03 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

03 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

2 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - బాప్ దాదాల ప్రియస్మృతులను అందుకోవాలంటే సర్వీసబుల్ గా అవ్వండి, బుద్ధిలో జ్ఞానము నిండుగా ఉన్నట్లయితే వర్షించండి”

ప్రశ్న: -

ఏ నషా, నిండుగా ఉన్న మేఘాలను కూడా కురవనివ్వకుండా పక్కకు తీసుకువెళ్ళిపోతుంది?

జవాబు:-

ఒకవేళ అనవసరమైన దేహాభిమానపు నషా వచ్చిందంటే, నిండుగా ఉన్న మేఘాలు కూడా పక్కకు వెళ్ళిపోతాయి. వారు వర్షించినా కానీ సర్వీస్ కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. ఒకవేళ బాబా పట్ల ప్రేమ లేకపోతే, వారితో యోగం లేకపోతే, జ్ఞానం ఉన్నా కూడా ఖాళీగా ఉన్నట్లే. ఈ విధమైన ఖాళీ మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఇంకా కొన్ని మేఘాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎలాగైతే వర్షం తగ్గిన తర్వాత సాగరంపై మేఘాలు ఉండవో, చల్లబడిపోతాయో, అలా ఇక్కడ కూడా చల్లబడిపోతారు. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి వెళ్ళి వర్షం కురిపిస్తారో, వారిని మేఘాలని అంటారు. ఒకవేళ ఎవరైనా వర్షించకపోతే, వారిని మేఘాలని అనరు. ఇవి జ్ఞాన మేఘాలు. అవి నీటి మేఘాలు. సీజన్ ఉన్నప్పుడు జ్ఞాన మేఘాలు వస్తాయి. వారు రిఫ్రెష్ అయి వెళ్ళి ఇతరులను రిఫ్రెష్ చేస్తారు. మేఘాలు కూడా నంబరువారుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా తీవ్రంగా వర్షిస్తాయి. మేఘాల పనే – వర్షించడము మరియు వాడిపోయిన మొక్కలను రిఫ్రెష్ చేయడము. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానముంటుందో, వారు దాగి ఉండరు. అలాంటివారికి బాబా డైరెక్షన్ కూడా అవసరముండదు. వారు ఎలాగూ మేఘాలు. వారు రావడం కూడా స్వయంలో నింపుకొని వర్షించేందుకే వస్తారు. ఎక్కడైనా బంజరు భూమిని చూసినట్లయితే, అక్కడకు వెళ్ళి దానిని సస్యశ్యామలంగా చేయాలి. మహారథి పిల్లలకు అన్ని సెంటర్ల గురించి బాగా తెలుసు. ఏ సెంటరు చల్లబడిపోయింది, ఏ సెంటరులోని పిల్లలకు ఎక్కువ తుఫానులు వస్తాయి అనేది మహారథి, సర్వీసబుల్ పిల్లలకు బాగా తెలుసు. సర్వీసబుల్ పిల్లలకు ప్రియస్మృతులు తెలపమని బాబా కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మంచి-మంచి మేఘాలు సేవ చేసేందుకు వెళ్తాయి. ప్రదర్శనీలో కూడా అందరూ ఒకే విధంగా ఏమీ అర్థం చేయించరు. ముఖ్యమైన విషయము ఏమిటంటే, గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మ, సాకారీ శ్రీకృష్ణుడు కాదు. అర్థం చేయించే విధానము చాలా బాగుండాలి. మేము వెళ్ళి అందరినీ మేల్కొల్పాలి అని రోజంతా ఈ ఆలోచనలే ఉండాలి. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. ఇద్దరు తండ్రులున్నారని అందరికీ ప్రేమగా అర్థం చేయిస్తూ ఉండండి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైనవారు. అనంతమైన తండ్రినే పతితపావనుడని అంటారు. పిల్లలైన మీకిప్పుడు బుద్ధి లభించింది. ప్రపంచంలోని మనుష్యులు చూడడానికి ఆర్భాటంగా కనిపిస్తారు కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సాధువులు అని చెప్పుకుంటున్న వీరందరినీ కూడా నేనే ఉద్ధరించవలసి ఉంటుందని స్వయంగా తండ్రి చెప్తున్నారు. వారికి కూడా రచయిత మరియు రచనల గురించి తెలియదు. సత్యయుగము నుండి మళ్ళీ ఈ జ్ఞానం ప్రాయః లోపమైపోతుంది. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం శాస్త్రాలలో లేదు. శాస్త్రాల ద్వారా ఎవరికీ సద్గతి కలగదు. గీతకు ఎంత గౌరవముంది. కానీ అది భక్తి మార్గము. తండ్రి అయితే పతితపావనుడు, వారు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. కనుక రాజ్యం కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విషయం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎవరికైతే కల్పక్రితం అర్థం చేయించి ఉంటారో, వారికే ఇప్పుడు అర్థం చేయిస్తారు, మళ్ళీ వారే అర్థం చేసుకుంటారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండే యుద్ధం వంటిదేమీ కాదు. ఆ యుద్ధాలైతే 8-10 సంవత్సరాలు జరిగిన తర్వాత సమాప్తమైపోతాయి. డ్రామానుసారంగా తయారైన బాంబులు అలాగే దాచి పెట్టుకునేందుకు ఏమీ కాదు. పతిత మనుష్యుల మృత్యువు జరగకుండా సత్యయుగం రాదు. శాంతి స్థాపన ఎలా జరుగుతుంది అనేది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శాంతిని స్థాపన చేయడం లేక శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని తయారుచేయడం ఒక్క తండ్రి పని మాత్రమే. తండ్రి అంటారు – ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరితోనే జోడించాలి, దేహ సహితంగా ఏవైతే కనిపిస్తున్నాయో, వాటన్నింటి నుండి సాంగత్యాన్ని తొలగించాలి. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి కనుక ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకమని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం అమరలోకానికి వెళ్ళేందుకు అమరకథను వింటున్నాము. దేవతలను దైవీ గుణాల కల మనుష్యులని అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు. కృష్ణుని గురించి కూడా ఎన్ని నిందలు రాసేసారు. వారికేమీ అర్థం కాదు.

ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిలో పురుషార్థం చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలని వేటినంటారో కూడా అర్థం చేయించడం జరుగుతుంది. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఇది మొట్టమొదటి, ముఖ్యమైన గుణము. పవిత్రమైనవారి ఎదురుగా అపవిత్రులు తల వంచి నమస్కరించడాన్ని మీరు అంతటా చూస్తూ ఉంటారు. సత్యయుగంలో పవిత్రమైనవారు ఉంటారు కనుక అక్కడ మందిరాలు ఉండవు. తర్వాత, పూజారులుగా అయినప్పుడు మందిరాలను తయారుచేస్తారు, పావనంగా ఉన్నవారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి అంటారు – ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. ఇది సమాప్తమవ్వడానికి సమయం పట్టదు. ఈ పాత ప్రపంచము, ధనము, సంపద, వస్తువులు, ఆస్తి అన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందని ప్రపంచంలోని వారెవరికీ తెలియదు. మీరు చెప్తారు కానీ వారికి నమ్మకం కలగాలి కదా. ఇది భగవానువాచ అని అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చొంటుంది.

పిల్లలైన మీకు తండ్రి చెప్తారు – స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అనంతమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారని పిల్లలకు తెలుసు. వారు ఆత్మలందరికీ తండ్రి. అందరూ సోదరులే. స్వర్గంలో సోదరులందరూ సుఖంగా ఉండేవారు, కలియుగంలో సోదరులందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా ఉన్నారు. ఆత్మ ఒక్కటే ఉండదు కదా, శరీరం కూడా కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇది పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ముందుగా పరమపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయముంటే, ఈ అవస్థ పక్కాగా తయారవుతుంది. ఈ శరీరం ద్వారా చదివించేందుకే శివబాబా వస్తారు. మనం కూడా శరీరం ద్వారానే వింటాము, ధారణ చేస్తాము. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేస్తారు. తండ్రి యుద్ధం చేసేవారి ఉదాహరణను ఇస్తారు. యుద్ధం చేసే సంస్కారాన్ని తీసుకువెళ్తారు, మళ్ళీ ఆ కోవలోకే వస్తారు. ఇప్పుడు నిరాకారుడైన అనంతమైన తండ్రిలో ఏ సంస్కారాలున్నాయి అని తండ్రి సంస్కారాల గురించి కూడా మీకు తెలుసు! వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, పతితపావనుడు, జ్ఞానసాగరుడు. వారే వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మల వికర్మలు వినాశనమవుతాయి, లేకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఏ పదవి లభించదు.

