04 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

04 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

3 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉన్నట్లయితే మంచి దశ ఉంటుంది, ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది కావున ఇది మీ ఎక్కే కళ”

ప్రశ్న: -

ఒకవేళ యోగం పట్ల పూర్తి అటెన్షన్ లేకపోతే దాని పరిణామం ఏమిటి? నిరంతరం స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏమిటి?

జవాబు:-

ఒకవేళ యోగం పట్ల పూర్తి అటెన్షన్ లేకపోతే నడుస్తూ-నడుస్తూ మాయ ప్రవేశిస్తుంది, పడిపోతారు. 2- దేహాభిమానులుగా అయి అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మాయ తప్పుడు కర్మలు చేయిస్తూ ఉంటుంది. పతితులుగా చేసేస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండేందుకు నోటిలో నాణెం వేసుకోండి, క్రోధం చేయకండి, దేహ సహితంగా అన్నింటినీ మరచి, నేను ఆత్మను, పరమాత్ముని బిడ్డను అనే అభ్యాసాన్ని చేయండి. యోగబలంతో ఏయే ప్రాప్తులు కలుగుతాయో, వాటిని స్మృతిలో ఉంచుకోండి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓం నమః శివాయ…

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి అయిన శివబాబా మహిమను విన్నారు. పాపాలు పెరిగినప్పుడు అనగా మనుష్యులు పాపాత్ములుగా అయినప్పుడే పతితపావనుడైన తండ్రి వస్తారు, వారు వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇది ఆ అనంతమైన తండ్రి మహిమనే, వారిని వృక్షపతి అని కూడా అంటారు. ఈ సమయంలో, అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి యొక్క అనంతమైన దశ మీపై కూర్చొని ఉంది. ముఖ్యంగా మరియు సాధారణంగా అని రెండు పదాలుంటాయి కదా. దీని అర్థం కూడా ఇక్కడే నిరూపించబడుతుంది. బృహస్పతి దశ ద్వారా ముఖ్యంగా భారత్ కు జీవన్ముక్తి లభిస్తుంది అనగా తన స్వరాజ్య పదవిని పొందుతుంది ఎందుకంటే సత్యమైన తండ్రి, ఎవరినైతే ట్రూత్ (సత్యం) అని అంటారో, వారు వచ్చి మనల్ని నరుని నుండి నారాయణునిగా చేస్తారు. మిగిలినవారంతా నంబరువారుగా తమ-తమ ధర్మాల సెక్షన్ల లోకి వెళ్ళి కూర్చొంటారు మరియు రావడం కూడా నంబరువారుగా వస్తారు. కలియుగ అంతిమం వరకు వస్తూనే ఉంటారు. ఆత్మలు ప్రతి ఒక్కరికీ తమ-తమ ధర్మాలలో తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. రాజ్యంలో రాజు నుండి మొదలుకొని ప్రజల వరకు అందరికీ తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి. నాటకంలో కూడా రాజు నుండి మొదలుకొని ప్రజల వరకు, అందరూ తమ-తమ పాత్రలను అభినయించాల్సి ఉంటుంది. మనపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చొని ఉందని పిల్లలకు ఇప్పుడు తెలుసు. ఈ దశ ఒక్క రోజు మాత్రమే కూర్చుంటుందని కాదు. మీపై బృహస్పతి దశయే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీది ఎక్కే కళ. ఎంత స్మృతి చేస్తే, అంత ఎక్కే కళ ఉంటుంది. స్మృతిని మర్చిపోయినట్లయితే మాయ విఘ్నాలు వస్తాయి. స్మృతితో మంచి దశ కూర్చొంటుంది. మంచి రీతిలో స్మృతి చేయకపోతే తప్పకుండా పడిపోతారు. అప్పుడిక వారి ద్వారా ఏవో ఒక పొరపాట్లు జరుగుతాయి. డ్రామానుసారంగా అన్ని ధర్మాలవారు ఒకరి తర్వాత ఒకరు పాత్రను అభినయించేందుకు వస్తారని బాబా అర్థం చేయించారు. స్వర్గ దశ అనగా జీవన్ముక్తి దశ ఇప్పుడు మనపై కూర్చొందని పిల్లలకు తెలుసు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుంది అనేది కూడా వివరంగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి డ్రామా చక్రం ముఖ్యంగా భారత్ పైన తయారై ఉంది. