01 January 2022 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
31 December 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - మీరు సదా సేవ యొక్క ఆలోచనలలో ఉండాలి, జ్ఞానవంతులైన ఆత్మలుగా అవ్వాలి, సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు’’
ప్రశ్న: -
ఎవరైతే జ్ఞానవంతులైన పిల్లలు ఉంటారో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
వారు సదా సేవలో నిమగ్నమై ఉంటారు. అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేయడంలో వారికి సంతోషం ఉంటుంది. తండ్రి కూడా వారితో రాజీగా ఉంటారు. వారెప్పుడూ వ్యర్థమైన ఆహార-పానీయాలు మొదలైన ఆలోచనలలో సమయాన్ని వృథా చేయరు. వారికెప్పుడూ ఏడుపు రాజాలదు. వారికెప్పుడూ, ఫలానావారికి మేము జ్ఞానమిచ్చాము అనే అహంకారం రాదు. ఎల్లప్పుడూ బాబా ఇచ్చారు అని అంటారు.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
దుఃఖితులపై దయ చూపించండి..
ఓంశాంతి. బాబా ఇంతకుముందు దయ చూపించారు, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. దయ చూపించేవారు ఎవరు? మరి నిర్దయులు ఎవరు? వాస్తవానికి ఇది ఇప్పుడు మీకే తెలుసు. తండ్రి భారత్ పై దయ చూపించారు అనగా భారత్ ను వజ్రతుల్యంగా తయారుచేసారు, శ్రేష్ఠాచారీ దైవీ స్వరాజ్యాన్ని ఇచ్చారు. లక్ష్మీనారాయణులకు రాజ్య భాగ్యం ఎవరిచ్చారు అనేది మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా పరమపిత పరమాత్మ రచనను రచించారు. దేవతలు పరమపిత పరమాత్మ నుండి వారసత్వం తీసుకున్నారు, ఇది ప్రపంచానికి తెలియదు. భారతవాసులకు స్వరాజ్యముండేది. ఇంతకుముందు తండ్రి దయ చూపించారు, ఇప్పుడు మళ్ళీ దయ చూపమని అడుగుతున్నారు. దుఃఖీగా, నిరుపేదగా, భ్రష్టాచారిగా తయారుచేసిన నిర్దయుడు ఎవరు ఎదురయ్యారు! అతడి దిష్టి బొమ్మను సంవత్సరం-సంవత్సరం కాలుస్తూ ఉంటారు. ఈ రావణుడే దుఃఖమిచ్చాడు. ఎవరైతే దుఃఖమిస్తారో లేక విసిగిస్తారో, వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు, వారిని అవమానపరిచేందుకు దిష్టిబొమ్మను తయారుచేస్తారు. తండ్రి అంటారు – వీరందరూ పతితులు. స్వయాన్ని పతితులుగా కూడా భావిస్తారు, మళ్ళీ ఈశ్వరునిగా కూడా భావిస్తారు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ పరిస్తాన్ గా ఉండేదని వార్తాపత్రికలలో వేస్తారు కూడా. అందరికన్నా ముందు దేవతలు ఉండేవారు, ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారు వచ్చారు. పిల్లలకు లెక్కంతా అర్థం చేయించాను. మధ్యలో ఇతర ధర్మాలు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు భారతవాసులు చిత్రాలను కూడా నమ్ముతారు, అందుకే ఈ ప్రశ్నావళిని కూడా తయారుచేసారు. దీనిపై అర్థం చేయించడం చాలా సులభము. కానీ ఎవరిలోనైతే జ్ఞానం ఉండదో, వారిని మూర్ఖులు అని అంటారు. జ్ఞానం విని, మళ్ళీ ఇతరులకు వినిపించాలి. సేవలైతే వేరేవి కూడా చాలా ఉన్నాయి, కానీ అవి స్థూల సేవలు. కొందరు కమాండర్స్ గా, కొందరు జనరల్స్ గా, కొందరు పదాతి దళం వారు కూడా ఉంటారు. ఆహార-పానీయాలు మొదలైనవి తయారుచేయడం – ఇది కూడా సేవ, దీనికి కూడా తప్పకుండా ఫలం లభిస్తుంది. మేము జ్ఞానవంతులైన ఆత్మలకు సేవ చేస్తున్నాము అని భావిస్తారు. సేవ చేసేవారు హృదయాన్ని అధిరోహిస్తారు. అందరూ మహిమ చేస్తారు. అయితే, తప్పకుండా జ్ఞానవంతులైన ఆత్మలు తండ్రికి అతి ప్రియంగా అనిపిస్తారు. అలాగని ఇతరులు ప్రియంగా అనిపించరు అని కాదు, అందరి సేవ కనిపిస్తుంది. బాబాను ఎవరైనా, నేను హృదయాన్ని అధిరోహించానా అని అడిగితే, బాబా చెప్పగలరు. ఇకపోతే, ఎవరైతే కేవలం సేవ తీసుకుంటూ ఉంటారో, వారికేం లభిస్తుంది? అయితే, రాజధానిలోకి వస్తారు కానీ అంతటి పదవిని పొందలేరు. మీరు మిత్ర-సంబంధీకుల సేవ కూడా చాలా చేయగలరు. అనగా సేవ యొక్క ఆలోచన పెట్టుకోవాలి. వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకూడదు. వారిని బాబా మూర్ఖులని అంటారు. బాబా ఎంత మంచి పాయింట్లను అర్థం చేయిస్తారు. ప్రశ్నావళి కూడా చాలా బాగుంది. జగదంబ జ్ఞాన-జ్ఞానేశ్వరి. రాజ-రాజేశ్వరి లక్ష్మి. వారు సత్యయుగానికి చెందినవారు. జగదంబ యొక్క ఈ మహిమ ఈ సమయానిది. పిల్లలలో దృఢమైన ధారణ ఉండాలి. పరిపక్వ అవస్థ ఉండాలి, అప్పుడు హృదయాన్ని అధిరోహిస్తారు. స్కూల్ లో కూడా విద్యార్థులు నంబరువారుగా హృదయాన్ని అధిరోహిస్తారు. వెరైటీ వారుంటారు. అర్థం చేయించాల్సిన ఈ పాయింట్లు చాలా బాగున్నాయి. జగదంబను ధనలక్ష్మి అని అనరు. వీరు జగదంబ, వీరికి భగవంతుడు జ్ఞానమిచ్చారు, అందుకే సరస్వతిని జ్ఞాన దేవి అని అంటూ ఉంటారు. ఈ సమయంలో ఈ నామ రూపాలతో జ్ఞాన దేవిగా ఉన్నారు, ఈ జ్ఞానంతోనే మళ్ళీ పదవిని పొందారు. గత జన్మలో జ్ఞానాన్ని పొందారు, అప్పుడు లక్ష్మిగా అయ్యారు. లక్ష్మీ గత జన్మలో జగదంబగా ఉండేవారు. భూత, భవిష్య, వర్తమానాలలో ఏమవుతారు, ఇది చాలా స్పష్టమైన రహస్యము. ఒక్కొక్క విషయము చాలా బాగుంది. లక్ష్మీ ఎలా 84 జన్మలు తీసుకుంటారు, ఎక్కడెక్కడ తీసుకుంటారు, ఇవి అర్థం చేయించాల్సిన విషయాలు. అర్థం చేయిస్తున్నందుకు సంతోషం ఉంటుంది. దానం ఇవ్వడంలో సంతోషం కలుగుతుంది కదా.
తండ్రి అవినాశీ జ్ఞాన రత్నాలను దానం ఇస్తారు కావున ఇతరులకు దానం ఇచ్చే సేవ చేయాలి. కేవలం మమ్మా-బాబా వెనుక పడకూడదు. సేవలో నిమగ్నమవ్వాలి, అప్పుడు బాబా రాజీ అవుతారు. జ్ఞానవంతులు సేవలో నిమగ్నమై ఉంటారు. సేవలో నిమగ్నమవ్వకపోతే వారిని మూర్ఖులు అని అంటారు. మేము బాబా హృదయంలో లేము అని వారు భావిస్తారు. ఆహార-పానీయాల గురించి చాలా వ్యర్థమైన ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. బయట అయితే లక్ష్యము-ఉద్దేశ్యము చాలా బాగా రాయబడి ఉంది. ఇది పతితపావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అనే పేరు రాయబడి ఉంది. తండ్రి నుండి 21 జన్మల కోసం మళ్ళీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం యొక్క వారసత్వం లభిస్తుంది. బోర్డు పై కర్తవ్యం పూర్తిగా రాయబడి ఉంది. శివబాబా చిత్రం కూడా ఉంది. లక్ష్మీనారాయణుల చిత్రం కూడా ఉంది. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా రాసి ఉంది కానీ ఏమీ అర్థం చేసుకోరు. మళ్ళీ అడగరు కూడా. దుకాణం ఉంటుంది, దానిపై బోర్డు పెట్టి ఉంటుంది. ఇది పాల దుకాణం, ఇది ఫలానా దుకాణం అని. సత్సంగానికి ఎప్పుడూ బోర్డు ఉండదు. అది ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడైతే, 21 జన్మల కోసం దైవీ పదవిని ప్రాప్తి చేసుకునే శిక్షణ లభిస్తుంది అన్న బోర్డు పెట్టి ఉంది. అయినా కానీ బుద్ధిలో కూర్చోదు, అప్పుడు లోపలకి వచ్చి అడుగుతారు – ఇక్కడి ఉద్దేశ్యం ఏమిటి అని. కానీ లక్ష్యం-ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలిగేందుకు బోర్డు చదవరు. ఇది ఎవరి దుకాణము అనేది చూడాలి కదా. కానీ ఏమీ తెలియదు. ఆదిదేవ్ కు మహావీర్, హనుమాన్ అనే పేర్లు కూడా పెట్టేసారు. కానీ వారెవరు, ఎప్పుడు ఉండి వెళ్ళారు అనేది తెలియదు.
