03 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

2 November 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - లోపల-బయట స్వచ్ఛంగా తయారవ్వండి, మీలో ఇప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు”

ప్రశ్న: -

బ్రాహ్మణ పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏ-ఏ ధారణల పట్ల అటెన్షన్ పెట్టాలి?

జవాబు:-

1. ఈ జన్మలో తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత, వంద రెట్ల శిక్షలు అనుభవించే విధంగా ఏ పాప కర్మలు జరగకూడదు. 2. అతి మధురమైన తండ్రి మిమ్మల్ని తమ సమానంగా, మధురంగా తయారుచేస్తున్నారు కనుక నోటి ద్వారా ఇతరులకు దుఃఖం కలిగించే విధంగా ఎలాంటి చేదు మాటలు వెలువడకూడదు. 3. దుఃఖహర్త-సుఖకర్త పిల్లలుగా అయ్యి అందరి దుఃఖాలను హరించాలి. మనసా-వాచా-కర్మణా సుఖాన్ని ఇవ్వాలి. 4. నింద-స్తుతులలో సమానంగా ఉండాలి.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. సద్గురువారాన్ని వృక్షపతి రోజు అని కూడా అంటారు. వృక్షపతి రోజు అంటే తండ్రి రోజు. అమావాస్య నాడు అంధకార రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభమవుతుంది. చంద్రుడు ఉదయించడం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా పిండ ప్రదానం చేసేది ఉంటే, వారికి తినిపించి-తాగించి అంతా పూర్తి చేస్తారు, ఇక తిరిగి పిలవాల్సిన అవసరం ఉండదు. అందరినీ తృప్త పరచడం జరుగుతుంది. పగలులోకి వెళ్ళారంటే ఇక రాత్రిలోకి తిరిగి రావాల్సిన అవసరమేముంది. నిజానికి నియమం ఏమిటంటే – 12 నెలలు పూర్తి అయిన తర్వాత వారికి తినిపించి అంతా సమాప్తం చేయాలి. మళ్ళీ అంధకార రాత్రిలోకి ఎందుకు పిలవడం జరుగుతుంది. దీనిని కూడా బ్రాహ్మణులు ఒక ఆచార-పద్ధతిగా చేసుకున్నారు, అదే కొనసాగుతూ వస్తుంది. దీని వలన వారికి దక్షిణ మొదలైనవి లభిస్తూ ఉంటాయి. అది హద్దు అమావాస్య. ఇప్పుడు తండ్రి అనంతమైన అమావాస్యలోకి వచ్చారు. తండ్రి వచ్చారంటే అర్ధకల్పం యొక్క అంధకారం సమాప్తమవుతుంది. తర్వాత సత్యయుగంలో ప్రకాశమే ప్రకాశముంటుంది. అక్కడ ఎప్పుడూ ఎవ్వరూ పితృలకు తినిపించరు. ఇది అనంతమైన అమావాస్య. బ్రహ్మా రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి పూర్తి అయి పగలు వస్తుంది. తర్వాత ఎవ్వరూ పితృలకు తినిపించరు. అక్కడ బ్రాహ్మణులే ఉండరు. అలాగని ఎవ్వరూ మరణించరని కాదు. కానీ అక్కడ ఈ ఆచార-పద్ధతులు ఉండవు. ఇక్కడ బ్రాహ్మణులు కూడా అనేక రకాల వారు ఉన్నారు. ఒకే ప్రపంచం, ఒకే దేశం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇంత మందికి ఒకే దేశం ఉండడమనేది సాధ్యం కాదు. అయితే సత్యయుగం ఉన్నప్పుడు ఒకే రాజ్యం, ఒకటే ఆచార-పద్ధతులు ఉండేవి. దానిని తండ్రియే వచ్చి స్థాపన చేస్తారు. అక్కడ అందరూ చాలా మధురంగా ఉంటారు. దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఎప్పుడూ చేదుగా మాట్లాడరు, పాపాలు చేయరు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో, అంతటి పదవిని నంబరువారుగా పొందుతారు. అక్కడ ఎవరో దొంగతనం మొదలైనవి చేస్తారని కాదు. లోపల-బయట స్వచ్ఛంగా ఉంటారు. ఇక్కడ లోపల ఒకలా, బయట మరొకలా ఉంటారు. ఒకరినొకరు ఎంతగా నష్టపర్చుకుంటూ ఉంటారు. ఇదంతా రావణ రాజ్యంలోని అశుద్ధమైన చంచలత్వము. బాబా ఇప్పుడు దీనిని పూర్తిగా సమాప్తం చేయిస్తారు. ఒక్కసారిగా అందరి చెడు అలవాట్లు వెంటనే తొలగిపోవు, సమయం పడుతుంది. ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతంతగా, అడుగడుగులో – నేను యోగంలో ఉంటున్నానా, ఏ పాప కర్మ చేయడం లేదు కదా, స్వయం మధురంగా అయి ఇతరులను మధురంగా తయారుచేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉంటారు. స్వయమే చేదుగా ఉంటే ఇతరులను మధురంగా ఎలా తయారుచేస్తారు. ఇక్కడ వెంటనే ప్రత్యక్షమవుతారు, దాగి ఉండరు. తండ్రి అంటారు – నా పిల్లలుగా అయి ఏవైనా తప్పుడు కర్మలు చేస్తే చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. భగవంతుడు స్వయంగా కూర్చొని దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు. సర్వగుణ సంపన్నులు… అహింసా పరమోధర్మ…. అని దేవతల మహిమను చేస్తారు. హింస రెండు రకాలుగా ఉంటుంది – ఒకటి కామ ఖడ్గంతో చేసే హింస ద్వారా మనుష్యులు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. రెండవది – క్రోధంలోకి వచ్చి ఒకరినొకరు హతమార్చుకొని, దుఃఖాన్ని కలిగిస్తూ, దుఃఖితులుగా అవుతారు. మనసా-వాచా-కర్మణా అటువంటి కర్మలేవీ చేయకూడదని ఇక్కడ పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనం దుఃఖహర్త-సుఖకర్త పిల్లలము. కావున – దుఃఖాన్ని హరించి, సుఖాన్ని ఎలా ఇవ్వాలనే యుక్తిని మీరు అందరికీ తెలియజేయాలి. దీని ద్వారా గతంలో చేసిన కర్మల లెక్కాచారం సమాప్తమవుతుంది. ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తారు – ఈ జన్మలో చేసిన పాప కర్మలు అన్నింటినీ చెప్పినట్లయితే సగం కట్ అవుతాయి. కానీ అనేక జన్మలుగా చేసిన పాప కర్మలైతే తలపై ఉన్నాయి కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు – ఈ జన్మలో కూడా పాపం తయారయ్యే విధమైన కర్మలేవీ చేయకూడదు మరియు యోగబలంతో అనేక జన్మల పాప కర్మలను భస్మం చేసుకోవాలి. ఈ జన్మలో తండ్రికి చెందినవారిగా అయ్యి ఎలాంటి పాప కర్మ చేయకూడదు. బ్రాహ్మణులుగా అవ్వకుండా వారసత్వం లభించదు. వీరు బాప్ దాదా కదా. వారసత్వం మీకు వారి నుండి (శివబాబా నుండి) లభిస్తుంది, ఇతని ద్వారా (బ్రహ్మా ద్వారా) కాదు. ఇతను స్వయం గురించి ఏమీ చెప్పుకోరు. ఇతను కేవలం రథం మాత్రమే, ఇతని ద్వారా మీకు ఏమీ లభించదు. రథం గురించి కూడా మహిమ చేస్తారు. హుస్సేన్ రథం ఉంటుంది కదా, ఆ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు. ఇది పతిత తనువు కదా. ఇతను కూడా ఇప్పుడు అలంకరించబడుతున్నారు. తమ పురుషార్థంతోనే అలంకరించబడతారు. తండ్రి ఇతనిపై ఎలాంటి పక్షపాతం చూపించరు. అద్దె అయితే లభిస్తుంది కదా అని బాబా అప్పుడప్పుడు సరదాగా అంటూ ఉంటారు. కానీ, మీరు ఎలాగైతే పురుషార్థం చేయాల్సి ఉంటుందో, అలా ఇతను కూడా చేయాల్సి ఉంటుంది. అద్దె తీసుకోవాలనే ఆశ వారికి ఉండదు. బాబా అలా సరదాగా అంటారు. యోగబలంతోనే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఎంత యోగముంటుందో, అంత పావనంగా అవుతారు, అంతేకాక తమ సమానంగా కూడా తయారుచేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు తెలుసు – బాగా సేవ చేసేవారు పేరు-ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. వారిని బాబా సేవ చేసేందుకు పంపిస్తారు. మీరు చాలా మధురంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎవ్వరితోనూ గొడవపడకూడదు. బ్రాహ్మణులు చేదుగా మాట్లాడితే, వీరిలో క్రోధమనే భూతముందని అంటారు. నింద-స్తుతులలో సమానంగా ఉండాలి. చాలామందిలో క్రోధమనే భూతముంది, కనుక చాలా కోపగించుకుంటారు. అంతేకానీ అందరిలో క్రోధం తొలగిపోయిందని కాదు. ఎప్పటి వరకు అయితే సంపూర్ణంగా అయ్యే సమయం రాదో, అంతవరకు మాలిన్యం నెమ్మది-నెమ్మదిగా తొలగుతూ ఉంటుంది. మాలో క్రోధం లేదని అయితే ఎవ్వరూ అనలేరు. కొందరిలో ఎక్కువగా, కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరి మాటలు ఎలా ఉంటాయంటే – గొడవపడినట్లుగా అనిపిస్తుంది. పిల్లలు చాలా-చాలా మధురంగా తయారవ్వాలి. ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా తయారవ్వాలి. అనేక రకాల వికారాలున్నాయి కదా. కోపం చేయడం, అబద్ధం చెప్పడం – ఇవన్నీ వికారాలే.

