ధనం ఉండదు కనుక వారు ఈ సేవలో నిమగ్నమైనట్లయితే అందరికన్నా ఉన్నతిలోకి వెళ్ళగలరు. మమ్మా ఏదీ ఇన్ష్యూర్ చేయలేదు. అవును, శరీరాన్ని ఈ సేవలో ఇచ్చేసారు కనుక ఎంత ఉన్నత పదవిని పొందారు. నేను ఈ శరీరం ద్వారా ఈ అనంతమైన తండ్రి సేవ చేస్తున్నానని ఆత్మకు తెలుసు. జగదంబకు ఎంత పెద్ద పదవి ఉంది. జగదంబ జ్ఞాన-జ్ఞానేశ్వరి, మళ్ళీ వారే రాజ-రాజేశ్వరిగా అవుతారు. ఇవన్నీ మీకే తెలుసు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుపుత్రులుగా అవ్వడానికి తండ్రి శ్రీమతంపై నడుచుకోవాలి. అడగడము, దొంగలించడము, అసత్యం చెప్పడము మొదలైన చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని తొలగించివేయాలి.

2. తమదంతా తండ్రి వద్ద ఇన్ష్యూర్ చేసుకోవాలి. శరీరాన్ని కూడా ఈశ్వరీయ సేవలో పెట్టాలి. ఏ కారణం వలన మాయ ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి.

వరదానము:-

సంగమయుగంలో పిల్లలైన మీరు అందరికన్నా ఎక్కువ భాగ్యవంతులు, ఎందుకంటే స్వయం భగవంతుడే మిమ్మల్ని ఇష్టపడ్డారు. మీరు అనంతమైన యజమానులుగా అయ్యారు. భగవంతుడి డిక్షనరీలో ‘‘హూ ఈజ్ హు’’(ఎవరు ఎవరు) అన్నదానిలో మీ పేరు ఉంది. అనంతమైన తండ్రి లభించారు, అనంతమైన రాజ్య భాగ్యం లభించింది, అనంతమైన ఖజానా లభించింది… ఈ నషా సదా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన ఆత్మిక నషా, దీనిని అనుభవం చేస్తూ మరియు చేయిస్తూ ఉండండి, అప్పుడు భాగ్యశాలి అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top