పిల్లలైన మీలో అర్థం చేయించగలిగే ధైర్యం కావాలి. ఒకవేళ అర్థం చేయించేవారిలోనే ఏదైనా వికారముంటే, ఎవ్వరికీ బాణం తగలదు. ఒకవేళ ఎవరికైనా బాణం తగిలినా కూడా, అది శివబాబా అర్థం చేయిస్తారు. ఎవరిలోనైనా ఏదైనా అవగుణముంటే, వారు అర్థం చేయించేది ఎవరికీ తగలదు. అక్కడ బాబా వచ్చి ఎవరికైనా దృష్టి ఇచ్చి, జ్ఞానాన్ని ఇస్తారు. నేను వీరికి చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాను, నా జ్ఞానంతో వీరిలో పరివర్తన వచ్చింది అని వారు భావించకూడదు. ఇది కూడా తప్పుడు అహంకారము. ఎవరిలోనైతే ఏడ్చే అలవాటు ఉంటుందో, వారు ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు విధవ అయినట్లు. వారెప్పుడూ నేను ఇతరులకు జ్ఞానం ఇవ్వగలను అని అనుకోకూడదు. అక్కడ, తండ్రి వారి కళ్యాణం చేస్తారు. ఏడిస్తే వారి దుర్గతి జరుగుతుంది. మేము హర్షితముఖులైన దేవీ-దేవతలుగా తయారయ్యేవారము అని మీకు తెలుసు. ఒకవేళ ఏడిస్తే, ఏవో చెడు కర్మలు చేసి ఉన్నారు, అవి మోసగిస్తాయి. మంచి-మంచి వారు కూడా ఏడుస్తారు. బాబా ఎవరినైనా లేవనెత్తేది ఉంటే, వారు స్వయం వచ్చి దృష్టి ఇస్తారు. ఏడ్చినట్లయితే విధవ. ఇక్కడ, మేము రామునికి చెందినవారిగా అయ్యాము అని అంటారు మరియు మళ్ళీ ఏడ్చినట్లయితే వారి రాముడు మరణించినట్లు. అనగా రాముడి నుండి బుద్ధియోగం తెగిపోయింది. విముఖులుగా ఉన్నారు. అవస్థ చాలా మంచిగా ఉండాలి. అయితే, కొందరు ప్రభావితులవుతారు, కానీ వారు బాబా శక్తితో ప్రభావితులవుతారు. బాబా ఏదైతే చెప్తారో, అందులో ఎటువంటి తప్పు ఉండదు, ఎందుకంటే తండ్రి ఉన్నదే సత్యము. ఒకవేళ ఏదైనా మాట వచ్చినా కానీ, పాడైన దానిని బాగుచేసే వారు కూర్చొని ఉన్నారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. తండ్రి అయితే సేవలో ఉపస్థితులై ఉన్నారు. వారు పిల్లలను కూడా చూసుకోవాలి. బి.కె.లు గా పిలవబడతారు కావున సహాయం కూడా చేస్తారు. బి.కె.లు ఒక్కొక్కరు ఇంకా నష్టం కలిగిస్తారు. వీరి నడవడిక ఇలా ఉంది, సరిగ్గా లేదు అని బాబాకు కూడా తెలుసు, అలాగే జిజ్ఞాసువులకు కూడా తెలుసు. అప్పుడు, బాబా వీరిని మీ వద్దకు పిలిపించుకోండి అని రాస్తారు.