తండ్రి అంటారు – పిల్లలూ, ఇప్పుడు ఏ వికర్మలు చేసినా కానీ చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ నాతో పాటు శిక్షలను ఇచ్చే ధర్మరాజు ఉన్నారు. ఇక్కడ శిక్షలు ప్రత్యక్షంగా లభిస్తాయి, ధర్మరాజు శిక్షలు గుప్తంగా లభిస్తాయి, గర్భజైలులో కూడా శిక్షలను అనుభవిస్తారు. కొంతమందికి అనారోగ్యం మొదలైనవి వస్తాయి, అది కూడా కర్మభోగమే. ధర్మరాజు ద్వారా శిక్షలు లభిస్తాయి. గతంలో చేసిన వాటికి కూడా ఇప్పుడే లభిస్తాయి. ఇప్పుడు చేసినవాటికి కూడా ఇప్పుడే లభిస్తాయి. తర్వాత గర్భజైలులో కూడా లభిస్తాయి. అవి గుప్తమైనవి, ధర్మరాజు అక్కడైతే శిక్షలను ఇవ్వరు కదా. ఇక్కడ శరీరంతో కర్మభోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని వీటి నుండి విడిపిస్తున్నారు. పరమపిత పరమాత్మ మరియు ధర్మరాజు అయిన బాబా ఇద్దరూ హాజరై ఉన్నారు. ఇప్పుడు ఇది అందరి యొక్క అంతిమ సమయము. ప్రతి ఒక్కరికీ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. సంపూర్ణంగా అవ్వాలని మీరు అనుకుంటున్నారు కనుక ఎలాంటి పాప కర్మలు చేయకండి. తమ కళ్యాణం కోసం ఎంత వీలైతే అంత, పూర్తిగా పురుషార్థం చేయాలి. ఎందుకంటే ఇది కల్ప-కల్పానికి సంబంధించిన విషయము. ఆ చదువు ఒక్క జన్మ కోసం ఉంటుంది. మరుసటి జన్మలో ఇంకొక చదువు ఉంటుంది. ఇది 21 జన్మల కు సంబంధించిన చదువు. అవినాశీ తండ్రి అవినాశీ చదువును చదివిస్తున్నారు, దీని ద్వారా 21 జన్మలకు అవినాశీ పదవి లభిస్తుంది. తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. ఇది పాత ప్రపంచం, కొత్త ప్రపంచంలో భారత్ ఒక్కటే ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ చక్రంలో మళ్ళీ తిరగాలి. కొత్త సృష్టి స్థాపన జరిగి పాతది వినాశనమవుతుంది. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని గాయనం ఉంది. బ్రాహ్మణులు తప్పకుండా ఉండాలి. అంటే తప్పకుండా పవిత్రంగా కూడా అవుతూ ఉండవచ్చు, రాజయోగం కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలైన మనం పవిత్రంగా అవుతున్నాము. ఇళ్ళు-వాకిళ్ళను వదలమని తండ్రి చెప్పరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. ‘బాప్ దాదా’ అన్న పేరు చాలా బాగుంది. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. వారు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. బ్రహ్మా పతితంగా ఉండేవారు కదా. ఇతను మొట్టమొదట శ్రేష్ఠాచారిగా, పూజ్యంగా, మహారాజుగా ఉండేవారు. ఇప్పుడు అంతిమంలో పతితంగా అయిపోయారు. ఇది వీరి యొక్క అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో పావనమైనవారు ఎక్కడ ఉన్నారు. పావన ప్రపంచంలో ఎవ్వరూ స్మృతి చేయరు. ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు… అని గాయనం కూడా చేయబడింది. ఈ లెక్కను కూడా మీరు అర్థం చేసుకున్నారు. సూర్యవంశీయులు ఎవరైతే ఉంటారో, వారు మొట్టమొదట తమ వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. ఇప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తే, స్వర్గానికి వెళ్ళారని అంటారు. మరి వారిని నరకంలోకి పిలిచే అవసరమే ఏముంది. ఏ మాత్రము అర్థం చేసుకోరు. సాధువులు-సత్పురుషులు మరణించినప్పుడు