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు… అని అంటూ ఉంటారు. నడుస్తూ-నడుస్తూ మాయ ప్రవేశించిన కారణంగా పడిపోతారు. యోగం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టరు, అప్పుడిక తండ్రి వచ్చి సంజీవని మూలికను ఇస్తారు అనగా మేల్కొలిపే మూలికను ఇస్తారు. హనుమాన్ కూడా మీరే. ఈ సమయంలో రావణుడిని పారద్రోలేందుకు ఈ మూలిక వాసనను చూపిస్తానని తండ్రి అర్థం చేయించారు. తండ్రి మీకు సత్యమైన విషయాలన్నింటినీ తెలియజేస్తారు. తండ్రి ఒక్కరే సత్యము, వారు వచ్చి మీకు సత్యనారాయణుని కథను వినిపించి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. వీరిని ట్రూత్, సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. మీరు శాస్త్రాలను నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి – అవును, మేము శాస్త్రాలను ఎందుకు నమ్మము, ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలని తెలుసు, మేము వీటిని నమ్ముతాము. జ్ఞానం మరియు భక్తి, రెండు వేర్వేరు. జ్ఞానం లభించినప్పుడు ఇక భక్తి అవసరమేముంది. భక్తి అనగా దిగే కళ. జ్ఞానం అనగా ఎక్కే కళ. ఈ సమయంలో భక్తి నడుస్తుంది. ఇప్పుడు మనకు జ్ఞానం లభించింది, దీని ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తులను రక్షించేవారు భగవంతుడు ఒక్కరే. శత్రువుల నుండి రక్షించడం జరుగుతుంది కదా. తండ్రి అంటారు – నేను వచ్చి మిమ్మల్ని రావణుడి నుండి రక్షిస్తాను. రావణుడి నుండి ఎలా రక్షించబడతారు అనేది మీరు చూస్తున్నారు కదా. ఈ రావణుడిపై విజయం పొందాలి. తండ్రి అర్థం చేయిస్తారు – మధురమైన పిల్లలూ, ఈ రావణుడు మిమ్మల్ని తమోప్రధానంగా తయారుచేసాడు. సత్యయుగాన్ని సతోప్రధాన స్వర్గమని అంటారు. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. చివర్లో పూర్తిగా దేహాభిమానంలోకి వచ్చినప్పుడు పతితులుగా అయిపోతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు, నెల తర్వాత లేక 6 నెలల తర్వాత ఎంతో కొంత కళ తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరము ఇంటిని వైట్ వాష్ చేస్తారు. కళలైతే తగ్గిపోతూ ఉంటాయి కదా. కొత్త నుండి పాతగా, పాత నుండి మళ్ళీ కొత్తగా, మొదటి నుండి ప్రతి వస్తువు ఈ విధంగా అవుతూ వచ్చింది. ఈ ఇల్లు 100, 150 సంవత్సరాల వరకు నిలుస్తుందని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు – కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు, తర్వాత త్రేతాయుగం 25 శాతం తక్కువ అని అంటారు ఎందుకంటే కొద్దిగా పాతబడుతుంది. వారు చంద్రవంశీయులు. వారికి గుర్తుగా క్షత్రియులను చూపిస్తారు ఎందుకంటే వారు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేదు కనుక పదవి తగ్గిపోయింది. అందరూ కృష్ణపురికి వెళ్ళాలని కోరుకుంటారు. రామపురికి వెళ్ళాలని ఎప్పుడూ, ఎవరూ అనరు. అందరూ కృష్ణపురి కోసం అంటారు. బృందావనానికి పదండి, రాధా గోవిందుల భజన చేయండి… అని పాడుతారు కూడా. ఇది బృందావనానికి సంబంధించిన విషయము. అయోధ్య గురించి ఇలా అనరు. శ్రీ కృష్ణుని పట్ల అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. కృష్ణుడిని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. కృష్ణుడిని చూసినప్పుడు వీరిలాంటి పతి లభించాలి, వీరిలాంటి బిడ్డ లభించాలి, వీరిలాంటి సోదరుడు లభించాలని కోరుకుంటారు. బుద్ధివంతులైన పిల్లలు కృష్ణుని వంటి బిడ్డ లభించాలని వారి మూర్తిని ఎదురుగా పెట్టుకుంటారు. వారు కృష్ణుని ప్రేమలో చాలా లీనమై ఉంటారు కదా. కృష్ణపురిని అందరూ కోరుకుంటారు. ఇప్పుడిది కంసపురి, రావణపురి. కృష్ణపురికి చాలా మహత్వముంది. కృష్ణుడిని అందరూ స్మృతి చేస్తారు. అందుకే తండ్రి అంటారు – మీరు ఇంత సమయం బట్టి స్మృతి చేస్తూ వచ్చారు, ఇప్పుడు కృష్ణపురిలోకి వెళ్ళే పురుషార్థం చేయండి, వారి వంశంలోకైనా వెళ్ళండి. సూర్యవంశీయులు 8 తరాల పాటు ఉంటారు కావున రాజ్యంలోకి వచ్చి రాకుమారునితో పాటు ఊయల ఊగే అంత పురుషార్థము చేయండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. పిల్లలూ, ఎంత వీలైతే అంత మన్మనాభవగా ఉండండి. స్మృతిలో ఉండకపోతే పడిపోతారు. జ్ఞానం ఎప్పుడూ పడేయదు. స్మృతిలో ఉండకపోతే పడిపోతారు. దీని గురించి అల్లా అవల్దీన్, హాతమ్ తాయి నాటకాలు కూడా తయారుచేయబడి ఉన్నాయి. స్మృతిలో ఉండేందుకే నోటిలో నాణాన్ని వేసేవారు. ఎవరికైనా కోపం వస్తే, ఏదోకటి అనేస్తారు, అందుకే నోటిలో ఏదైనా వేసుకోండి అని అంటారు. ఏమీ అనకపోతే, కోపం