ఇప్పుడు, బాబా మనకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని పిల్లలకు తెలుసు. మన్మనాభవ అని అంటారు. ఈ పదం కూడా గీతలో ఉంది కానీ దీని అర్థాన్ని తెలుసుకోరు. తండ్రి అంటారు – నన్నొక్కరినే స్మృతి చేయండి, దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అని అంటారు. యోగమనేది కామన్ పదము. ఈ పదం గీతలో కూడా ఉంది కానీ కృష్ణుని పేరు వేయడంతో ఘోర అంధకారం ఏర్పడింది. ఇప్పుడు మీరు దీని గురించి అర్థం చేయిస్తే, ఇదంతా మీ కల్పన అని అంటారు. వారికి ఏమీ అర్థం కాదు. వారు వారసత్వాన్ని తీసుకునేది లేదు. ముందైతే, ఈ అనంతమైన తండ్రి, తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా, వారు మనల్ని చదివిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. కొత్త వారికి నిశ్చయం ఏర్పడడం అనేది అసంభవము. కొందరు కొత్తవారు కూడా వివేకవంతులుగా ఉంటారు, వారు అర్థం చేసుకుంటారు. కొందరు ఇక్కడకు రావాలని కూడా అనుకోరు, అసలేమీ అర్థం చేసుకోరు. కొంచెం కూడా బుద్ధిలోకి వెళ్ళదు. ఇంతమంది బి.కె.లు ఉన్నారంటే తప్పకుండా వీరికి తండ్రి నుండి వారసత్వం లభించి ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ అయినట్లు. పేరే బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు అని రాసి ఉందంటే ఫ్యామిలీ అయినట్లు కదా! ప్రజాపిత బ్రహ్మా యొక్క ఫ్యామిలీ ఎంత పెద్దది కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకీ రాదు. మీ లక్ష్యం-ఉద్దేశ్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే, బయట బోర్డుపైన – ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలని రాసి ఉంది, అంటే ఫ్యామిలీ అయినట్లు అని చెప్పండి. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మా నోటి ద్వారా శివబాబా రచనను రచిస్తారు కావున వారు రచయిత అయినట్లు, వారు స్వర్గాన్ని రచిస్తున్నారంటే తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇది ఫ్యామిలీ అయినట్లే కదా! తండ్రి, కొడుకులు, కూతుర్లు మరియు తాతగారు ఉన్నారు. బ్రహ్మా కూడా ఉన్నారు, శివుడు కూడా ఉన్నారు. వారు రచయిత. వారు నిరాకారుడు, మరి పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు. బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. దీనిని మంచి రీతిలో అర్థం చేయించాలి. వారికి ఇలా చెప్పండి – ఇది మీ తండ్రి ఇల్లు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. మనము బ్రాహ్మణులము, తండ్రి తప్ప ఇంకెవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీతలో కూడా ఉంది కదా – మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి అని. కనుక మనము ఆ తండ్రినే స్మృతి చేస్తాము. భక్తి మార్గంలో ఇలా పాడుతారు – మీరు వస్తే మేము బలిహారమవుతాము, మీ వారిగా అవుతాము. ఆత్మలైన మేము ఈ దేహాన్ని వదిలి మీతో పాటు వచ్చేస్తాము. మీ వారిగా అయ్యామంటే తప్పకుండా మీతో పాటు