వారి వర్ధంతిని జరుపుకుంటారు, భోగ్ పెడుతూ ఉంటారు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అన్నప్పుడు మరి భోగ్ ఎందుకు పెడతారు. వర్ధంతిని ఎందుకు జరుపుకుంటారు? శరీరమైతే సమాప్తం అయ్యింది, ఆత్మ కూడా వెళ్ళిపోయింది, మళ్ళీ ఆత్మను పిలిచే అవసరమేముంది. జ్యోతి జ్యోతిలో లీనమైపోయిన తర్వాత మళ్ళీ ఎలా రాగలదు. అనేక రకాల మతాలున్నాయి. మనిషి మోక్షాన్ని పొందిన తర్వాత మళ్ళీ రారు అని కూడా అంటారు కదా. మోక్షం పొందారంటే ఇంకా సంతోషించాలి, ఎందుకంటే వారు పాత్రను అభినయించడం నుండి విముక్తులుగా అయ్యారు. తర్వాత వారిని గుర్తు కూడా చేయకూడదని కూడా మీకు తెలుసు. మనుష్యమాత్రులందరూ ఒక్క తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ సోదరులేనని కూడా ఒప్పుకుంటారు. మరి సోదరులకు తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి. సర్వాత్మల సద్గతిదాత ఒక్కరే. ఆత్మలందరూ తిరిగి వెళ్ళాలి. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని ఎలా ఇవ్వగలరు, అందుకే ఒక్క సర్వుల సద్గతిదాత పేరు మాత్రమే ప్రఖ్యాతి చెంది ఉంది. వారే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. ఆ తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తారు. దీనిని ‘అనంతమైన అమావాస్య’ అని అంటారు. అర్ధకల్పం అనంతమైన రాత్రి, మళ్ళీ అర్ధకల్పం అనంతమైన పగలు ఉంటుంది. ఇది ఒక ఆట. ధర్మ సమ్మేళనం చేసేవారు మిమ్మల్ని పిలిచినప్పుడు – శాంతి ఎలా ఉంటుందని అడిగితే, ఏక ధర్మం, ఏక మతం సత్యయుగంలోనే ఉంటుందని చెప్పండి. అది గడిచి 5 వేల సంవత్సరాల అవుతుంది. అక్కడ సుఖము, శాంతి అన్నీ ఉండేవి, మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మముండేది. పాత ప్రపంచంలో వృక్షం ఎంతగా పెరిగిపోతుంది. అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం మరియు ఏక ధర్మ స్థాపన చేయడం తండ్రి కర్తవ్యము. శివబాబా అంటారు – ఇది నా కర్తవ్యము. నేను కల్ప-కల్పం వచ్చి ఈ పని చేస్తాను. సత్యయుగ రాజధాని కోసం రాజయోగాన్ని తప్పకుండా సంగమంలోనే నేర్పిస్తాను. పతితులందరినీ పావనంగా తయారుచేస్తాను. నేను అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో వస్తాను. ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారో, అతని రథంలోనే వచ్చి అర్థం చేయిస్తాను. కొత్త ప్రపంచం లేనే లేదు. నేను పాత ప్రపంచంలోకే వచ్చి కొత్తగా తయారుచేస్తాను. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తాను. నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. సుఖంలో నన్ను ఎవ్వరూ స్మృతి చేయరు, దుఃఖంలో నన్ను స్మృతి చేస్తారు. ఒకప్పుడు తప్పకుండా సుఖం లభించి ఉంటుంది. తండ్రి అంటారు – నేను చదివించేందుకు వచ్చాను. ఇప్పుడు చదవడం అనేది మీ కర్తవ్యము. మనుష్యులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క నావ మునిగి ఉంది. ఎంత దుఃఖితులుగా ఉన్నారు. మీరు అందరి నావను తీరం దాటిస్తారు. అందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఈ విషయాలు మీ బుద్ధిలో నంబరువారుగా ఉన్నాయి. ఎవరైతే లైట్ హౌస్ గా తయారై ఉంటారో, వారు ఇతరులకు కూడా మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. వారి కర్తవ్యమే మార్గాన్ని చూపించడము. తండ్రి పిల్లలను ఎలా చదివిస్తున్నారు అని స్థిరమైన సంతోషముండాలి. ఇక్కడకు వచ్చి చాలా రిఫ్రెష్ అవుతారు. బయటకు వెళ్ళగానే నషా మాయమైపోతుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలనే కోరిక పెట్టుకోవాలి. అడుగడుగులోనూ తండ్రి నుండి సలహా తీసుకుంటూ ఉండండి. ఇంతకుముందు తీర్థ యాత్రలకు కాలి నడకన వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు. ఇప్పుడైతే బస్సులో లేక రైలులో వెళ్తారు. ఈ సమయంలో మాయ ఆర్భాటం చాలా ఉంది. సత్యయుగంలో వైభవముండేది, తర్వాత ద్వాపరం నుండి పడిపోతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చివర్లో మొదలయ్యింది. దీనినే మాయ షో అని అంటారు. ఎవరినైనా – స్వర్గంలోకి వెళ్దాము, పదండి అని అంటే, మాకు ఇక్కడే అన్ని సుఖాలు ఉన్నాయని అంటారు. వాహనాలు, విమానాలు మొదలైనవన్నీ ఉన్నాయి. మాకు స్వర్గం ఇక్కడే ఉంది. ధనం, వస్తువులు, నగలు మొదలైనవన్నీ ఉన్నాయి. లక్ష్మీనారాయణులకు కూడా నగలుండేవి కదా, మేము కూడా ధరిస్తాము అని అంటారు. ఎంతగా అర్థం చేయించినా వారికి విషమే గుర్తుంటుంది. విషం (వికారాలు) లేకుండా ఉండలేరు. తండ్రి అంటారు – మీరు నా మాట వినడం లేదు. పావనంగా అవ్వనప్పుడు, ఓ పతితపావనా రండి – అని నన్ను ఎందుకు పిలుస్తారు. గుర్తుంచుకోండి – ఇప్పుడు నా మాట వినకపోతే, ధర్మరాజు ద్వారా శిక్షలనిప్పిస్తాను. భయపెడతాను కూడా. చాలామంది పిల్లలు వికారాలలోకి వెళ్తూనే ఉంటారు, భయమే ఉండదు. వారు ఎన్ని కొరడా దెబ్బలు తింటారో, అడగకండి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి కదా. సాంగత్య దోషానికి వశమై ఎలా పడిపోతారంటే, తమ పదవిని పోగొట్టుకుంటారు. మీకు తెలుసు – ఇప్పుడు వజ్రాల గనులు మొదలైనవన్నీ ఖాళీ అవుతూ ఉన్నాయి, మళ్ళీ నిండుతాయి. బంగారం, వజ్రాల పర్వతాలుంటాయి. వజ్రాలను తవ్వి తీసినప్పుడు, అవి మొదట రాళ్ళు వలె ఉంటాయి, తర్వాత వాటిని శుభ్రం చేసి వజ్రంగా తయారుచేస్తారు. ఇప్పుడు మీకు కూడా జ్ఞానమనే పదును పెట్టినప్పుడు మీరు ఎంత బాగా తయారవుతారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడిది వినాశన సమయం కనుక ఏ పాప కర్మలు చేయకూడదు. తమ కళ్యాణం కోసం పురుషార్థం చేయాలి. చాలా మధురంగా తయారవ్వాలి. క్రోధాన్ని విడిచిపెట్టాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలనే కోరిక పెట్టుకోవాలి. అడుగడుగులోనూ తండ్రి సలహాను తీసుకోవాలి. తండ్రి సమానంగా దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.

వరదానము:-

పాస్ విత్ ఆనర్ (గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వడం) అనగా మనసులో కూడా సంకల్పాలతో శిక్షలను అనుభవించకూడదు. ధర్మరాజు శిక్షల విషయం తర్వాత, కానీ తమ సంకల్పాల సమస్యల నుండి మరియు శిక్షల నుండి అతీతంగా ఉండడం – ఇది పాస్ విత్ ఆనర్ గా అయ్యేవారి గుర్తు. వాణి, కర్మలు, సంబంధ-సంపర్కాల విషయం స్థూలమైనది, కానీ సంకల్పాలలో కూడా సమస్యలు ఉత్పన్నమవ్వకూడదని ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవుతారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top