రాదు. తండ్రి అంటారు – ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడకండి. కానీ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా శాస్త్రాలలో ఏదేదో రాసేసారు. తండ్రి కూర్చొని యథార్థంగా అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చినప్పుడే ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఠాగూర్, ఝాన్సీ రాణి ఒకప్పుడు ఉండి వెళ్ళారు, వారి నాటకాలను తయారుచేస్తారు. అచ్ఛా, శివుడు కూడా ఉండి వెళ్ళారు, అందుకే శివజయంతిని జరుపుకుంటారు కదా. కానీ, శివుడు ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏమి చేసారు అనేది తెలియదు. వారు మొత్తం సృష్టికి తండ్రి. వారు వచ్చి తప్పకుండా అందరికీ సద్గతిని ఇచ్చి ఉంటారు. ఇస్లాం, బౌద్ధ మొదలైన ధర్మాలను ఎవరైతే స్థాపన చేసి వెళ్ళారో, వారి జయంతిని జరుపుకుంటారు. అందరికీ తిథి, తారీఖులున్నాయి కానీ శివుని తిథి, తారీఖులు ఎవరికీ తెలియదు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేదని అంటారు కూడా. స్వస్తికను తయారుచేసినప్పుడు దానిని మొత్తం 4 భాగాలుగా చేస్తారు. 4 యుగాలు ఉన్నాయి. వాటి కాల పరిమితి ఎక్కువ తక్కువ అవ్వదు. జగన్నాథపురిలో బియ్యాన్ని అండాలో తయారుచేస్తారు. అది పూర్తిగా 4 భాగాలుగా అవుతుంది. తండ్రి అంటారు – భక్తి మార్గంలో అంతా కలగాపులగం చేసేసారు. ఇప్పుడు తండ్రి అంటారు – దేహ సహితంగా ఇవన్నీ మర్చిపోండి. నేను ఆత్మను, పరమపిత పరమాత్ముని బిడ్డను అనే అభ్యాసం చేయండి. బాబా స్వర్గ రచయిత కావున తప్పకుండా మనల్ని స్వర్గంలోకి పంపించి ఉంటారు. నరకంలోకైతే పంపించరు. తండ్రి ఎవరినీ నరకంలోకి పంపించరు. మొట్టమొదట అందరూ సుఖం అనుభవిస్తారు. ముందు సుఖము, తర్వాత దుఃఖము. తండ్రి సర్వుల దుఃఖహర్త-సుఖకర్త కదా. ఆత్మ ముందు సుఖాన్ని, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనం ముందు సతోప్రధానంగా ఉంటాము, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తామని వివేకం కూడా చెప్తుంది. విదేశీయులు తెలివైనవారని మనుష్యులు కూడా భావిస్తారు. అక్కడ ఎటువంటి బాంబులను తయారుచేస్తారంటే, వాటితో ఒక్కసారిగా అందరూ సమాప్తమైపోతారు. ఎలాగైతే ఈ రోజుల్లో శవాలను కరెంటుతో ఒక్కసారిగా సమాప్తం చేస్తారో, అలా బాంబులు వేయడంతో నిప్పు అంటుకుంటుంది, అప్పుడు మనుష్యులు కూడా వెంటనే సమాప్తమైపోతారు. అడవికి నిప్పు అంటుకోనున్నది. గ్రామాలకు గ్రామాలే సమాప్తమయ్యేలా తుఫానులు వస్తాయి. ఇక ఆ సమయంలో రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. గీతలో కూడా దీని వర్ణన ఉంది. తండ్రి అర్థం చేయించారు – యూరోప్ వాసులు బాంబులను ఎలా వేస్తారంటే, వాటిని వేస్తున్నట్లుగా అసలు తెలియనే తెలియదు. కల్పక్రితం కూడా వినాశనం జరిగింది, ఇప్పుడు కూడా జరగనున్నదని పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా కల్పక్రితం వలె చదువుకుంటున్నారు. నెమ్మది-నెమ్మదిగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ-చెందుతూ మళ్ళీ స్థాపన జరుగుతుంది. మాయ తుఫాన్లు చాలా మంచి-మంచి పుష్పాలను కూడా పడేస్తాయి. యోగంలో పూర్తిగా లేనట్లయితే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబాకు బిడ్డగా అయ్యి, పవిత్రత ప్రతిజ్ఞను చేసి, మళ్ళీ ఒకవేళ వికారాల్లో పడినట్లయితే పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. అప్పుడిక చాలా గట్టిగా ఎదురుదెబ్బ తగుల్తుంది. తండ్రి అంటారు – ఈ కామం యొక్క దెబ్బను ఎప్పుడూ తినకండి. ఇక్కడ రక్తపు నదులు ప్రవహించనున్నాయని పిల్లలకు తెలుసు. సత్యయుగంలో పాల నదులు ప్రవహిస్తాయి. అది కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. కలియుగంలో ఏమున్నాయో చూడండి, కొత్త ప్రపంచ వైభవాలను చూడండి. ఇక్కడ అసలేమీ లేదు. పిల్లలు సాక్షాత్కారంలో చూసి వస్తారు. సూక్ష్మవతనంలో శూబీరసాన్ని తాగినట్లుగా, ఏదో చేసినట్లుగా, అంతా సాక్షాత్కారమవుతాయి. మేము మూలవతనంలోకి వెళ్తాము, అక్కడ నుండి బాబా వైకుంఠంలోకి పంపిస్తారు అని చెప్తూ ఉంటారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి. వీటి ద్వారా ఏమీ లభించదు. చాలా మంది పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు, శూబీరసం మొదలైనవి తాగేవారు కానీ ఈ రోజు వారు లేరు. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు మాయం అయిపోయారు. ఎక్కువగా ధ్యానంలోకి, సాక్షాత్కారాలలోకి వెళ్ళినవారు వివాహం చేసుకున్నారు. అసలు మాయ ఎలాంటిది అని ఆశ్చర్యం కలుగుతుంది. భాగ్యం ఏ విధంగా తలక్రిందులుగా అయిపోతుంది. చాలా మంది మంచి-మంచి పాత్రలను అభినయించారు. అవసరమైన సమయంలో చాలా సహాయం కూడా చేసారు, అయినా కూడా వారు ఈ రోజు లేరు. అందుకే తండ్రి – మాయ, నీవు చాలా శక్తిశాలిగా ఉన్నావు అని అంటారు. మాయతో మీ యుద్ధం జరుగుతుంది. దీనిని యోగబలంతో చేసే యుద్ధమని అంటారు. యోగబలంతో ఏమి ప్రాప్తిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కేవలం భారత్ యొక్క ప్రాచీన యోగము అని అంటారు. ప్రాచీన రాజయోగము మహమ చేయబడినది అని మధురాతి మధురమైన పిల్లలకు యోగం గురించి అర్థం చేయించడం జరుగుతుంది. తత్వవేత్తలు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారెవ్వరిలోనూ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఆత్మిక తండ్రియే జ్ఞానసాగరుడు. వారి కోసమే శివాయ నమః అని పాడుతారు. వారి మహిమనే పాడారు. తండ్రి వచ్చి మీకు ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞానం యొక్క మూడవ నేత్రమని అంటారు, మిగిలినవారెవరికీ మేము త్రికాలదర్శులము అని చెప్పుకునే శక్తి లేదు. బ్రాహ్మణులు మాత్రమే త్రికాలదర్శులు, ఈ బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచించారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము కదా. శివుడిని, రుద్రుడు అని కూడా అంటారు. వారికి అనేక పేర్లు పెట్టేసారు. ప్రతి దేశంలో వేరు-వేరు పేర్లు చాలా ఉన్నాయి. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇన్ని పేర్లు లేవు. బబుల్ నాథ్ అని కూడా వీరినే అంటారు. ఎవరిలోనైతే ముళ్ళు ఉంటాయో, వారిని బబుల్ అని అంటారు. బాబా ముళ్ళను పుష్పాలుగా చేసేవారు, అందుకే వారికి బబుల్ నాథ్ అన్న పేరును పెట్టారు. బొంబాయిలో బబుల్ నాథ్ మందిరం వద్దన చాలా మేళాలు జరుగుతాయి. కానీ అర్థమేమీ తెలియదు. తండ్రి యొక్క కరెక్టు పేరు శివ అని వారు కూర్చొని అర్థం చేయిస్తారు. వ్యాపారస్థులు కూడా బిందువును శివ అని అంటారు. ఒకటి, రెండు అని లెక్క పెట్టినప్పుడు, 10 వస్తే శివ అని అంటారు. నేను బిందువును, నక్షత్రాన్ని అని తండ్రి కూడా అంటారు. చాలా మంది ఈ విధంగా మాతా-పితలకు గుర్తుగా రెండు తిలకాలను కూడా పెట్టుకుంటారు. అవి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రులకు గుర్తు. కానీ వారికి అర్థం తెలియదు. తండ్రి యోగం గురించి అర్థం చేయిస్తున్నారు. యోగం ఎంత ప్రసిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు యోగమనే పదాన్ని వదిలేయండి, స్మృతి చేయండి. తండ్రి చెప్తారు – యోగం అనే పదంతో అర్థం చేసుకోరు, స్మృతి అంటే అర్థం చేసుకుంటారు. తండ్రిని చాలా స్మృతి చేయాలి. వారిని ప్రియతముడని కూడా అంటారు. పట్టపురాణులుగా తయారుచేస్తారు కదా. విశ్వ రాజధాని వారసత్వాన్ని తండ్రి ఇస్తారు. సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తిలో ఇద్దరు తండ్రులు ఉంటారు మరియు జ్ఞాన మార్గంలో ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రులున్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయము. మీరు అర్థ సహితంగా తెలుసుకున్నారు – సత్యయుగంలో అందరూ సుఖంగా ఉంటారు, అందుకే వారికి పారలౌకిక తండ్రి గురించి అసలు తెలియదు. ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రుల గురించి తెలుసు. ఇవి ఎంత సులభంగా అర్థం చేసుకునే విషయాలు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతిలో ఉండేందుకు నోటితో ఏమీ మాట్లాడకండి. నోటిలో నాణెం వేసుకుంటే కోపం సమాప్తమైపోతుంది. ఎవరి పైనా కోపం చేయకూడదు.