వస్తాము. నిశ్చితార్థం జరిగితే ప్రియుడు తమతో పాటు తీసుకువెళ్తారు కదా. ప్రియుడైన శివుడు కూడా – నేను మిమ్మల్ని ఈ దుఃఖం నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళ్తానని అంటారు. తర్వాత తమ-తమ పురుషార్థం అనుసారంగా అక్కడకు వెళ్ళి రాజ్యం చేస్తారు. ఎవరెంత జ్ఞాన ధనాన్ని ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. చిన్న-చిన్న కుమారీలు కూడా సేవ చేస్తున్నారు. వారే గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారికి అర్థం చేయించాలి. ఈ అభిరుచి ఉండాలి. కుస్తీ జరిగినప్పుడు, ఫలానావారితో మేము పోరాడుతామని పెద్ద-పెద్ద ఛాలెంజ్ లను చేస్తుంటారు. సర్వీసబుల్ పిల్లలు ప్రశాంతంగా నిద్రపోకూడదు. విశ్రాంతి తీసుకోవడము పాపము. ఎవరైతే స్వయాన్ని మహారథులుగా భావిస్తారో, వారు ప్రశాంతంగా నిద్రపోకూడదు. సేవలో తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా చాలా ప్రదర్శనీలను తయారుచేయిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళకు ఆహ్వానం పంపించండి. ఇప్పుడు కాకపోయినా చివర్లో వస్తారు. సాధువులు, సత్పురుషులు, మహాత్ములు ఎవరైనా కానీ వారిని మేల్కొలుపుతూ ఉండండి, కానీ వారితో మాట్లాడేవారు మహారథులు అయి ఉండాలి. ఎవరికైతే తండ్రితో యోగం లేదో, ప్రేమ లేదో వారు ఖాళీ మేఘాల వంటివారు. వారేమి చేస్తారు! చదువుకున్నవారి ముందు చదువుకోనివారు తల వంచి నమస్కరిస్తారని మీకు తెలుసు. నేనెంతవరకు చదువుకున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయం గురించి అర్థం చేసుకోగలరు. సేవ చేసి చూపిస్తాను. ఒకవేళ మేఘం నిండుగా ఉన్నా కానీ వర్షించకపోతే, ఆ మేఘం దేనికి పనికొస్తుంది. ప్రతి ఒక్కరికీ ఆ తెలివి ఉండాలి. అనవసరమైన దేహాభిమానపు నషాలో ఉన్నట్లయితే ఉన్నత పదవిని సదా కొరకు పోగొట్టుకుంటారు. బాబాకు సేవ పట్ల ఎంత అభిరుచి ఉంది. ప్రభుత్వానికి అర్థం చేయించాలి – మాకు హాలు ఇవ్వండి, అక్కడ మేము ఈ ఆత్మిక సేవను చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేస్తాము. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకే వచ్చారు కానీ ఈ విషయాన్ని యుక్తియుక్తంగా అర్థం చేయించాలి. ఉపన్యాసం ఇవ్వడం రానివారు అర్థం చేయించలేరు. వారు ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే సేవ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞానం లేకుండా భారత్ కు మరియు ప్రపంచానికి కళ్యాణం జరగదని పెద్ద-పెద్దవారికి రాయండి. చదువే ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఈ పదవిని పొందారు కదా. గత జన్మలో రాజయోగాన్ని నేర్చుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాము. స్కూలులోని విద్యార్థులు – మేము ఈ పరీక్ష రాసి, ఇలా తయారవుతాము అని భావిస్తారు. మీకు లభిస్తున్న ఈ జ్ఞానం ఈ ప్రపంచం కోసం కాదు. మీరు భవిష్య 21 జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేందుకు చదువుకుంటున్నారు. వారు ఈ జన్మలోని సుఖం కోసం చదువుకుంటారు. అందుకే, ఆ చదువు కూడా చదువుకోవాలి, దానితో పాటు ఈ శిక్షణను కూడా నేర్చుకోవాలి, ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు. చిత్రాలను తీసుకొని వెళ్ళి అర్థం చేయించాలి, ఈ జ్ఞానం అందరికీ అవసరమని చెప్పండి, కానీ కొందరు పిల్లలు నిలబడడం లేదు. ఉద్యోగ బాధ్యతలలో చిక్కుకొని ఉంటారు. బంధనముక్తులుగా ఉంటే వారు సేవలో నిమగ్నమవ్వాలి. అందరూ శ్రీమతంపై నడుచుకోరు. మధ్యలో మాయ అలజడి చేస్తుంది. కొంతమంది పిల్లలకు చాలా అభిరుచి ఉంది కానీ మేము వెళ్ళి అనేకుల కళ్యాణం చేయాలనే నషా ఎక్కడం లేదు. పిల్లలు పెద్దవారు అయిపోయారు కనుక ఎందుకు ఆగిపోతున్నారని బాబా కూడా అనుకుంటారు. మేము భారత్ ను ఉద్ధరించాలని చెప్పవచ్చు. సత్యమైన సేవ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచెయ్యాలి. నషా ఎక్కడం లేదని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది, అందుకే రజో బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా అంటారు. ఇది చాలా మంచి అవకాశము. జ్ఞానం యొక్క అహంకారం ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు, వారు చాలా డిస్సర్వీస్ చేస్తారు. దీని గురించి బెల్లానికి మరియు బెల్లం సంచికి మాత్రమే తెలుసు. రాహు గ్రహణం కూర్చొంటుంది. బృహస్పతి దశ తొలగి రాహు దశ కూర్చొంటుంది. ఇప్పుడిప్పుడే బాగా నడుస్తున్నట్లు కనిపిస్తారు, ఇప్పుడిప్పుడే గ్రహచారం కూర్చొంటుంది, కింద పడిపోతారు. పిల్లలు చాలా ధైర్యవంతులుగా ఉండాలి. మేము ఈ భారత్ ను స్వర్గంగా తయారు చేసే తీరుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం, భ్రష్టాచారులను శ్రేష్ఠాచారులుగా చేయడం మీ ధర్మము. బాబా చాలా బాగా నషా ఎక్కిస్తారు, కానీ పిల్లలకు నంబరువారుగా ఎక్కుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బంధనముక్తులుగా అయి భారత్ యొక్క సత్యమైన సేవను చేయాలి. ఆత్మిక సేవ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేయాలి. జ్ఞాన అహంకారంలోకి రాకూడదు. ఆత్మిక నషాలో ఉండాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ముందు తమ అవస్థను పక్కా చేసుకోవాలి. దేహ సహితం కనిపించే వాటన్నింటి నుండి తొలగి ఒక్క తండ్రితోనే జోడించాలి.

వరదానము:-

వ్యర్థ సంకల్పాలు మరియు పాత సంస్కారాలు దేహాభిమానానికి సంబంధించినవి. ఆత్మిక స్వరూప సంస్కారాలు తండ్రి సమానంగా ఉంటాయి. ఎలాగైతే తండ్రి సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయాహృదయుడు, వరదాత… గా ఉంటారో, అలా స్వయం యొక్క సంస్కారాలు కూడా న్యాచురల్ అయిపోవాలి. సంస్కారం తయారవ్వడం అనగా సంకల్పం, మాట మరియు కర్మ స్వతహాగా ఆ సంస్కారం అనుసారంగానే ఉండాలి. జీవితంలో సంస్కారం అనేది ఒక తాళంచెవి వంటిది, దాని ఆధారంగా స్వతహాగా నడుస్తూ ఉంటారు. శ్రమ చెయ్యాల్సిన అవసరముండదు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top