పిల్లలైన మీరైతే దధీచి ఋషి వలె ఎముకలను ఇవ్వాలి. ఒకొక్కరైతే నవాబులా నడుచుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – ఈ సంపాదనలో కూడా గ్రహచారం కూర్చొంటుంది, దశలు మారుతాయి. అప్పుడప్పుడు బృహస్పతి, అప్పుడప్పుడు శుక్ర, అప్పుడప్పుడు మంగళ్, అప్పుడప్పుడు రాహు. అప్పుడు, ఒక్కసారిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. బాబా చాలా మంచి-మంచి పాయింట్లు అర్థం చేయిస్తారు. వారికి చెప్పండి – మీరైతే చాలా మంచి తెలివైన చదువుకున్నవారు, బోర్డు పైన పూర్తి లక్ష్యము-ఉద్దేశ్యము రాసి ఉంది అని. ఎప్పుడైతే లక్ష్యము-ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడే ఆ ఆత్మిక నషాతో లోపలికి రాగలరు. గాడ్ ఫాదర్ నుండి 21 జన్మలు మరియు 2500 సంవత్సరాల కోసం వారసత్వం లభిస్తుంది అని రాసి ఉంది. సూర్యవంశీ మరియు చంద్రవంశీ రాజధానులు. కొందరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఖాతాదారులు నంబరువారుగా ఉంటారు కదా. ఇవన్నీ శివబాబా దుకాణాలు. సేటు ఒక్కరే. ఈ దుకాణాలైతే వేలాది, లక్షలాది సంఖ్యలో వెలువడతాయి. సన్యాసులవి ఎన్ని దుకాణాలు ఉన్నాయి, విదేశాలలో కూడా ఉన్నాయి. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని మరియు జ్ఞానాన్ని సన్యాసులే ఇస్తూ ఉండవచ్చు అని విదేశాల వారు భావిస్తారు. కానీ అలా కాదు, ఇవైతే తండ్రే ఇస్తారు. మనుష్యులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. కానీ కేవలం ఇచ్చేటువంటి తండ్రి పేరును మార్చి పుత్రుని పేరు పెట్టేసారు. స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదరే కూర్చుని అర్థం చేయిస్తారు అని మీరు ఋజువు చేసి చెప్తారు. పోప్ కు కూడా రాస్తారు – మీరు భారత్ యాత్రకు వచ్చారు కానీ ఈ యాత్రను పూర్తిగా అర్థం చేసుకోలేదు, ఇప్పుడు మీరు చెప్తే మీ వద్దకు ఎవరినైనా పంపిస్తాము అని. ఇక్కడికైతే వారు రాలేరు. హోదా గురించి చాలా ఆలోచిస్తారు. ఇక్కడికైతే పేదవారు వస్తారు. క్రైస్టు బికారి అని అంటారు. ఈ సమయంలో మనం కూడా బికారులము, బికారుల నుండి రాకుమారులుగా తయారయ్యేవారము. ఎవరి వద్దనైనా చాలా ధనం ఉండవచ్చు, కానీ వారు బికారులు. క్రైస్టు పేదవారు అని అంటారు. తప్పకుండా పేదరికంలోనే జ్ఞానం తీసుకునేందుకు వస్తారు. సలామ్ అయితే చేయాలి. ఇది వినాశన సమయము. లెక్కాచారము సమాప్తం అవ్వనున్నది. మొట్టమొదట సలాం చేసేవారు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు, అలా వారు కూడా వస్తారు. మీ ఈ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది. కావున ముఖ్యమైన చిత్రము లక్ష్మీ-నారాయణులది. ఫస్ట్, సెకెండ్, థర్డ్ వారి చిత్రాలు కొనసాగుతూ వస్తాయి. మన చిత్రాలైతే వినాశనమైపోతాయి. ఏక్యురేట్ (ఖచ్చితమైన) చిత్రాలు ఏమైనా ఉన్నాయా. దిల్వాడా మందిరంలో కూడా జగదంబ మరియు లక్ష్మీనారాయణుల చిత్రాలున్నాయి. కానీ జ్ఞాన-జ్ఞానేశ్వరినే రాజ-రాజేశ్వరిగా అవుతారు అనేది ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు. చదువు సంపాదనకు ఆధారము. బ్రాహ్మణులే చదువుకుని దేవీ-దేవతలుగా అవుతారు. ఎంత స్పష్టంగా ఉంది.