2. ఈ దుఃఖధామానికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది, అందుకే దీనిని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. పవిత్రంగా ఉంటామని తండ్రికి ఏ ప్రతిజ్ఞనైతే చేసారో, అందులో పక్కాగా ఉండాలి.

వరదానము:-

ఏ పిల్లలైతే ‘పవిత్రత’ ప్రతిజ్ఞను సదా స్మృతిలో ఉంచుకుంటారో, వారికి సుఖ-శాంతుల అనుభూతి స్వతహాగా కలుగుతుంది. పవిత్రత యొక్క అధికారాన్ని తీసుకోవడంలో నంబర్ వన్ గా ఉండడమంటే సర్వ ప్రాప్తులలో నంబర్ వన్ గా అవ్వడము, అందుకే పవిత్రత పునాదిని ఎప్పుడూ బలహీనమవ్వనివ్వకండి, అప్పుడే లాస్ట్ సో ఫాస్ట్ గా వెళ్తారు. ఈ ధర్మంలోనే సదా స్థితులై ఉండాలి – ఏమి జరిగినా సరే – వ్యక్తులు, ప్రకృతి లేక పరిస్థితులు ఎంతగా కదిలించినా సరే, ధరణి బద్దలైనా ధర్మాన్ని వదలకండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top