తండ్రి అంటారు – నేను పిల్లలను ప్రత్యక్షం చేయాల్సి ఉంటుంది. అలాగని దాని ఫలం వారికి లభిస్తుందని కాదు. పిల్లలకు తాము చేసిన శ్రమ యొక్క ఫలం లభిస్తుంది. నేను సేవ చేస్తాను, ఎవరికైతే దృష్టి ఇస్తానో, అది వారి భాగ్యము. ఈ జగదంబ ఎవరు, ఏ ప్రారబ్ధాన్ని పొందారు – ఈ విషయాలు మనుష్యులకు తెలియవు. తండ్రి అర్థం చేయిస్తారు – మధురమైన పిల్లలూ, ఏడ్వడం కూడా అపశకునమే. ఇది అనంతమైన తండ్రి ఇల్లు కదా. ఎవరైతే స్వయం ఏడుస్తారో, వారు ఇతరులకు ఏం సేవ చేసి నవ్విస్తారు? ఇక్కడైతే నవ్వడం నేర్చుకోవాలి. నవ్వడం అనగా చిరునవ్వు నవ్వడము. గట్టిగా కూడా నవ్వకూడదు. ఎంత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. రోజు-రోజుకు జ్ఞానం సులభమవుతూ ఉంటుంది. మీలో కూడా శక్తి వస్తూ ఉంటుంది. అచ్ఛా –
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ కూడా తమ అహంకారాన్ని చూపించకూడదు. దధీచి ఋషి వలె సేవలో ఎముకలను ఇవ్వాలి.
2. సదా హర్షితముఖులుగా ఉండాలి, ఎప్పుడూ కూడా ఏడ్వకూడదు. ఏడ్వడం అనగా విధవగా అవ్వడము, అందుకే చిరునవ్వు నవ్వుతూ ఉండాలి, గట్టిగా కూడా నవ్వకూడదు.
వరదానము:-
సహజయోగము యొక్క అర్థమే – ఒక్కరిని స్మృతి చేయడము. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. తనువు-మనసు-ధనం అన్నీ నీవే, నావి కావు. ఇటువంటి ట్రస్టీలుగా అయి డబల్ లైట్ గా ఉండేవారే సహజయోగులు. సహజయోగులుగా అయ్యేందుకు సహజ విధి – ఒక్కరిని స్మృతి చేయడము, ఒక్కరిలో అన్నీ అనుభవం చేయడము. తండ్రే ప్రపంచము కనుక స్మృతి సహజమైపోయింది. అర్ధకల్పం శ్రమ చేసారు, ఇప్పుడు తండ్రి శ్రమ నుండి విడిపిస్తారు. కానీ ఒకవేళ ఇంకా శ్రమ చేయాల్సి వస్తే, దానికి కారణం మీ బలహీనత.
స్లోగన్:-
విశేషమైన అటెన్షన్:- ఈ జనవరి మాసం మన అందరికీ అతి ప్రియమైన పితాశ్రీ బ్రహ్మా బాబా యొక్క సంపన్నత మరియు సంపూర్ణత యొక్క విశేషమైన మాసము. పూర్తి మాసం బ్రహ్మా వత్సలమైన మనమంతా విశేషంగా శివ తండ్రితో పాటు బ్రహ్మా తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉంటాము. బాబా అంటారు, ఈ స్నేహంలో ఇమిడిపోవడం కూడా సమానంగా అవ్వడము. భక్తులు ఈ స్నేహంలో ఇమిడిపోయే స్థితి గురించే, ఆత్మ, పరమాత్మలో కలిసిపోతుందని అన్నారు. కనుక రండి, మనమందరం మొత్తం మాసమంతా ఆ లవలీన స్థితిలో ఇమిడిపోయే అనుభవం చేద్దాము, ఈ లక్ష్యంతోనే రోజు మురళీ కింద భాగంలో ప్రేమలో లీనమయ్యే ఒక విశేషమైన పాయింటును రాస్తున్నాము. మీరు దీని అనుసారంగా మురళీ క్లాసు తర్వాత రోజు 10 నిముషాలు యోగాభ్యాసం చేయండి.
లవలీన స్థితిని అనుభవం చేయండి
ప్రేమ సాగరుడైన తండ్రితో మిలనం జరుపుకుంటూ ప్రేమగా ‘బాబా’ అని అనండి మరియు ఆ ప్రేమలోనే ఇమిడిపోండి. లగన్ (ప్రేమ)లో నిమగ్నమైపోండి. ఈ లవలీన స్థితి మిగిలిన అన్ని విషయాలను సహజంగా సమాప్తం చేసేస్తుంది.
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!